BJP-JDS alliance: కొత్త రాజకీయ సమీకరణం.. పొత్తు దిశగా బీజేపీ, జేడీఎస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP-JDS alliance: కర్ణాటకలో కొత్త రాజకీయ సమీకరణం తెరపైకి వచ్చింది. పాత మిత్రుడు జేడీఎస్, బీజేపీ పంచన చేరబోతోంది. ఈ ఏడాది జరిగిన కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ దారుణం దెబ్బతింది. బీజేపీ ఓట్ షేర్ అలాగే ఉన్నా.. జేడీఎస్ ఓట్ షేర్ దారుణంగా పడిపోయింది. జేడీఎస్ ఓట్లు కాంగ్రెస్ వైపు మళ్లడం ఆ పార్టీకి ప్రమాదఘంటికలు మోగించాయి. ఈ నేపథ్యంలో వచ్చే 2024 లోక్సభ ఎన్నికల్లో ఇరు పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఈ రెండు పార్టీలు కర్ణాటకలో ఓట్లు చీలకుండా మెజారిటీ ఎంపీ స్థానాలు గెలిచేందుకు సిద్ధమవుతున్నాయి. సీట్ల పంపకాలను ప్రధాని మోడీ నిర్ణయిస్తారని తెలుస్తోంది.
Read Also: G20 Summit: జీ20 సదస్సుకు ఏ దేశాధ్యక్షులు వస్తున్నారు.. వారికి ఎవరు స్వాగతం పలుకుతారంటే ?
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
ఈ మేరకు ఇప్పటికే జనతాదళ్ (సెక్యులర్) అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ ఇటీవల బీజేపీ అమిత్ షా, జేపీ నడ్డాలను కలిశారని, 2024 సార్వత్రిక ఎన్నికలకు ఐదు లోక్సభ స్థానాలను కోరారని తెలిసింది. మాండ్య, హాసన్, తుమకూరు, చిక్బల్లాపూర్, బెంగళూరు రూరల్ ఎంపీ స్థానాలను జేడీఎస్ అడుగున్నట్లు తెలుస్తోంది. గతంలో బీజేపీతో పొత్తు ఉండదని జేడీఎస్ చీఫ్ దేవెగౌడ పలుమార్లు ప్రకటించారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవాలంటే బీజేపీతో పొత్తు చాలా అవసరం అని ఆ పార్టీ భావిస్తోంది. ఇటీవల కొత్త పార్లమెంట్ ఓపెనింగ్ సందర్భంలో పలు విపక్షాలు ఈ కార్యక్రమానికి హాజరు కాకపోయినా.. దేవెగౌడ హాజరుకావడంతో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని ఊహాగానాలు వచ్చాయి.
ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారాన్ని చేజిక్కించుకుంది. ముఖ్యంగా కింగ్ మేకర్ పొజిషన్ లో ఉండే జేడీఎస్ దారుణంగా దెబ్బతింది. ఆ పార్టీకి పట్టున్న మైసూర్ రీజియన్ లో కూడా చాలా స్థానాల్లో ఓడిపోయింది. చివరకు మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కొడుకు నిఖిల్ గౌడ ఓడిపోయారు. ప్రస్తుతం జేడీఎస్ కి 19 అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఇదిలా ఉంటే రానున్న 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కర్ణాటక చాలా కీలకం. మొత్తం 28 లోక్ సభ స్థానాలు ఉంటే 2019 ఎన్నికల్లో బీజేపీ 25 స్థానాల్లో గెలిచారు. జేడీ(ఎస్) కంచుకోట హాసన్లో దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ విజయం సాధించారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: అందరి చూపు వైభవ్ సూర్యవంశీపైనే.. మరో విధ్వంసానికి సిద్ధమైన వండర్ కిడ్!
-
Peddi Collections : 300 కోట్లకు చేరువలో… వర్కింగ్ డేలో ‘పెద్ది’ కలెక్షన్ల ఊచకోత
-
NANI : ప్యారడైజ్ ఆగస్టు రిలీజ్ పోస్ట్ పోన్.. న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే
-
BCCI Selection Controversy: హర్షిత్ రాణాను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు.. బీసీసీఐ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందా?
-
Magudam : డైరెక్టర్ గా విశాల్… 30 ఏళ్ల తరువాత తీరనున్న కల
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!