Maharashtra: ఎలక్షన్ రిజల్ట్స్కి ముందు బీజేపీకి ఎదురుదెబ్బ.. ఉద్ధవ్ సేనలో చేరిన కీలక నేత..
- ఎలక్షన్ రిజల్ట్స్ ముందు బీజేపీకి ఎదురుదెబ్బ..
- ఉద్ధవ్ సేనలోకి ముంబై బీజేపీ నేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: శనివారంతో మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసేది ఏ పార్టీనో స్పష్టత రానుంది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలకు ముందు ఆ రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీజేపీకి చెందిన కీలక నేత ఉద్ధవ్ ఠాక్రే శివసేనలో చేరారు. ముంబై బీజేపీ కార్యదర్శి, మహిమ్కి చెందిన సీనియర్ నేత సచిన్ షిండే, ఠాక్రే నేతృత్వంలోని శివసేన(యూబీటీ)లో చేరారు. ఇది బీజేపీ ఊహించని షాక్గా చెప్పవచ్చు. షిండే తన మద్దతుదారులతో కలిసి ఠాక్రే నివాసం మాతోశ్రీలో పార్టీలో చేరారు.
Read Also: US: యూఎస్ బీచ్లో అరుదైన ఫిష్ గుర్తింపు.. భారీ విపత్తుకు సిగ్నలా..!?
Also Read
షిండే మణికట్టుకు సంప్రదాయ ‘‘శివబంధన్’’ని కట్టి ఠాక్రే పార్టీలోకి స్వాగతించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మహిమ్ అసెంబ్లీ స్థానంలో త్రిముఖ పోరు నెలకొంది. రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) ఆయన కుమారుడు అమిత్ ఠాక్రేను ఈ స్థానం నుంచి అభ్యర్థిగా నిలిపింది. ఉద్ధవ్ ఠాక్రే యొక్క శివసేన (UBT) మహేష్ బలిరామ్ సావంత్ను తమ అభ్యర్థిగా దింపింది. ఏక్ నాథ్ షిండే శివసేన సిట్టింగ్ ఎమ్మెల్యే సదరా సర్వాంకర్ని నిలబెట్టింది.
288 స్థానాలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 20న ఎన్నికలు జరిగాయి. శనివారం ఫలితలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీలు ‘మహాయుతి’ కూటమిగా, మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ఉద్ధవ్ సేన, శరద్ పవార్ ఎన్సీపీలు ‘‘మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)’’ కూటమిగా పోటీ చేశాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. మహాయుతి విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!