West Bengal: బీజేపీ నాయకుడి మృతి.. తృణమూల్ హత్య చేసిందని ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: పశ్చిమ బెంగాల్ లో బీజేపీ నాయకుడి మరణం తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), బీజేపీ మధ్య మంటలు రేకెత్తించింది. తమ పార్టీ నాయకుడిని తృణమూల్ కాంగ్రెస్ హత్య చేసిందని బీజేపీ ఆరోపించింది. అయితే బీజేపీ చేస్తున్న ఆరోపణల్ని టీఎంసీ తోసిపుచ్చింది. మొయినా బిజెపి బూత్ ప్రెసిడెంట్ బిజయ్కృష్ణ భునియా సోమవారం సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా అతని భార్య ముందే టీఎంసీ గుండాలు కొట్టారని, బలవంతంగా బైక్ పై తీసుకెళ్లారని బీజేపీ ఆరోపించింది.
Read Also: Rajinikanth Fans: రజనీకాంత్ ఫ్యాన్స్ భేటీ.. మంత్రి రోజాకు సీరియస్ వార్నింగ్..
Also Read
- Bankipur Results: 30 ఏళ్ల బీజేపీ కంచుకోట బద్దలు.. బంకీపూర్లో ప్రశాంత్ కిషోర్ సంచలన విజయం
- Karnataka: డీకే.శివకుమార్కు కేబినెట్ విస్తరణ తలనొప్పి.. పలువురు ఎమ్మెల్యేలు రాజీనామా
- Manu Bhaker: జెన్-జీ ఉద్యమంపై మను భాకర్ కీలక వ్యాఖ్యలు
- Supreme Court: సహజీవనంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. 498A వర్తింపు.. కానీ, షరతులు వర్తిస్తాయి..!
టీఎంసీ 2021 మే 2 అధికారంలోకి వచ్చిన తర్వాత బెంగాల్ లో హింస చెలరేగింది, ఇప్పుడు ఆ పార్టీ రెండో వార్షికోత్సవాన్ని జరుపుకుంటుందని, బీజేపీ నాయకుడు బిజయ్ కృష్ణ భునియా హత్య ఈ వార్షికోత్సవానికి రాష్ట్ర ప్రజలకు ఒక బహుమతి అని బీజేపే నేత సువేందు అధికారి అన్నారు. మొయినా ప్రాంతంలో బీజేపీకి గట్టి పట్టుంది. ఈ ప్రాంతంలో బీజేపీ తరుపున అశోక్ దిండా ఎమ్మెల్యేగా ఉన్నారు. తమ కార్యకర్త హత్యకు నిరసనగా బీజేపీ 12 గంటల బంద్ కు పిలుపునిచ్చింది. ఈ సంఘటపై సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేసింది.
బీజేపీ ఆరోపణలపై టీఎంసీ స్పందించింది. బీజేపీ నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని తెలిపింది. అతని మరణానికి కుటుంబ కలహాలే కారణం అని టీఎంసీ చెబుతోంది. చనిపోయిన భునియా మృతదేహాం అతని ఇంటికి కొంతదూరంలో కనుగొన్నామని పోలీసులు తెలిపారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు మరియు మేదినీపూర్ ఎంపి, దిలీప్ ఘోష్ మాట్లాడుతూ..రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు టీఎంసీ ఇలాంటి హింసాత్మక సంఘటనలకు దిగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలోని వాతావరణాన్ని దెబ్బతీసేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని టీఎంసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కునాల్ ఘోష్ ఆరోపించారు.
తాజావార్తలు
-
Trump-Saudi: ట్రంప్ ముందు సౌదీ కీలక అభ్యర్థన.. భయపడిందా?
-
NIMS : నిమ్స్ ఘనత.. 1,000 రొబోటిక్ సర్జరీలు పూర్తి.. సీఎం రేవంత్ ప్రశంసలు.!
-
Team India: టీమిండియాను వదిలి వెళ్లాలంటే బాధగా ఉంది.. ‘కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నా’..
-
Sujatha Vijayakumar: రవి మోహన్ విడాకుల కేసులో ఆర్తి తల్లి బిగ్ బ్లాస్ట్.. ఇన్నాళ్లూ బయటకు రాని విషయాలు ఇవేనంట!
-
Floodlight Collapse: విశాఖ స్టేడియంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.. కూలిన ఫ్లడ్ లైట్..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!
-
7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!