Queen Elizabeth II: క్వీన్ ఎలిజబెత్ 2 ఎన్నిసార్లు భారత్ పర్యటనకు వచ్చారో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Queen Elizabeth II Visits To India: బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ 2 మరణించడం యావత్ ప్రపంచాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. 70 ఏళ్ల పాటు యూకే రాణిగా పరిపాలించిన ఎలిజబెత్ 2 మూడు సార్లు రాణి హోదాలో భారత పర్యటకు వచ్చారు. ఆమె భారత పర్యటనకు వచ్చిన ప్రతీ సందర్భంలోనూ అపూర్వ స్వాగతం లభించింది. క్వీన్ ఎలిజబెల్ 2 1961లో రాణి హోదాలో ఇండియాకు వచ్చారు. ఆ సమయంలో ఢిల్లీలోని రాంలీలా మైదాన్లో ఘన స్వాగతం లభించింది. క్వీన్ ఎలిజబెత్ 2 భారత ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సభకు ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కూడా హజరయ్యారు. ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్ తో కలిసి భారత్ పర్యటనకు వచ్చారు. ఢిల్లీ, చెన్నై, కోల్ కతాల్లో ఆమె పర్యటించారు. ఆగ్రాలోని తాజ్ మహల్, న్యూఢిల్లీలోని రాజ్ ఘాట్ సందర్శించి మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు.

Also Read
- Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్కు ఊరట.. మెదాంతకు తరలించాలని హైకోర్టు ఆదేశం..
- Rahul Gandhi-Om Birla: లోక్సభ స్పీకర్తో రాహుల్ గాంధీ భేటీ.. ఏం డిమాండ్ చేశారంటే..!
- Farmers Protest: వ్యవసాయాన్ని ట్రేడ్ డీల్లో చేర్చొద్దు.. కేంద్రానికి రైతుల వార్నింగ్..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై భారత్ కీలక నిర్ణయం.. పాక్కు స్పష్టమైన సందేశం..
రాణిగా బాధ్యతలు చేపట్టక ముందు 1911లో ఎలిజబెల్ 2, తాత కింగ్ జార్జ్-5 ఆయన భార్య క్వీన్ మేరి పట్టాభిషేకానికి గుర్తుగా ఢిల్లీలో పర్యటించారు. 1961 పర్యటన తర్వాత దాదాపుగా రెండు దశాబ్ధాల తర్వాత మరోసారి 1983లో కామన్వెల్త్ నేతల శిఖరాగ్ర సమావేశానికి మరోసారి భారత్ పర్యటనకు వచ్చారు. క్వీన్ ఎలిజబెత్ 2 రెండవ పర్యటనలో మదర్ థెరిసాకు ‘ ఆర్డర్ ఆఫ్ ది మెరిట్’ను అందించారు. ఇక చివరి సారిగా 1997లో భారత్ ను సందర్శించారు. అన్నింటి కన్నా ముఖ్యమైన పర్యటనగా దీన్ని పేర్కొంటారు. భారత్, పాకిస్తాన్ స్వాతంత్య్రం సాధించి 50 ఏళ్లు గడిచిన సందర్భంగా ఆమె ఇండియాను సందర్శించారు.
1997 పర్యటనలో తొలిసారిగా ఆమె 1919లో జరిగిన జలియన్ వాలా బాగ్ దురాగతంపై స్పందించారు. జలియన్ వాలా బాగ్ ప్రాంతంలో గుమిగూడిన వందలాది మందిని అత్యంత దారుణంగా బ్రిటీష్ వారు కాల్చి చంపారు. అయితే ఈ ఘటనపై క్షమాపణలు చెప్పాలనే డిమాండ్ వ్యక్తం అయింది. జలియన్ వాలాబాగ్ బాధ కలిగించే ఉదాహరణ క్వీన్ ఎలిజబెత్ 2 అన్నారు. కొన్ని విషయాలు బాధ కలిగించే ఉదాహరణలు అని.. కానీ చరిత్రను తిరిగా రాయలేదని.. వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
NTR : బాలా బాబాయ్ త్వరగా కోలుకోవాలి!
-
Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్కు ఊరట.. మెదాంతకు తరలించాలని హైకోర్టు ఆదేశం..
-
Rahul Gandhi-Om Birla: లోక్సభ స్పీకర్తో రాహుల్ గాంధీ భేటీ.. ఏం డిమాండ్ చేశారంటే..!
-
Kalyan Ram: ‘గెట్ వెల్ సూన్ బాబాయ్’.. బాలయ్య కోసం కళ్యాణ్ రామ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్!
-
Gopichand Malineni: ఫ్యాన్స్ టెన్షన్ పడొద్దు.. బాలయ్యకు స్వల్ప గాయమే
ట్రెండింగ్
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్షీట్తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!