Maharashtra: మున్సిపల్ ఎన్నికల వేళ సరికొత్త రాజకీయం.. కాంగ్రెస్-బీజేపీ ఏం చేశాయంటే..!
- మున్సిపల్ ఎన్నికల వేళ మహారాష్ట్రలో సరికొత్త రాజకీయం
- ఏక్నాథ్ షిండేకు వ్యతిరేకంగా బీజేపీ ప్లాన్
- మహాయతి కూటమిలో తీవ్ర అలజడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మున్సిపల్ ఎన్నికల వేళ మహారాష్ట్రలో విచిత్రమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. దేశంలో బద్దశత్రువులైన కాంగ్రెస్-బీజేపీ చేతులు కలపడం ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఏక్నాథ్షిండేకు చెందిన శివసేన పార్టీ మీద కోపంతో హస్తం-కమలం నేతలు చేతులు కలిసినట్లుగా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Union Budget: కేంద్ర బడ్జెట్ తేదీపై సందిగ్ధం.. కొత్త అంచనాలు ఇవే!
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
అంబర్నాథ్ మున్సిపల్ ఎన్నికల్లో 60 స్థానాలకు గాను షిండే వర్గం 27 స్థానాలు గెలుచుకుంది. మెజార్టీకి కొంచెం దూరంలోనే ఉంది. ఇంకో నాలుగు స్థానాలు ఉంటే షిండే వర్గానికి పీఠం కైవసం అవుతుంది. ఇలాంటి తరుణంలో బీజేపీ గట్టి షాకిచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో శివసేనకు మేయర్ పీఠం దక్కకూడదన్న ఆలోచనతో బద్ధశత్రువైన హస్తం పార్టీతో చేతులు కలిపింది. ఇక్కడ రెండో స్థానంలో బీజేపీ 14 స్థానాలు గెలుచుకోగా.. కాంగ్రెస్ 12, అజిత్ పవార్కు చెందిన ఎన్సీపీ 4 స్థానాలు, పలువురు స్వతంత్రులు గెలుచుకున్నారు. దీంతో ఈ మూడు పార్టీలు చేతులు కలిశాయి. అంబర్నాథ్ మున్సిపల్ను సొంతం చేసుకోవాలన్న ఉద్దేశంతో అంబర్నాథ్ వికాస్ అఘాడి పేరుతో కూటమిగా ఏర్పడింది. ఈ కూటమికి 31 మంది కౌన్సిలర్ల మద్దతు ఉంది. అంటే మెజార్టీ కంటే ఒక స్థానం ఎక్కువగా ఉంది.
ఇది కూడా చదవండి: Haryana: మగ బిడ్డ కోసం ఆరాటం.. 10 మంది కుమార్తెల తర్వాత…!
ఈ అంబర్నాథ్ మున్సిపల్.. థానే జిల్లాలో ఉంది. ఇది షిండే సొంత జిల్లా. అయితే గత కొన్నేళ్లుగా అంబర్నాథ్ మున్సిపల్ అవినీతి, దోపిడీకి గురైందని బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో శివసేనకు దక్కకూడదన్న ఆలోచనతో బీజేపీ కాంగ్రెస్తో చేతులు కలిపింది. అయితే ఈ పొత్తుపై శివసేన వర్గం నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇది అసభ్యకరమైన కూటమిగా అభివర్ణించారు. శివసేన ఎమ్మెల్యే బాలాజీ కినికర్ మాట్లాడుతూ.. బీజేపీ-కాంగ్రెస్ ద్రోహం చేశాయని మండిపడ్డారు. కాంగ్రెస్ రహిత దేశం కావాలని వాదించే బీజేపీ… ఇప్పుడు అంబర్నాథ్లో అధికారం కోసం కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం షిండేను కత్తితో పొడిచినట్లేనని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!