BJP: ముస్లిం మత నాయకుడు నోమానీపై ఫిర్యాదు చేసిన బీజేపీ..
- వివాదాస్పత మత నాయకుడు నోమానీపై బీజేపీ ఫిర్యాదు..
- మహారాష్ట్ర ఎన్నికల్లో ముస్లింలు కాంగ్రెస్కి ఓటేయాలని పిలుపు..
- బీజేపీకి సహకరించే ముస్లింలను బహిష్కరించాలని ఫత్వా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో వివాదాస్పద ఫత్వా జారీ చేసిన ఇస్లామిక్ మత నాయకుడు మౌలానా సజ్జాద్ నోమానీపై బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు జమాల్ సిద్ధిఖీ ఢిల్లీలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్-ఉద్ధవ్ ఠాక్రే-శరద్ పవార్ కూటమికి ఓటేయాలని రాష్ట్రంలో ముస్లింలకు పిలుపునివ్వడంపై వీడియో వైరల్గా మారింది. మహారాష్ట్రలో బీజేపీ ఓటమి కేంద్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచగలదని తాను నమ్ముతున్నానని నోమని అన్నారు. ఈ వీడియోపై మహారాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ, కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షాలు ఓటమి భయంతో సమాజాన్ని విభజించడానికి ప్రయత్నిస్తున్నాయని పేర్కొంది.
Read Also: Bandi Sanjay : ‘ది సబర్మతి రిపోర్ట్’ మూవీ టాక్స్ మినహాయింపు ఇవ్వండి
Also Read
- PM Modi: వాదనలు బలంగా ఉండాలి.. శబ్దం కాదు.. వర్షాకాల సమావేశాలపై ప్రధాని కీలక వ్యాఖ్యలు
- Parliament March: ఢిల్లీలో హై అలర్ట్.. ఐదు కీలక మెట్రో స్టేషన్లు మూసివేత.. ప్రజలకు కీలక సూచనలు
- DMK MLA Markandeyan: డీఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్ అరెస్ట్.. ఎందుకంటే?
- Vande Mataram Bill 2026: 'వందేమాతరం'పై.. నేడు రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టనున్న అమిత్ షా
ఇదే కాకుండా.. నోమానీ మాట్లాడుతూ.. బీజేపీతో సంబంధం ఉన్న ముస్లింలను బహిష్కరించాలని, ఇస్లాం నుంచి తిరస్కరించాలని ఫత్వాలో పేర్కొన్నాడు. వివాదాస్పద ఫత్వాకు సంబంధించిన వీడియో కూడా విడుదలైంది. బీజేపీకి పనిచేస్తున్న ముస్లింలను విస్మరించాలని చెప్పారు. నోమానీ వ్యాఖ్యలు మహారాష్ట్రలో పాటు దేశవ్యాప్తంగా వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో విషయం తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిద్ధిఖీ ఢిల్లీ పోలీసులను కోరారు. ఈ ప్రకటన వల్ల సమాజంలో చీలికలు ఏర్పడి మత సామరస్యాలు చెలరేగే ప్రమాదం ఉందని, తక్షణమే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారుడు పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
‘‘ మసీదులు, ఇతర ప్రార్థనా స్థలాల వద్ద వారు(ముస్లింలు) ధిక్కారం, బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. మౌలానా ప్రకటనకు ప్రభావితమై, చాలా మంది వ్యక్తులు సోషల్ మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు’’ అని తనతో పాటు ఇతరులు కూడా బెదిరింపులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. నోమానీ తన వివాదాస్పద వ్యాఖ్యల్లో బీజేపీకి పనిచేసే ముస్లింలను ఘనశ్యామ్ అని పిలువాలని కోరారని, అటువంటి ఫత్వా కారణంగా, సమాజంలో విభజన, వారి జీవితాలకు ప్రమాదంతో పాటు మతసామరస్యం దెబ్బతింటుందని సిద్ధిఖీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Jung Ho-Yeon: ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీని ఆవిష్కరించిన తొలి కొరియన్ నటి.. ‘స్క్విడ్ గేమ్’ స్టార్ మరో అరుదైన ఘనత
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
PM Modi: వాదనలు బలంగా ఉండాలి.. శబ్దం కాదు.. వర్షాకాల సమావేశాలపై ప్రధాని కీలక వ్యాఖ్యలు
-
RAAKA: ‘రాకా’లో తెలుగు బ్యూటీ ఎంట్రీ…. అల్లు అర్జున్ సినిమాతో సిరి హనుమంతుకు బిగ్ బ్రేక్!
-
Towel Cleaning Tips: టవల్ ఉతికినా దుర్వాసన పోవట్లేదా? ఈ చిట్కాలతో సమస్యకు చెక్
ట్రెండింగ్
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
-
Rohit Sharma History: 50 ఏళ్ల లార్డ్స్ చరిత్రలో ఇదే మొదటిసారి.. తొలి బ్యాటర్గా రోహిత్ అరుదైన రికార్డు!
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!