Annamalai: స్టాలిన్ది కపట రాజకీయం.. బీహార్ టూర్పై అన్నామలై విమర్శలు
- స్టాలిన్ది కపట రాజకీయం
- బీహార్ టూర్పై అన్నామలై విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బీహార్ పర్యటన రాజకీయ దుమారం రేపింది. కాంగ్రెస్ అగ్ర నేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ బీహార్లో ఓటర్ అధికార్ యాత్ర చేపట్టారు. ఎన్నికల సంఘం.. అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తుందంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇక బుధవారం రాహుల్గాంధీకి మద్దతిచ్చేందుకు స్టాలిన్ బీహార్ వెళ్లారు. ఒకే వాహనంపై తేజస్వి యాదవ్, స్టాలిన్, రాహుల్ గాంధీ కనిపించిన ఫొటో వైరల్ అయింది. ఈ ఫొటోపై బీజేపీ విమర్శలు గుప్పించింది. బీహారీయులపై గతంలో స్టాలిన్ వ్యాఖ్యలను, కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను, డీఎంకే నేత దయానిధి మారన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ బీజేపీ నేత అన్నామలై సోషల్ మీడియాలో విమర్శించారు. గతంలో చేసిన వ్యాఖ్యలను మరోసారి బీహార్లో గుర్తు చేయగలరా? అంటూ ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: Maharashtra: బర్త్డే సెలబ్రేషన్లో ఉండగా ‘మహా’ ఘోరం.. చిన్నారి సహా 15 మంది మృతి.. వెలుగులోకి ఫొటోలు
Also Read
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
- Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
తాజాగా మరోసారి స్టాలిన్పై అన్నామలై విమర్శలు గుప్పించారు. స్టాలిన్ బీహార్ పర్యటన కేవలం రాజకీయ కపటమేనని వ్యాఖ్యానించారు. బీహారీయులపై డీఎంకే చూపిన అసహనాన్ని కప్పిపుచ్చుకునేందుకే యాత్ర అని తెలిపారు. ముగ్గురు నేతలు నిస్సహాయ రాజవంశీయులుగా అభివర్ణించారు.
త్వరలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎన్నికల సంఘం ప్రత్యేక సర్వే చేపట్టి 65 లక్షల ఓట్లను తొలగించింది. దీంతో రాహుల్గాంధీ ఓటర్ అధికార్ యాత్రను చేపట్టారు. ఈ యాత్రలో ఎంపీ కనిమొళితో కలిసి స్టాలిన్ పాల్గొన్నారు. ప్రజల ప్రజాస్వామ్య హక్కులను కాపాడండి అనే నినాదంతో ముజఫర్నగర్లో జరిగిన మార్చ్లో కనిమొళి, స్టాలిన్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Rajasthan: రాజస్థాన్లో అరుదైన సంఘటన.. 55 ఏళ్ల వయసులో 17వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
ర్యాలీలో పాల్గొన్న కనిమొళి.. రాహుల్, తేజస్వి, స్టాలిన్ల ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ముగ్గురు భారతదేశ భవిష్యత్ అని అభివర్ణించారు. ‘‘కలిసి మనం లేస్తాం. కలిసి ప్రతిఘటిస్తాం. బీజేపీ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా గళమెత్తడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి బీహార్లో ఇండియా కూటమి చేతులు కలుపుతుంది.’’ అని పేర్కొన్నారు. ఆగస్టు 17న రాహుల్ గాంధీ ప్రారంభించిన యాత్ర సెప్టెంబర్ 1న పాట్నాలో ముగినుంది.
Could you show me a picture of 3 hopeless out-of-sync dynasts?
ChatGPT: Here we go! pic.twitter.com/muFde2plkv
— K.Annamalai (@annamalai_k) August 27, 2025
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!