Vijay Shah: మరోసారి ఇరకాటంలో మధ్యప్రదేశ్ మంత్రి.. విపక్షాలు ధ్వజం
- మరోసారి ఇరకాటంలో మధ్యప్రదేశ్ మంత్రి
- అత్యాచార బాధిత కుటుంబం ఫొటోలు వైరల్.. విపక్షాలు ధ్వజం
కల్నల్ సోఫియా ఖురేషిపై అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర ఇబ్బందులకు గురైన మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా మరోసారి ఇరకాటంలో పడ్డారు. అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన ఫొటో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆయన మరోసారి విమర్శల పాలయ్యారు.
ఇది కూడా చదవండి: Samantha : గోల్డెన్ శారీలో మెరిసిపోయిన సామ్..
Also Read
- India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
- Elections 2026: ఓటర్ల సునామీ.. బెంగాల్, తమిళనాడులో 1947 తర్వాత రికార్డ్ పోలింగ్
- Extramarital affair: భర్త స్నేహితుడితో ఏమిటా పని.. పైగా వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టేసింది..
- Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
మంత్రి విజయ్ షా.. అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించారు. పరిహారానికి సంబంధించిన చెక్కును అందజేశారు. అత్యాచార ఘటనల విషయంలో గోప్యతా పాటించాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని మంత్రి ఉల్లంఘించి.. ఆమె కుటుంబానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో మంత్రి గోప్యతను ఉల్లంఘించారంటూ విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Botsa Satyanarayana: మాజీ మంత్రి బొత్స సత్య నారాయణకు అస్వస్థత!
ఇటీవల ఖాండ్వాలో హత్యాచారానికి గురైన బాధిత కుటుంబాన్ని మంత్రి విజయ్ షా పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తూ.. నాయకులను, పార్టీ కార్యకర్తలను వెంట వేసుకుని వెళ్లారు. అక్కడ బాధిత కుటుంబాన్ని పరామర్శించి చెక్ అందజేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు తీసిన ఫొటోలను కార్యకర్తలు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో ఈ వ్యవహారం మరోసారి వివాదానికి తెరలేపింది. గోపత్యాను మంత్రి ఉల్లంఘించారంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
ఇక పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది చనిపోయారు. దీనికి ప్రతీకారంగా భారత్.. పాకిస్థాన్పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దీనికి కల్నల్ సోఫియా ఖురేషి నాయకత్వం వహించారు. ఆపరేషన్ సిందూర్కు సంబంధించి ఎప్పటికప్పుడు మీడియాకు తెలియజేస్తూ ఉండేవారు. దీంతో ఆమె మీడియాలో పాపులర్ అయ్యారు.
అయితే ఓ పబ్లిక్ మీటింగ్లో పాల్గొన్న మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా.. సోఫియా ఖురేషిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్లో ఉగ్రవాదులు.. మన సోదరీమణుల సిందూరాన్ని తుడిచేస్తే.. అదే ఉగ్రవాదుల మతానికి చెందిన సోఫియాఖురేషిని ప్రధాని మోడీ పాకిస్థాన్పైకి పంపించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మతపరమైన వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర దుమారం రేపాయి. మధ్యప్రదేశ్ హైకోర్టు కేసు నమోదు చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా సర్వోన్నత న్యాయస్థానం కూడా చీవాట్లు పెట్టింది. మంత్రి క్షమాపణలు అంగీకరించబోమని తెలిపింది. తాజాగా మంత్రి మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు.
తాజావార్తలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
-
Off The Record: టీడీపీలోని పరిణామాలపై కొందరు సీనియర్స్ అసహనం..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!