Vijay Shah: మరోసారి ఇరకాటంలో మధ్యప్రదేశ్ మంత్రి.. విపక్షాలు ధ్వజం
- మరోసారి ఇరకాటంలో మధ్యప్రదేశ్ మంత్రి
- అత్యాచార బాధిత కుటుంబం ఫొటోలు వైరల్.. విపక్షాలు ధ్వజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కల్నల్ సోఫియా ఖురేషిపై అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర ఇబ్బందులకు గురైన మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా మరోసారి ఇరకాటంలో పడ్డారు. అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన ఫొటో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆయన మరోసారి విమర్శల పాలయ్యారు.
ఇది కూడా చదవండి: Samantha : గోల్డెన్ శారీలో మెరిసిపోయిన సామ్..
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
మంత్రి విజయ్ షా.. అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించారు. పరిహారానికి సంబంధించిన చెక్కును అందజేశారు. అత్యాచార ఘటనల విషయంలో గోప్యతా పాటించాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని మంత్రి ఉల్లంఘించి.. ఆమె కుటుంబానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో మంత్రి గోప్యతను ఉల్లంఘించారంటూ విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Botsa Satyanarayana: మాజీ మంత్రి బొత్స సత్య నారాయణకు అస్వస్థత!
ఇటీవల ఖాండ్వాలో హత్యాచారానికి గురైన బాధిత కుటుంబాన్ని మంత్రి విజయ్ షా పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తూ.. నాయకులను, పార్టీ కార్యకర్తలను వెంట వేసుకుని వెళ్లారు. అక్కడ బాధిత కుటుంబాన్ని పరామర్శించి చెక్ అందజేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు తీసిన ఫొటోలను కార్యకర్తలు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో ఈ వ్యవహారం మరోసారి వివాదానికి తెరలేపింది. గోపత్యాను మంత్రి ఉల్లంఘించారంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
ఇక పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది చనిపోయారు. దీనికి ప్రతీకారంగా భారత్.. పాకిస్థాన్పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దీనికి కల్నల్ సోఫియా ఖురేషి నాయకత్వం వహించారు. ఆపరేషన్ సిందూర్కు సంబంధించి ఎప్పటికప్పుడు మీడియాకు తెలియజేస్తూ ఉండేవారు. దీంతో ఆమె మీడియాలో పాపులర్ అయ్యారు.
అయితే ఓ పబ్లిక్ మీటింగ్లో పాల్గొన్న మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా.. సోఫియా ఖురేషిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్లో ఉగ్రవాదులు.. మన సోదరీమణుల సిందూరాన్ని తుడిచేస్తే.. అదే ఉగ్రవాదుల మతానికి చెందిన సోఫియాఖురేషిని ప్రధాని మోడీ పాకిస్థాన్పైకి పంపించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మతపరమైన వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర దుమారం రేపాయి. మధ్యప్రదేశ్ హైకోర్టు కేసు నమోదు చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా సర్వోన్నత న్యాయస్థానం కూడా చీవాట్లు పెట్టింది. మంత్రి క్షమాపణలు అంగీకరించబోమని తెలిపింది. తాజాగా మంత్రి మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు.
తాజావార్తలు
-
Gandhari: తాప్సీ ‘గాంధారి’కి విడుదలకు ముందే షాక్.. కాపీ ఆరోపణలతో ముదిరిన వివాదం!
-
Rajni Autobiography : ఆత్మకథ రాస్తున్న రజనీ.. సినిమాగా తీస్తే అదొక అద్భుతమే
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
Strait of Hormuz: హోర్ముజ్పై ఇరాన్ కొత్త ప్లాన్.. ప్రపంచ దేశాలకు బిగ్ షాక్..
-
KA Productions: కిరణ్ అబ్బవరం బ్యానర్లో మరో డిఫరెంట్ మూవీ.. గూస్బంప్స్ తెప్పిస్తున్న మిస్టరీ పోస్టర్!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!