BJP: సీట్లు తగ్గినా లొంగిపోయేందుకు సిద్ధంగా లేని బీజేపీ..
BJP: లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. 543 లోక్సభ సీట్లలో 293 సీట్లను ఎన్డీయే కైవసం చేసుకుంది. 240 సీట్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ స్వయంగా మ్యాజిక్ ఫిగర్ 272ని దాటి సీట్లను కైవసం చేసుకుంది. అయితే, ఈ సారి మాత్రం మెజారిటీకి కేవలం 32 సీట్ల తగ్గాయి. దీంతో మిత్రపక్షాలైన 16 సీట్లు గెలుచుకున్న చంద్రబాబు నాయుడు టీడీపీ, నితీష్ కుమార్ జేడీయూ (12), ఏక్నాథ్ షిండే శివసేన (7), చిరాగ్ పాశ్వాన్ యొక్క లోక్ జనశక్తి పార్టీ-రామ్ విలాస్ (5) బీజేపీ మెజారిటీకి చేరుకోవడంలో కీలకంగా మారాయి.
అయితే, సంక్షీర్ణంతో మోడీ3.0 ప్రభుత్వం ఏర్పడుతుండటంతో మిత్రపక్షాలు తమ డిమాండ్లను, కేబినెట్ బెర్తుల్ని బీజేపీ ముందు ఉంచుతున్నారు. కీలకమైన ఫోర్ట్పోలియోను దక్కించుకోవాలని డిమాండ్లు చేస్తున్నట్లు సమచారం. అయితే, బీజేపీ మిత్రపక్షాలకు లొంగపోవడానికి సిద్ధంగా లేదని సమచారం. కీలమైన మంత్రిత్వ శాఖల్ని తన వద్దే ఉంచుకోవాలని అనుకుంటోంది.
Also Read
- Vijay TVK Plan B: రేపు ఫలితాలు.. విజయ్ 'ప్లాన్-బి' రెడీ.. అభ్యర్థులకు దళపతి సీరియస్ వార్నింగ్!
- Census 2026 Scam Alert: జాగ్రత్త! జనాభా లెక్కల పేరుతో మోసం.. ఈ వివరాలను పంచుకోవద్దు.. ఏం చేయాలో తెలుసుకోండి
- Bengal Assembly Elections 2026: బెంగాల్ ఎన్నికలు.. మే 4న కేవలం 293 స్థానాలకు మాత్రమే ఓట్ల లెక్కింపు.. కారణం ఏమిటి?
- Delhi Fire Tragedy: ఢిల్లీలోని వివేక్ విహార్లో భారీ అగ్నిప్రమాదం.. 9 మంది మృతి
Read Also: Delhi: తీహార్ జైలులో గ్యాంగ్ వార్.. ఖైదీని కత్తితో పొడిచిన ప్రత్యర్థులు
టీడీపీ లోక్సభ స్పీకర్ పదవిని కోరడంతో పాటు రెండు కేబినెట్ బెర్తుల్ని అడుగుతుందని, జేడీయూ రైల్వే, వ్యవసాయశాఖను అడుగుతోందని తెలుస్తోంది. మరోవైపు బీజేపీ కీలకమైన హోం, ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఐటీ, రోడ్డు రవాణా వంటి కీలకమైన శాఖల్ని తన వద్దే పెట్టుకోవాలని భావిస్తోంది. మరోవైపు నితీష్ కుమార్ ఎన్డీయే ప్రభుత్వం కోసం ‘‘కామన్ మినిమమ్ ప్రోగ్రాం’’ కోసం ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. స్పీకర్ పోస్టును వదులుకునేందుకు బీజేపీ సిద్ధంగా లేదని తెలుస్తోంది. టీడీపీకి డిప్యూటీ స్పీకర్ పోస్టు ఆఫర్ చేసే అవకాశం ఉంది.
ఇప్పుడు ఉన్న సమచారం ప్రకారం.. జేడీయూకి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను ఇవ్వవచ్చు. టీడీపీకి పౌరవిమానయానం, ఉక్కు పరిశ్రమలను ఇవ్వవచ్చని తెలుస్తోంది. టూరిజం, స్కిల్ డెవలప్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఎర్త్ సైన్స్ వంటి ఇతర పోర్ట్ఫోలియోలను పోర్ట్ఫోలియోలకు అప్పగించడానికి బిజెపి సిద్ధంగా ఉండవచ్చు.
- Tags
- bjp
- JDU
- Lok Sabha Elections
- NDA
- PM Modi
తాజావార్తలు
-
Realme GT 2: 5,000mAh బ్యాటరీ, 50MP ట్రిపుల్ కెమెరా.. రియల్మీ స్మార్ట్ఫోన్ ను రూ. 15,000 తక్కువకే కొనండి!
-
AP Govt Employee Promotions: ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ల అంశంలో గవర్నమెంట్ కీలక నిర్ణయం..
-
Chit Fund Fraud: చిట్ ఫండ్ పేరుతో భారీ మోసం.. ఏకంగా రూ.2 కోట్ల స్కాం
-
Samantha-Naga Chaitanya : ఒకే వేడుకలో సమంత – నాగచైతన్య.. అది కూడా పార్ట్నర్స్తో!
-
Karimnagar: రెచ్చిపోయిన దొంగలు.. పీఎంజే జ్యువెలరీ షాపులో కాల్పులు.. భారీగా బంగారం, ఆభరణాలు దోపిడీ
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!