Maharashtra: బర్త్డే సెలబ్రేషన్లో ఉండగా ‘మహా’ ఘోరం.. చిన్నారి సహా 15 మంది మృతి.. వెలుగులోకి ఫొటోలు
- బర్త్డే సెలబ్రేషన్లో ఉండగా ‘మహా’ ఘోరం
- కూలిన బిల్డింగ్.. చిన్నారి సహా 15 మంది మృతి
- సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కుమార్తె తొలి బర్త్డే సెలబ్రేషన్స్లో తల్లిదండ్రులు, బంధువులు, శ్రేయోభిలాషులంతా సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఇంతలోనే ఊహించని విపత్తు మృత్యువు రూపంలో ముంచుకొచ్చింది. పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుండగా ఒక్కసారిగా భవనం కూలిపోయింది. దీంతో బర్త్డే చిన్నారి, తల్లి సహా 15 మంది చనిపోయారు. తండ్రి ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు. ఈ విషాద ఘటనతో బంధువులంతా కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఇది కూడా చదవండి: US: ట్రంప్ను చంపేయండి.. విద్యార్థులపై కాల్పులు జరిపిన నిందితుడి తుపాకీపై రాతలు
Also Read
- Sunetra Pawar: సునేత్ర పవార్ను ‘గూంగీ గుడియా’ అన్న కాంగ్రెస్.. దుమారం రేపుతోన్న వ్యాఖ్యలు
- Udhayanidhi Stalin: ఉదయనిధిని వెంటనే రీలీజ్ చేయండి.. మద్రాస్ హైకోర్టు ఆదేశాలు..
- DK Shivakumar: ‘రాజీనామా’ నిమిషాల్లో ఆమోదిస్తా.. అసమ్మతిపై డీకే.శివకుమార్ హెచ్చరిక
- Air India: గాల్లో హడలెత్తించిన ఎయిర్ ఇండియా విమానం.. అకస్మాత్తుగా 300 అడుగుల కిందకు జారిపోయిన ఫ్లైట్..
ఓంకార్ జోయల్, ఆరోహి జోయల్ భార్యాభర్తలు. వీరికి ఏడాది కుమార్తె ఉత్కర్ష జోయల్ ఉంది. ఆగస్టగు 27న (బుధవారం) ఉత్కర్ష జోయల్ది తొలి పుట్టినరోజు. దీంతో బంధువులను, స్నేహితులను, శ్రేయోభిలాషులందరినీ పిలుచుకుని గ్రాండ్గా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంటిని బెలూన్లు, లైట్లతో అలకరించారు. కుటుంబ సభ్యులు కేక్ కట్ చేసి ఫొటోలు దిగుతూ సంబరాలు చేసుకుంటున్నారు. అప్పటికే రాత్రి 11:30 గంటలు దాటింది. ఇంతలోనే ఒక్కసారిగా నాలుగు అంతస్తుల భవనం కూలిపోయింది. ఈ ఘటనలో మొత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. చిన్నారి ఉత్కర్ష జోయల్, ఆరోహి జోయల్ (24) కూడా మృతిచెందారు. భర్త ఓంకార్ జోయల్ ఆచూకీ మాత్రం లభించలేదు. రెస్క్యూ సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని శిథిలాలను తొలగిస్తున్నారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని విరార్లో బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. అయితే బర్త్డే సెలబ్రేషన్స్కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Rajasthan: రాజస్థాన్లో అరుదైన సంఘటన.. 55 ఏళ్ల వయసులో 17వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
అయితే ఈ భవనం 13 ఏళ్ల క్రితం నిర్మించినట్లుగా తెలుస్తోంది. అక్రమంగా నాలుగు అంతస్తుల భవనం నిర్మించినట్లుగా అధికారులు గుర్తించారు. ఈ భవనంలో ప్రస్తుతం 50 ఫ్లాట్లు ఉన్నాయి. ప్రస్తుతం సంఘటనాస్థలిలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. 30 గంటలుగా సహాయ చర్యలు జరుగుతున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు కారణంగా పునాదులు దెబ్బతినే అవకాశం ఉండొచ్చు.

తాజావార్తలు
-
Tejaswi Rao: ఇక పద్ధతిగా ఉంటే కుదరదు.. అందాల విందుతో రాంబాయి అరాచకం!
-
‘Raaka’ Glimpse: ‘రాకా’ ఫ్యాన్స్కు షాక్.. ఇప్పటి వరకు ఊరించిందంతా ఉత్తిదేనా?
-
Iran Crisis: సంక్షోభంలో ఇరాన్.. బతకడానికి ‘‘జుట్టు’’ అమ్ముకుంటున్న జనాలు..
-
AP High Court: డీఎస్సీ-2025 పిల్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. రాజకీయ ప్రయోజనాలకు పిల్ను వాడొద్దు..!
-
Raashi Khanna: హే రాశి.. ఇప్పుడెందుకీ క్లీవేజ్ షో?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!