BJP: ముస్లిం మత నాయకుడు నోమానీపై ఫిర్యాదు చేసిన బీజేపీ..
- వివాదాస్పత మత నాయకుడు నోమానీపై బీజేపీ ఫిర్యాదు..
- మహారాష్ట్ర ఎన్నికల్లో ముస్లింలు కాంగ్రెస్కి ఓటేయాలని పిలుపు..
- బీజేపీకి సహకరించే ముస్లింలను బహిష్కరించాలని ఫత్వా..
BJP: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో వివాదాస్పద ఫత్వా జారీ చేసిన ఇస్లామిక్ మత నాయకుడు మౌలానా సజ్జాద్ నోమానీపై బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు జమాల్ సిద్ధిఖీ ఢిల్లీలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్-ఉద్ధవ్ ఠాక్రే-శరద్ పవార్ కూటమికి ఓటేయాలని రాష్ట్రంలో ముస్లింలకు పిలుపునివ్వడంపై వీడియో వైరల్గా మారింది. మహారాష్ట్రలో బీజేపీ ఓటమి కేంద్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచగలదని తాను నమ్ముతున్నానని నోమని అన్నారు. ఈ వీడియోపై మహారాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ, కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షాలు ఓటమి భయంతో సమాజాన్ని విభజించడానికి ప్రయత్నిస్తున్నాయని పేర్కొంది.
Read Also: Bandi Sanjay : ‘ది సబర్మతి రిపోర్ట్’ మూవీ టాక్స్ మినహాయింపు ఇవ్వండి
Also Read
- Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
- Bengal exit polls: బీజేపీ వైపు నాలుగు, టీఎంసీ వైపు రెండు.. ఎగ్జిట్ పోల్స్తో ఉత్కంఠ..
- TM Exit Poll: తమిళనాడు సీఎంగా విజయ్.. సంచలనం స్పష్టిస్తున్న సర్వే..
- Measles Outbreak : బంగ్లాదేశ్ లో విజృంభిస్తున్న మీజిల్స్ మహమ్మారి..భారత్ కి ముప్పు తప్పదా ?
ఇదే కాకుండా.. నోమానీ మాట్లాడుతూ.. బీజేపీతో సంబంధం ఉన్న ముస్లింలను బహిష్కరించాలని, ఇస్లాం నుంచి తిరస్కరించాలని ఫత్వాలో పేర్కొన్నాడు. వివాదాస్పద ఫత్వాకు సంబంధించిన వీడియో కూడా విడుదలైంది. బీజేపీకి పనిచేస్తున్న ముస్లింలను విస్మరించాలని చెప్పారు. నోమానీ వ్యాఖ్యలు మహారాష్ట్రలో పాటు దేశవ్యాప్తంగా వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో విషయం తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిద్ధిఖీ ఢిల్లీ పోలీసులను కోరారు. ఈ ప్రకటన వల్ల సమాజంలో చీలికలు ఏర్పడి మత సామరస్యాలు చెలరేగే ప్రమాదం ఉందని, తక్షణమే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారుడు పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
‘‘ మసీదులు, ఇతర ప్రార్థనా స్థలాల వద్ద వారు(ముస్లింలు) ధిక్కారం, బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. మౌలానా ప్రకటనకు ప్రభావితమై, చాలా మంది వ్యక్తులు సోషల్ మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు’’ అని తనతో పాటు ఇతరులు కూడా బెదిరింపులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. నోమానీ తన వివాదాస్పద వ్యాఖ్యల్లో బీజేపీకి పనిచేసే ముస్లింలను ఘనశ్యామ్ అని పిలువాలని కోరారని, అటువంటి ఫత్వా కారణంగా, సమాజంలో విభజన, వారి జీవితాలకు ప్రమాదంతో పాటు మతసామరస్యం దెబ్బతింటుందని సిద్ధిఖీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?