BJP: టార్గెట్ 2024 ఎలక్షన్స్.. ఈ రాష్ట్రాలకు బీజేపీ కొత్త ఇంఛార్జులు వీరే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP has appointed in-charges for many states: బీజేపీ 2024 సాధారణ ఎన్నికలే లక్ష్యంగా సమాయత్తం అవుతోంది. ఇటీవల కేంద్ర మంత్రులతో సమావేశం అయిన బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా 2024 ఎన్నికలపై సమాయత్తం కావాలని సూచించారు. దీంతో పాటు పలు రాష్ట్రాల్లో అతి తక్కువ తేడాతో ఓడిపోయిన 144కు లోక్ సభ స్థానాలపై దృష్టి సారించారు. వచ్చే ఎన్నికల్లో వీటిల్లో గెలవాలని ప్లాన్ చేసుకున్నారు. మరోవైపు బీజేపీ ఆశలు పెట్టుకున్న రాష్ట్రాల్లో తరుచుగా కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు పర్యటిస్తున్నారు. ఇందుకు ఉదాహరణ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, తెలంగాణ రాష్ట్రాలే.
ఇదిలా ఉంటే బీజేపీ మూడోసారి అధికారంలోకి రావడానికి రెండేళ్ల ముందు నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే కొంతమంది కేంద్రమంత్రులను, ముఖ్యమంత్రులను పలు రాష్ట్రాలకు ఇంఛార్జులుగా నియమిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది బీజేపీ పార్టీ. పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పలువురు కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, కీలక నేతలకు వివిధ రాష్ట్రాల బాధ్యతలు అప్పగించారు. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్, కేంద్ర మాజీ మంత్రులు ప్రకాశ్ జవదేకర్, మహేశ్ శర్మలకు రాష్ట్రాలను కేటాయించారు.
Also Read
- Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
- NEET UG 2026: నీట్ రీ-ఎగ్జామ్ కు ముందు.. పేపర్ లీక్ వదంతులపై విద్యార్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి..
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
Read Also: Queen Elizabeth II: క్వీన్ ఎలిజబెత్ 2 ఎన్నిసార్లు భారత్ పర్యటనకు వచ్చారో తెలుసా..?
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి పంజాబ్ రాష్ట్ర బాధ్యతలను అప్పగించారు. అలాగే త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లవ్ దేబ్ కు హర్యానా బాధ్యతలు అప్పగించారు. దీంతో పాటు ప్రకాష్ జవదేకర్ ను కేరళకు ఇంఛార్జుగా నియమించారు. గతంలో బీహార్ బాధ్యతలు చూసిన పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డేకు హర్యానా బాధ్యతలు అప్పగించింది పార్టీ అధిష్టానం. బీజేపీ సీనియర్ నేత ఓం మాథుర్ కి వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే ఛత్తీస్గఢ్ బాధ్యతలు అప్పగించారు. ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ పార్టీని గద్దె దించి బీజేపీ అధికారంలోకి రావాాలని కోరుకుంటోంది.
బీహార్ మాజీ మంత్రి మంగళ్ పాండేకు పశ్చిమ బెంగాల్ బాధ్యతలు అప్పగించింది. పశ్చిమ బెంగాల్ లో మరో బీజేపీ నేత సునీల్ బన్సాల్ తో కలిసి ఆయన ఇంఛార్జి బాధ్యతలు నిర్వహించనున్నారు. ఇక రాజస్థాన్ రాష్ట్రంలో అరుణ్ సింగ్, మధ్యప్రదశ్ లో మురళీధర్ రావులను ఇంఛార్జులుగా బీజేపీ కొనసాగిస్తోంది. లక్ష్మీకాంత్ వాజ్పేయి జార్ఖండ్ బాధ్యతలు చూడనున్నారు. త్రిపుర బాధ్యతలను మహేష్ వర్మ చూసుకోనున్నారు. బీజేపీ నేత సంబిత్ పాత్రకు ఈశాన్య రాష్ట్రాల సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు.
भाजपा राष्ट्रीय अध्यक्ष श्री @JPNadda ने विभिन्न राज्यों के प्रभारी एवं सह-प्रभारी को नियुक्त किया है। pic.twitter.com/Rn4uyB8cmL
— BJP (@BJP4India) September 9, 2022
తాజావార్తలు
-
Samantha Ruth Prabhu : ‘మా ఇంటి బంగారం’ హీరోయిన్ సాయి పల్లవా ? ఆ ఛాన్స్ సామ్ ఎలా కొట్టేసిందంటే ?
-
Vivo V70 Lite: వివో V70 లైట్ విడుదల.. 6500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, 6.77 అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే
-
Astrology: డబ్బు విషయంలో ఈ 3 రాశులవారు చాలా జాగ్రత్త.. ఖర్చు పెట్టే ముందు పదిసార్లు ఆలోచిస్తారట!
-
Veerappan Interview Controversy : వీరప్పన్ కేసులో హీరోయిన్ కు బిగ్ రిలీఫ్… ఆ ఛానల్ భారీ పరిహారం చెల్లించాల్సిందే.!
-
Suryakumar-Shreyas: చాలా సంతోషంగా ఉంది.. సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం.. సూర్య సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!