Maharashtra: బర్త్డే సెలబ్రేషన్లో ఉండగా ‘మహా’ ఘోరం.. చిన్నారి సహా 15 మంది మృతి.. వెలుగులోకి ఫొటోలు
- బర్త్డే సెలబ్రేషన్లో ఉండగా ‘మహా’ ఘోరం
- కూలిన బిల్డింగ్.. చిన్నారి సహా 15 మంది మృతి
- సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కుమార్తె తొలి బర్త్డే సెలబ్రేషన్స్లో తల్లిదండ్రులు, బంధువులు, శ్రేయోభిలాషులంతా సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఇంతలోనే ఊహించని విపత్తు మృత్యువు రూపంలో ముంచుకొచ్చింది. పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుండగా ఒక్కసారిగా భవనం కూలిపోయింది. దీంతో బర్త్డే చిన్నారి, తల్లి సహా 15 మంది చనిపోయారు. తండ్రి ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు. ఈ విషాద ఘటనతో బంధువులంతా కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఇది కూడా చదవండి: US: ట్రంప్ను చంపేయండి.. విద్యార్థులపై కాల్పులు జరిపిన నిందితుడి తుపాకీపై రాతలు
Also Read
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- Parliament Monsoon Session: 'వందే మాతరం'ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
- Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
- CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
ఓంకార్ జోయల్, ఆరోహి జోయల్ భార్యాభర్తలు. వీరికి ఏడాది కుమార్తె ఉత్కర్ష జోయల్ ఉంది. ఆగస్టగు 27న (బుధవారం) ఉత్కర్ష జోయల్ది తొలి పుట్టినరోజు. దీంతో బంధువులను, స్నేహితులను, శ్రేయోభిలాషులందరినీ పిలుచుకుని గ్రాండ్గా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంటిని బెలూన్లు, లైట్లతో అలకరించారు. కుటుంబ సభ్యులు కేక్ కట్ చేసి ఫొటోలు దిగుతూ సంబరాలు చేసుకుంటున్నారు. అప్పటికే రాత్రి 11:30 గంటలు దాటింది. ఇంతలోనే ఒక్కసారిగా నాలుగు అంతస్తుల భవనం కూలిపోయింది. ఈ ఘటనలో మొత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. చిన్నారి ఉత్కర్ష జోయల్, ఆరోహి జోయల్ (24) కూడా మృతిచెందారు. భర్త ఓంకార్ జోయల్ ఆచూకీ మాత్రం లభించలేదు. రెస్క్యూ సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని శిథిలాలను తొలగిస్తున్నారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని విరార్లో బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. అయితే బర్త్డే సెలబ్రేషన్స్కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Rajasthan: రాజస్థాన్లో అరుదైన సంఘటన.. 55 ఏళ్ల వయసులో 17వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
అయితే ఈ భవనం 13 ఏళ్ల క్రితం నిర్మించినట్లుగా తెలుస్తోంది. అక్రమంగా నాలుగు అంతస్తుల భవనం నిర్మించినట్లుగా అధికారులు గుర్తించారు. ఈ భవనంలో ప్రస్తుతం 50 ఫ్లాట్లు ఉన్నాయి. ప్రస్తుతం సంఘటనాస్థలిలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. 30 గంటలుగా సహాయ చర్యలు జరుగుతున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు కారణంగా పునాదులు దెబ్బతినే అవకాశం ఉండొచ్చు.

తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!