BJP: పార్టీ చీఫ్ ఎన్నికతో పాటు దేశవ్యాప్తంగా సంస్థాగత మార్పులకు సిద్ధమవుతున్న బీజేపీ..
- సంస్థాగత మార్పులకు సిద్ధమవుతున్న బీజేపీ..
- పలు రాష్ట్రాలకు నూతన అధ్యక్షులు..
BJP: వరసగా మూడోసారి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం ప్రధానిగా మరోసారి నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేశారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం బీజేపీ సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టుబోతోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పార్టీలో మార్పులు చేయబోతోంది. ప్రస్తుతం పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేబినెట్లో చేరడంతో కొత్త చీఫ్ ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. నడ్డా పదవికాలం జూన్ 30తో ముగియబోతోంది.
ఇదిలా ఉంటే, పార్టీ కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యే వరకు నడ్డా పదవీకాలన్ని పొడగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మోడీ కేబినెట్లో నడ్డా ఆరోగ్య, రసాయనాలు మరియు ఎరువుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బీజేపీ రాష్ట్ర నాయకులలో ఒకరిని లేదా జాతీయ ప్రధాన కార్యదర్శుల్లో ఒకరిని అత్యున్నత పదవికి తీసుకోవచ్చననే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే కాకుండా పార్టీకి కంచుకోటగా ఉన్న ఉత్తర్ ప్రదేశ్లో ఎదురుదెబ్బ తాకడంతో కేంద్రం, రాష్ట్రాల్లోని బీజేపీ అధ్యక్షులను ప్రభుత్వంలోకి తీసుకుని, వేరే వారిని అధ్యక్షులుగా నియమించే అవకాశం కనిపిస్తోంది.
Also Read
- Watermelon Prices: నలుగురు మృతి.. రూ. 7కు పడిపోయిన వాటర్మిలన్ ధరలు..
- West Bengal polls: బీజేపీ గుర్తుపై టేపులు.. రీపోలింగ్కు ఆదేశం..
- PM Modi: ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం.. మే 4న ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయ్
- Rs 397 Crore Transformer Scam: ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..
Read Also: Joe Biden: జునెటీన్త్ వేడుకల్లో ఆశ్చర్యపరిచిన బైడెన్ వ్యవహారశైలి.. వీడియో వైరల్
పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ సుకాంత మజుందార్ కేంద్రమంత్రిగా మారడం, బీహార్ ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ కూడా పార్టీ బాధ్యతలు చూస్తున్నారు. బీజేపీ ప్రకారం, ఒక వ్యక్తికి ఒకే పదవి. దీంతో వీరి స్థానాల్లో రాష్ట్రాధ్యక్షులుగా కొత్తవారిని తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇక రాజస్థాన్లో ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మతో పాటు బీజేపీ చీఫ్ సీపీ జోషీ బ్రహ్మణ వర్గానికి చెందిన వారే కావడంతో, సీపీ జోషిని మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తర్ ప్రదేశ్ ఘోర పరాజయం తర్వాత ఆ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ చౌదరిని కూడా మార్చే అవకాశం కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Watermelon Prices: నలుగురు మృతి.. రూ. 7కు పడిపోయిన వాటర్మిలన్ ధరలు..
-
Elon Musk vs OpenAI Lawsuit: ప్రపంచ కుబేరుల మధ్య AI యుద్ధం.. ఎలోన్ మస్క్ వర్సెస్ సామ్ ఆల్ట్మాన్.. అసలేం జరుగుతోంది?
-
West Bengal polls: బీజేపీ గుర్తుపై టేపులు.. రీపోలింగ్కు ఆదేశం..
-
MLA Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది.!
-
AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో