BJP: రామ మందిర సీటును కోల్పోవడమే కాదు, గుడితో సంబంధం ఉన్న మరో వ్యక్తి కూడా ఓడిపోయాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: లోక్సభ ఎన్నికల్లో ముగిశాయి. మరోసారి ఎన్డీయే కూటమి కేంద్రంలో అధికారంలోకి రాబోతోంది. ప్రధానిగా నరేంద్రమోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. మొత్తం 543 స్థానాల్లో ఎన్డీయే కూటమి 292 స్థానాలను కైవసం చేసుకుంది. మెజారిటీ మార్క్ 272 కన్నా కేవలం 20 సీట్లను అధికంగా కూటమి సాధించింది. గతంలో 2014, 2019లో రెండు సార్లు బీజేపీ స్వతహాగానే 272 మార్కును దాటి సీట్లను సాధించింది. అయితే, ఈ సారి మాత్రం ప్రభుత్వ ఏర్పాటు కోసం భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జేడీయూలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది.
ఇదిలా ఉంటే, బీజేపీ మ్యాజిక్ ఫిగర్ సాధించకపోవడానికి కారణం ఉత్తర్ ప్రదేశ్ అనే సమాధానం వినిపిస్తుంది. ఈ రాష్ట్రంలో 80 సీట్లు ఉంటే కేవలం 36 సీట్లను మాత్రమే బీజేపీ సాధించింది. ఇండియా కూటమి ఏకంగా 43 స్థానాలను దక్కించుకుని అందర్ని ఆశ్చర్యపరిచింది. చివరకు హిందువుల 500 ఏళ్ల కల అయిన రామ మందిరాన్ని నిర్మించిన బీజేపీ, రామ మందిరం ఉన్న ఫైజాబాద్ ఎంపీ స్థానంలో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోవడం ఆ పార్టీనే కాకుండా, దేశాన్ని షాక్కి గురిచేసింది. జనవరి 22న రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేసిన నాలుగు నెలల కాలం తిరగకముందే ఆ స్థానంలో బీజేపీకి ఓటమి రుచి చూపించారు.
Also Read
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
- Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
Read Also: Affiliate Marketing: ‘అఫిలియేట్ మార్కెటింగ్’ అంటే ఏంటి.. దానిని ఎలా మొదలుపెట్టాలంటే..
అయోధ్య ఉన్న ఫైజాబాద్లో ఎస్పీ అభ్యర్థి అవధేష్ ప్రసాద్, బీజేపీ నేత లల్లూ సింగ్ని ఓడించారు. అయితే, దీనికి 100 కి.మీ దూరంలో ఉన్న శ్రావస్తిలో కూడా రామ మందిరంతో సంబంధం ఉన్న వ్యక్తి ఓడిపోయాడు. శ్రావస్తీ ఎంపీ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా సాకేత్ మిశ్రా బరిలో దిగారు. ఈయన రామమందిరం నిర్మించే ట్రస్టుకు నేతృత్వం వహిస్తున్న నృపేంద్ర మిశ్రా కుమారుడు. ఇతడిని ఎస్పీకి చెందిన రామ్ శిరోమణి వర్మ ఓడించారు. శ్రావస్తికి బౌద్ధం, హిందూ, జైన చరిత్రలతో సంబంధం ఉంది. మహాభారతం వంటి పురాతన హిందూ గ్రంథాలలో కూడా ప్రస్తావన ఉంది. జైనమతంలో కూడా, శ్రావస్తి మూడవ తీర్థంకరుడైన సంభవనాథతో సహా అనేక తీర్థంకరులతో సంబంధం కలిగి ఉంది.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!