Rahul Gandhi: ఇద్దరు కోటీశ్వరులతో పేదలు పోటీ పడుతున్నారు..
- రాష్ట్రంలో కోటీశ్వరులతో పేదలు పోటీ పడుతున్నారు..
- ధారావి రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ ను అదానీకి ఇచ్చేందుకు మోడీ ప్లాన్..
- మహా వికాస్ అఘడి ఎప్పటికీ పేద ప్రజల పక్షాన నిలుస్తుంది: రాహుల్ గాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: ఈ రోజు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు చివరి రోజు కావడంతో కాంగ్రెస్ ప్రచారంలో స్పీడ్ పెంచింది. ఇందులో భాగంగానే ఎల్ఓపీ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మహారాష్ట్రాలో ఇద్దరు కోటీశ్వరులతో పేద ప్రజలు పోటీ పడుతున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా ధారావి మ్యాప్, గౌతమ్ అదానీ, నరేంద్ర మోడీల ఫొటోను ఆయన ఆవిష్కరించారు. అందులో మోడీ అంటే ఇదేనేమో.. ఒకటి ఉంటే మరోకటి సురక్షితం అని ఎద్దేవా చేశారు. ఏక్ హై తో సేఫ్ హై అనేది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నినాదం అని ఆరోపించారు. ఇక, మహారాష్ట్ర యువత యొక్క ఉద్యోగాలలో కోత పెట్టేందుకు చూస్తున్నారని పేర్కొన్నారు. అయితే, వేదాంత ఫాక్స్కాన్ యువతకు ఉపాధిని కల్పిస్తుంది.. కానీ దానిని మీ నుంచి దూరం చేశారు.. టాటా ఎయిర్బస్ ప్రాజెక్ట్ వేలాది మంది యువతకు ఉపాధిని కల్పించింది.. ఇక్కడి యువత నుంచి మొత్తం 5 లక్షల ఉద్యోగాలు లాక్కుపోయారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
Read Also: DK Aruna: సీఎంకు ఫార్మా కంపెనీలపై అంత ప్రేమ ఎందుకు..?
Also Read
- Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
ఇక, దేశంలో ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, పేదరికం, నిరుద్యోగం సమస్యలు ప్రధానంగా ఉన్నాయని రాహుల్ గాంధీ తెలిపారు. అలాగే, దేశంలో కులగణన అతి పెద్ద సమస్య.. 50% మంది దళితులు, ఆదివాసీలు ఉనప్పటికీ.. వారికి వ్యవస్థలో ఎటువంటి హక్కు లేదన్నారు. మేము దానిని మార్చాలనుకుంటున్నామన్నారు. ఇంకా ఆరోగ్య బీమా, నిరుద్యోగ భృతి, ప్రజలకు 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కావాలన్నారు. ఈ ప్రశ్నలకు బీజేపీ సమాధానం చెప్పలేక ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తోంది అని విమర్శలు గుప్పించారు. మా ప్రభుత్వం మహారాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడుతుంది.. అందుకే ఉద్దవ్, శరద్ పవార్ తో కలిసి నిలబడి పోటీలో నిలబడినట్లు రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు.
‘एक है तो Safe है’ नारे का असली मतलब detail में समझाते श्री @RahulGandhi जी … 👇🏼#Mumbai#Maharashtra pic.twitter.com/cc8Em2p1ry
— Supriya Bhardwaj (@Supriya23bh) November 18, 2024
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన ‘బేబీ బాస్’.. వైభవ్కు ఎందుకు ఛాన్స్ లేదు?
-
Cinema News: థియేటర్లలో ఫ్లాప్.. యూట్యూబ్లో చరిత్ర సృష్టించిన బెల్లంకొండ సినిమా!
-
Suriya : రాజకీయాల్లోకి తమిళ స్టార్ హీరో సూర్య ఎంట్రీ.?
-
Jai Moondra: రెండు మ్యాచ్లకే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అండ్ ‘సిరీస్’.. టీమిండియాపై ఈ అవార్డులు వస్తాయనుకోలేదు!
-
Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!