Karnataka Elections: అభ్యర్థులను నేడు ఖరారు చేయనున్న బీజేపీ.. జేపీ నడ్డా నివాసంలో సమావేశం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka Elections: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఈ రోజు బీజేపీ పెద్దలు ఢిల్లీలో సమావేశం కానున్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పార్టీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు సమావేశం కానున్నట్లు సమాచారం. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు నళిన్కుమార్ కటీల్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప, కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య, ఇతర నేతలు కూడా నడ్డా నివాసానికి రానున్నారు.
Read Also: Amul vs Nandini: కర్ణాటకలో “పాల వివాదం”..నందిని మిల్క్కు సపోర్టుగా బెంగళూర్ హోటల్స్..
Also Read
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
- Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
- India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
మే 10న జరగబోతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురు పేర్లను బీజేపీ షార్ట్ లిస్ట్ చేసిందని, వాటిని కేంద్ర ఎన్నికల కమిటీ ముందు ఉంచనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ 4న కర్ణాటక బీజేపీ కోర్ గ్రూప్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, రాష్ట్ర ఎన్నికల ఇంచార్జ్ ధర్మేంద్ర ప్రధాన్, కో ఇంచార్జ్ మన్సుఖ్ మాండవీయ, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సభ్యుడు అన్నామలై కలిసి అభ్యర్థుల షార్ట్ లిస్టును పంపారు. మాజీ ముఖ్యమంత్రి ఎడియూరప్పతో పాటు సీఎ బస్వరాజ్ బొమ్మై కూడా ఇందులో పాలుపంచుకున్నారు.
224 మంది సభ్యులు ఉన్న కర్ణాటక అసెంబ్లీలో గత ఎన్నికల్లో బీజేపీ 104 స్థానాలు, కాంగ్రెస్ 80, జేడీయూ 37 స్థానాలను గెలుచుకుంది. కర్ణాటక అసెంబ్లీ పదవీ కాలం మే 24తో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. మే 10న ఎన్నికలు నిర్వహించి మే 13న ఫలితాలను వెల్లడించనుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రెండు విడతలుగా తన 166 అభ్యర్థులను ప్రకటించింది. ఇక మరో పార్టీ జేడీయూ కూడా 93 అభ్యర్థులతో జాబితా విడుదల చేసింది. అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలని అనుకుంటోంది. అయితే కాంగ్రెస్ ఈ సారి గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది. ఈ రెండు పార్టీల మధ్య తీవ్ర పోరు నెలకొంది. అయితే జేడీయూ కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!