G20 Summit: జీ20 సదస్సుకు ఏ దేశాధ్యక్షులు వస్తున్నారు.. వారికి ఎవరు స్వాగతం పలుకుతారంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
G20 Summit: జీ20 సదస్సుకు దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబైంది. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాల అధినేతలకు ఆతిథ్యం ఇచ్చేందుకు ఢిల్లీ సిద్ధమైంది. అతిథుల రాక ప్రక్రియ కొనసాగుతోంది. ఢిల్లీ గడ్డపై ఒక్కొక్కరుగా అడుగులు వేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, చైనా ప్రధాని, రష్యా విదేశాంగ మంత్రి సహా 20 దేశాల నేతలు ఈ సదస్సులో పాల్గొంటారు. ఈ నాయకులు ఎప్పుడు భారతదేశానికి చేరుకుంటారు. వారిని ఎవరు స్వాగతిస్తారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఎవరు ఎవరిని స్వాగతిస్తారంటే..
– జో బిడెన్ శుక్రవారం రాత్రి 7 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. రోడ్డు రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రి , పౌర విమానయాన శాఖ జనరల్ (రిటైర్డ్) వీకే సింగ్ అమెరికా అధ్యక్షుడికి స్వాగతం పలుకుతారు.
– జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా మధ్యాహ్నం 2:15 గంటలకు భారత్ చేరుకుంటారు. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ మరియు పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే ఆయనకు స్వాగతం పలుకుతారు.
– సాయంత్రం 6:15 గంటలకు ఆస్ట్రేలియన్ ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్కు స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్ప్రెన్యూర్షిప్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్వాగతం పలుకుతారు.
– రాత్రి 8గంటలు, 8:45 గంటలకు UAE అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వాకు హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ స్వాగతం పలుకుతారు.
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
Read Also:Kishan Reddy: హోంగార్డు రవీందర్ మృతిపై కిషన్ రెడ్డి విచారం.. తొందరపడొద్దని సూచన..
– అశ్విని కుమార్ చౌబే యునైటెడ్ కింగ్డమ్ (యుకె) ప్రధాన మంత్రి రిషి సునక్కు మధ్యాహ్నం 1:40 గంటలకు స్వాగతం పలుకుతారు.
– సాయంత్రం 7:45 గంటలకు చైనా ప్రధాని లీ కియాంగ్కు వీకే సింగ్ స్వాగతం పలుకుతారు. సింగ్ రాత్రి 8:15 గంటలకు నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రూట్ను కూడా స్వీకరిస్తారు.
– జౌళి, రైల్వే శాఖ సహాయ మంత్రి దర్శన్ విక్రమ్ జర్దోష్ మధ్యాహ్నం 12:30 గంటలకు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు స్వాగతం పలుకుతారు.
– సాయంత్రం 5:10 గంటలకు దక్షిణ కొరియా అధ్యక్షుడు సుక్ యోల్ యూన్, సాయంత్రం 5:45 గంటలకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్-సిసి, రాత్రి 7 గంటలకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు రాజీవ్ చంద్రశేఖర్ స్వాగతం పలుకుతారు.
– ఉక్కు, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి ఫగ్గన్సింగ్ కులస్తే అర్జెంటీనా అధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్కు ఉదయం 6:20 గంటలకు స్వాగతం పలుకుతారు. వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖ సహాయ మంత్రి – శోభా కరంద్లాజే ఉదయం 8:50 గంటలకు ఇటలీ ప్రధాని జార్జియో మెలోనికి స్వాగతం పలుకుతారు.
– రైల్వేలు, బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి రావుసాహెబ్ దాన్వే ఉదయం 10:25 గంటలకు యూనియన్ ఆఫ్ కొమొరోస్ ప్రెసిడెంట్, ఆఫ్రికన్ యూనియన్ చైర్పర్సన్ అజలీ అసోమాని, 11:45 గంటలకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాకు స్వాగతం పలుకుతారు. .
– ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ సహాయ మంత్రి శంతను ఠాకూర్ ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోకు రాత్రి 9:15 గంటలకు స్వాగతం పలుకుతారు.
– ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్కు సెప్టెంబర్ 9 (శనివారం) మధ్యాహ్నం 12:35 గంటలకు వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ స్వాగతం పలుకుతారు.
Read Also:Gautam Gambhir: గంభీర్ రూటే సపరేట్.. ఆప్షన్స్ను కాదని మరో ఆటగాడిని ఎంచుకున్నాడు! ఊహించని సమాధానం
G20లో పాల్గొనే దేశాలు
అమెరికా, చైనా, రష్యా, జర్మనీ, ఫ్రాన్స్, కెనడా, ఇటలీ, జపాన్, అర్జెంటీనా, దక్షిణాఫ్రికా, యూకే, సౌదీ అరేబియా, యూరోపియన్ యూనియన్, మెక్సికో, టర్కీ, బ్రెజిల్, ఇండియా, కొరియా, ఆస్ట్రేలియా.
ఆహ్వానం అందిన దేశాలు
నెదర్లాండ్స్, సింగపూర్, స్పెయిన్, యునైటెడ్ అరబ్, ఒమన్, బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషస్, నైజీరియాలను G20 శిఖరాగ్ర సమావేశానికి అతిథులుగా ఆహ్వానించారు.
Read Also:Traffic ACP: హ్యాట్సాఫ్ మేడం.. డ్రైనేజీ చెత్తను చేతితో తీసిన మహిళా పోలీస్
కాన్ఫరెన్స్ గెస్ట్లు, ద్వైపాక్షిక చర్చలు
సెప్టెంబర్ 8న ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. సాయంత్రం 5 గంటలకు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో ద్వైపాక్షిక సమావేశం జరగనుంది. ఢిల్లీ అతిపెద్ద ఈవెంట్కు సర్వం సిద్ధమైంది. ఇప్పుడు G-20 సమ్మిట్ సెప్టెంబర్ 9-10 తేదీల్లో జరుగనుంది. భారత్ మండపం నుంచి కుతుబ్ మినార్ వరకు రాజధాని ఢిల్లీ లేజర్ లైట్లతో మెరిసిపోతోంది. ఢిల్లీ మొత్తం పెళ్లికూతురులా ముస్తాబవుతోంది. ఢిల్లీలోని ప్రతి మూలా పూల పరిమళాలతో, లైట్ల వెలుగుతో తడిసి ముద్దవుతోంది. లుటియన్స్ జోన్ ప్రాంతంలోని అన్ని ప్రత్యేక భవనాలు, స్మారక చిహ్నాలను వివిధ రంగుల పువ్వులు, లైట్లతో అలంకరించారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!