West Bengal: బీజేపీ నాయకుడి మృతి.. తృణమూల్ హత్య చేసిందని ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: పశ్చిమ బెంగాల్ లో బీజేపీ నాయకుడి మరణం తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), బీజేపీ మధ్య మంటలు రేకెత్తించింది. తమ పార్టీ నాయకుడిని తృణమూల్ కాంగ్రెస్ హత్య చేసిందని బీజేపీ ఆరోపించింది. అయితే బీజేపీ చేస్తున్న ఆరోపణల్ని టీఎంసీ తోసిపుచ్చింది. మొయినా బిజెపి బూత్ ప్రెసిడెంట్ బిజయ్కృష్ణ భునియా సోమవారం సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా అతని భార్య ముందే టీఎంసీ గుండాలు కొట్టారని, బలవంతంగా బైక్ పై తీసుకెళ్లారని బీజేపీ ఆరోపించింది.
Read Also: Rajinikanth Fans: రజనీకాంత్ ఫ్యాన్స్ భేటీ.. మంత్రి రోజాకు సీరియస్ వార్నింగ్..
Also Read
- August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్పై ప్రభావం చూపే 10 మార్పులు..
- Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
- Kulgam: కుల్గామ్లో ఉగ్ర దాడి.. వలస కార్మికుడు మృతి
- Saayoni Ghosh: పార్లమెంట్ను అడ్డుకోవడం భావ్యం కాదు.. టీఎంసీ రెబల్ సాయోని ఘోష్ ఆగ్రహం
టీఎంసీ 2021 మే 2 అధికారంలోకి వచ్చిన తర్వాత బెంగాల్ లో హింస చెలరేగింది, ఇప్పుడు ఆ పార్టీ రెండో వార్షికోత్సవాన్ని జరుపుకుంటుందని, బీజేపీ నాయకుడు బిజయ్ కృష్ణ భునియా హత్య ఈ వార్షికోత్సవానికి రాష్ట్ర ప్రజలకు ఒక బహుమతి అని బీజేపే నేత సువేందు అధికారి అన్నారు. మొయినా ప్రాంతంలో బీజేపీకి గట్టి పట్టుంది. ఈ ప్రాంతంలో బీజేపీ తరుపున అశోక్ దిండా ఎమ్మెల్యేగా ఉన్నారు. తమ కార్యకర్త హత్యకు నిరసనగా బీజేపీ 12 గంటల బంద్ కు పిలుపునిచ్చింది. ఈ సంఘటపై సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేసింది.
బీజేపీ ఆరోపణలపై టీఎంసీ స్పందించింది. బీజేపీ నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని తెలిపింది. అతని మరణానికి కుటుంబ కలహాలే కారణం అని టీఎంసీ చెబుతోంది. చనిపోయిన భునియా మృతదేహాం అతని ఇంటికి కొంతదూరంలో కనుగొన్నామని పోలీసులు తెలిపారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు మరియు మేదినీపూర్ ఎంపి, దిలీప్ ఘోష్ మాట్లాడుతూ..రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు టీఎంసీ ఇలాంటి హింసాత్మక సంఘటనలకు దిగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలోని వాతావరణాన్ని దెబ్బతీసేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని టీఎంసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కునాల్ ఘోష్ ఆరోపించారు.
తాజావార్తలు
-
Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
-
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
-
August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్పై ప్రభావం చూపే 10 మార్పులు..
-
Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
-
Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!