BJP: తొలి జాబితాలో ఉన్న బీజేపీ టాప్ లీడర్లు వీరే.. పోటీ చేస్తున్న స్థానాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో బీజేపీ తన అభ్యర్థుల మొదటి జాబితాను ఈ రోజు విడుదల చేసింది. మొత్తం 195 మంది ఎంపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని పలు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
తొలి జాబితాలోనే ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షా పేర్లు కూడా ఉన్నాయి. వీరిలో పాటు తొలి జాబితాలో పలువురు బీజేపీ టాప్ లీడర్లు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారనే విషయాన్ని ఆ పార్టీ ప్రకటించింది.
Also Read
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
నరేంద్రమోడీ:
ప్రధాని నరేంద్రమోడీ మరోసారి ఉత్తర్ ప్రదేశ్ లోని వారణాసి నుంచి పోటీ చేయబోతున్నారు. ఇప్పటికే రెండు పర్యాయాలుగా ఆయన అక్కడ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2014లో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్పై, 2019లో సమాజ్వాదీ పార్టీ నేత షాలినీ యాదవ్పై ఆయన విజయం సాధించారు.
అమిత్ షా:
బీజేపీ కంచుకోటల్లో ఒకటిగా ఉన్న గుజరాత్ గాంధీ నగర్ స్థానం నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరోసారి బరిలోకి దిగబోతున్నారు.
రాజ్నాథ్ సింగ్:
కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరోసారి ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నో నుంచి పోటీలో ఉన్నారు.
స్మృతి ఇరానీ:
2019లో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న అమేథీలో రాహుల్ గాంధీని స్మృతి ఇరానీ ఓడించారు. మరోసారి ఈ ఎంపీ స్థానం నుంచే పోటీలో ఉన్నారు.
జ్యోతిరాదిత్య సింధియా:
రాజ్యసభ ఎంపీ జ్యోతిరాదిత్య సింథియా ఈ సారి లోక్సభ బరిలో నిలిచారు. ఆయన మధ్యప్రదేశ్ గుణ నుంచి పోటీ చేయబోతున్నారు.
శివరాజ్ సింగ్ చౌహాన్:
గతేడాది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి బీజేపీకి అఖండ విజయాన్ని అందించిన మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తొలిసారిగా పార్లమెంట్ బరిలో ఉన్నారు. ఆయన విదిషా నుంచి పోటీ చేయబోతున్నారు. చౌహాన్ సేవలని బీజేపీ కేంద్రంలో ఉపయోగించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
కిరణ్ రిజిజు:
ప్రస్తుతం ఎర్త్ సైన్సెస్ మంత్రిగా ఉన్న కిరణ్ రిజిజు అరుణాచల్ వెస్ట్ నుంచి పోటీ చేయబోతున్నారు.
రాజీవ్ చంద్రశేఖర్:
కేంద్ర ఐటీశాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కేరళలోని తిరువనంతపురం నియోజవర్గం నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ నేత శశిథరూర్కి చెందిన ఈ స్థానం నుంచి బీజేపీ రాజీవ్ చంద్రశేఖర్ని బరిలోకి దింపింది.
హేమా మాలిని:
నటి, రాజకీయ నాయకురాలు హేమామలిని మరోసారి మధుర నుంచి బరిలో ఉన్నారు. 2014, 2019లో వరసగా రెండు సార్లు ఆమె అక్కడ నుంచి గెలుపొందారు.
భూపేందర్ యాదవ్:
బీజేపీ కీలక నేత, రెండు దశాబ్ధాలుగా పార్టీ కార్యకలాపాల్లో కీలకంగా ఉన్న భూపేందర్ యాదవ్ తొలిసారిగా లోక్ సభ ఎన్నికల్లో అడుగుపెడుతున్నారు. ఈయన రాజస్థాన్ అల్వార్ నుంచి బీజేపీ బరిలో దింపింది.
మరికొందరు ప్రముఖులు:
ఓం బిర్లా-కోట(రాజస్థాన్)
సురేష్ గోపి- త్రిస్సూర్(కేరళ)
అనిల్ ఆంటోనీ- పత్తనంతిట్ట(కేరళ)
అర్జున్ మేఘ్వాల్-బికనీర్(రాజస్థాన్)
గజేంద్ర సింగ్ షెకావత్- జోధ్పూర్(రాజస్థాన్)
బిప్లవ్ దేవ్-త్రిపుర వెస్ట్
అజయ్ మిహ్రా తేని-లఖీమ్పూర్ ఖేరీ(ఉత్తర్ ప్రదేశ్)
సాక్షి మహారాజ్- ఉన్నావ్(ఉత్తర్ ప్రదేశ్)
రవి కిషన్-గోరఖ్ పూర్(ఉత్తర్ ప్రదేశ్)
- Tags
తాజావార్తలు
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
-
Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్పై కన్నీళ్లు పెట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ దర్శకుడు!
-
Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
-
Rahul Gandhi: ‘ప్రభుత్వాన్ని తొలగించండి’ అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
-
Story Board : దేశ ప్రజల స్వరం మారుతోంది..కేంద్రంపై అసంతృప్తి ,ఆవేశం మరింత రాజుకుంటే…
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!