BJP: రామ మందిర సీటును కోల్పోవడమే కాదు, గుడితో సంబంధం ఉన్న మరో వ్యక్తి కూడా ఓడిపోయాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: లోక్సభ ఎన్నికల్లో ముగిశాయి. మరోసారి ఎన్డీయే కూటమి కేంద్రంలో అధికారంలోకి రాబోతోంది. ప్రధానిగా నరేంద్రమోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. మొత్తం 543 స్థానాల్లో ఎన్డీయే కూటమి 292 స్థానాలను కైవసం చేసుకుంది. మెజారిటీ మార్క్ 272 కన్నా కేవలం 20 సీట్లను అధికంగా కూటమి సాధించింది. గతంలో 2014, 2019లో రెండు సార్లు బీజేపీ స్వతహాగానే 272 మార్కును దాటి సీట్లను సాధించింది. అయితే, ఈ సారి మాత్రం ప్రభుత్వ ఏర్పాటు కోసం భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జేడీయూలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది.
ఇదిలా ఉంటే, బీజేపీ మ్యాజిక్ ఫిగర్ సాధించకపోవడానికి కారణం ఉత్తర్ ప్రదేశ్ అనే సమాధానం వినిపిస్తుంది. ఈ రాష్ట్రంలో 80 సీట్లు ఉంటే కేవలం 36 సీట్లను మాత్రమే బీజేపీ సాధించింది. ఇండియా కూటమి ఏకంగా 43 స్థానాలను దక్కించుకుని అందర్ని ఆశ్చర్యపరిచింది. చివరకు హిందువుల 500 ఏళ్ల కల అయిన రామ మందిరాన్ని నిర్మించిన బీజేపీ, రామ మందిరం ఉన్న ఫైజాబాద్ ఎంపీ స్థానంలో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోవడం ఆ పార్టీనే కాకుండా, దేశాన్ని షాక్కి గురిచేసింది. జనవరి 22న రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేసిన నాలుగు నెలల కాలం తిరగకముందే ఆ స్థానంలో బీజేపీకి ఓటమి రుచి చూపించారు.
Also Read
- Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇక నుంచి ఆ ప్రాంతాలకు వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్స్..
- West Bengal: బంగ్లాదేశీయులు, రోహింగ్యాలకు బ్యాడ్ న్యూస్.. బెంగాల్ ప్రభుత్వం బిగ్ యాక్షన్! ఆ సెంటర్లు రెడీ..
- Dog Steals Cash: ఖతర్నాక్ కుక్క.. ఖరీదైన దొంగతనం! సీసీటీవీ విజువల్స్ చూస్తే మైండ్ బ్లాకే..
- West Bengal: మమత మేనల్లుడి కోటకు బీటలు.. ఫల్తాలో భారీ విజయం దిశగా బీజేపీ..
Read Also: Affiliate Marketing: ‘అఫిలియేట్ మార్కెటింగ్’ అంటే ఏంటి.. దానిని ఎలా మొదలుపెట్టాలంటే..
అయోధ్య ఉన్న ఫైజాబాద్లో ఎస్పీ అభ్యర్థి అవధేష్ ప్రసాద్, బీజేపీ నేత లల్లూ సింగ్ని ఓడించారు. అయితే, దీనికి 100 కి.మీ దూరంలో ఉన్న శ్రావస్తిలో కూడా రామ మందిరంతో సంబంధం ఉన్న వ్యక్తి ఓడిపోయాడు. శ్రావస్తీ ఎంపీ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా సాకేత్ మిశ్రా బరిలో దిగారు. ఈయన రామమందిరం నిర్మించే ట్రస్టుకు నేతృత్వం వహిస్తున్న నృపేంద్ర మిశ్రా కుమారుడు. ఇతడిని ఎస్పీకి చెందిన రామ్ శిరోమణి వర్మ ఓడించారు. శ్రావస్తికి బౌద్ధం, హిందూ, జైన చరిత్రలతో సంబంధం ఉంది. మహాభారతం వంటి పురాతన హిందూ గ్రంథాలలో కూడా ప్రస్తావన ఉంది. జైనమతంలో కూడా, శ్రావస్తి మూడవ తీర్థంకరుడైన సంభవనాథతో సహా అనేక తీర్థంకరులతో సంబంధం కలిగి ఉంది.
తాజావార్తలు
-
Satya Kumar Yadav: ‘ఎబోలా’పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం.. అధికారులకు ఆదేశాలు జారీ.!
-
Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇక నుంచి ఆ ప్రాంతాలకు వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్స్..
-
Anaparthi: చోరీ ముఠా గుట్టురట్టు.. 13 కేసుల్లో నిందితుల అరెస్ట్.. రూ.75 లక్షల బంగారం స్వాధీనం
-
West Bengal: బంగ్లాదేశీయులు, రోహింగ్యాలకు బ్యాడ్ న్యూస్.. బెంగాల్ ప్రభుత్వం బిగ్ యాక్షన్! ఆ సెంటర్లు రెడీ..
-
RR VS MI: రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్.. అందరి కళ్లు వైభవ్ సూర్యవంశీ వైపే..
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?