Maharashtra: ఎలక్షన్ రిజల్ట్స్కి ముందు బీజేపీకి ఎదురుదెబ్బ.. ఉద్ధవ్ సేనలో చేరిన కీలక నేత..
- ఎలక్షన్ రిజల్ట్స్ ముందు బీజేపీకి ఎదురుదెబ్బ..
- ఉద్ధవ్ సేనలోకి ముంబై బీజేపీ నేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: శనివారంతో మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసేది ఏ పార్టీనో స్పష్టత రానుంది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలకు ముందు ఆ రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీజేపీకి చెందిన కీలక నేత ఉద్ధవ్ ఠాక్రే శివసేనలో చేరారు. ముంబై బీజేపీ కార్యదర్శి, మహిమ్కి చెందిన సీనియర్ నేత సచిన్ షిండే, ఠాక్రే నేతృత్వంలోని శివసేన(యూబీటీ)లో చేరారు. ఇది బీజేపీ ఊహించని షాక్గా చెప్పవచ్చు. షిండే తన మద్దతుదారులతో కలిసి ఠాక్రే నివాసం మాతోశ్రీలో పార్టీలో చేరారు.
Read Also: US: యూఎస్ బీచ్లో అరుదైన ఫిష్ గుర్తింపు.. భారీ విపత్తుకు సిగ్నలా..!?
Also Read
- Nitin Gadkari: E20 పెట్రోల్ వల్ల ఒక్క కారైనా పాడైందా?.. విమర్శకులపై కేంద్ర మంత్రి గడ్కరీ ఫైర్..
- Awiqli Insulin India: మధుమేహ రోగుల కష్టాలు తీరినట్టే.. భారత్లో తొలి ఇన్సులిన్ 'Awiqli' విడుదల.. వారానికి ఒక్కసారి చాలు!
- Daughter Kills Mother: మానవత్వం మరిచిన కూతురు.. ఆస్తి, ప్రభుత్వ ఉద్యోగం కోసం కన్నతల్లినే చంపిన కుమార్తె..
- Explainer: ప్రమాదంలో పశ్చిమ కనుమలు...ఇంతటి విలయానికి అదే కారణమా...?
షిండే మణికట్టుకు సంప్రదాయ ‘‘శివబంధన్’’ని కట్టి ఠాక్రే పార్టీలోకి స్వాగతించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మహిమ్ అసెంబ్లీ స్థానంలో త్రిముఖ పోరు నెలకొంది. రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) ఆయన కుమారుడు అమిత్ ఠాక్రేను ఈ స్థానం నుంచి అభ్యర్థిగా నిలిపింది. ఉద్ధవ్ ఠాక్రే యొక్క శివసేన (UBT) మహేష్ బలిరామ్ సావంత్ను తమ అభ్యర్థిగా దింపింది. ఏక్ నాథ్ షిండే శివసేన సిట్టింగ్ ఎమ్మెల్యే సదరా సర్వాంకర్ని నిలబెట్టింది.
288 స్థానాలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 20న ఎన్నికలు జరిగాయి. శనివారం ఫలితలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీలు ‘మహాయుతి’ కూటమిగా, మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ఉద్ధవ్ సేన, శరద్ పవార్ ఎన్సీపీలు ‘‘మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)’’ కూటమిగా పోటీ చేశాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. మహాయుతి విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!