Maharashtra: మున్సిపల్ ఎన్నికల వేళ సరికొత్త రాజకీయం.. కాంగ్రెస్-బీజేపీ ఏం చేశాయంటే..!
- మున్సిపల్ ఎన్నికల వేళ మహారాష్ట్రలో సరికొత్త రాజకీయం
- ఏక్నాథ్ షిండేకు వ్యతిరేకంగా బీజేపీ ప్లాన్
- మహాయతి కూటమిలో తీవ్ర అలజడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మున్సిపల్ ఎన్నికల వేళ మహారాష్ట్రలో విచిత్రమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. దేశంలో బద్దశత్రువులైన కాంగ్రెస్-బీజేపీ చేతులు కలపడం ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఏక్నాథ్షిండేకు చెందిన శివసేన పార్టీ మీద కోపంతో హస్తం-కమలం నేతలు చేతులు కలిసినట్లుగా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Union Budget: కేంద్ర బడ్జెట్ తేదీపై సందిగ్ధం.. కొత్త అంచనాలు ఇవే!
Also Read
- Himalayan Glacier: కెమెరాలో చిక్కిన గ్లేసియర్ కూలిన భయానక దృశ్యాలు.. నేపాల్లో భారీ వరదకు ఇదే కారణమా? (వీడియో)
- Milk Price Hike: పండుగ సీజన్కు ముందు మిల్క్ షాక్.. పాల ధర లీటరుకు రూ.102
- Nepal Flood Tragedy: 600 దాటిన మృతుల సంఖ్య.. మరణాలు పెరుగుతుండటంతో నేపాల్లో కొత్త సంక్షోభం..!
- CM Vijay: పుజల్ జైలులో సీఎం విజయ్ సడన్ ఇన్స్పెక్షన్.. ఆసుపత్రి, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్ తనిఖీ
అంబర్నాథ్ మున్సిపల్ ఎన్నికల్లో 60 స్థానాలకు గాను షిండే వర్గం 27 స్థానాలు గెలుచుకుంది. మెజార్టీకి కొంచెం దూరంలోనే ఉంది. ఇంకో నాలుగు స్థానాలు ఉంటే షిండే వర్గానికి పీఠం కైవసం అవుతుంది. ఇలాంటి తరుణంలో బీజేపీ గట్టి షాకిచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో శివసేనకు మేయర్ పీఠం దక్కకూడదన్న ఆలోచనతో బద్ధశత్రువైన హస్తం పార్టీతో చేతులు కలిపింది. ఇక్కడ రెండో స్థానంలో బీజేపీ 14 స్థానాలు గెలుచుకోగా.. కాంగ్రెస్ 12, అజిత్ పవార్కు చెందిన ఎన్సీపీ 4 స్థానాలు, పలువురు స్వతంత్రులు గెలుచుకున్నారు. దీంతో ఈ మూడు పార్టీలు చేతులు కలిశాయి. అంబర్నాథ్ మున్సిపల్ను సొంతం చేసుకోవాలన్న ఉద్దేశంతో అంబర్నాథ్ వికాస్ అఘాడి పేరుతో కూటమిగా ఏర్పడింది. ఈ కూటమికి 31 మంది కౌన్సిలర్ల మద్దతు ఉంది. అంటే మెజార్టీ కంటే ఒక స్థానం ఎక్కువగా ఉంది.
ఇది కూడా చదవండి: Haryana: మగ బిడ్డ కోసం ఆరాటం.. 10 మంది కుమార్తెల తర్వాత…!
ఈ అంబర్నాథ్ మున్సిపల్.. థానే జిల్లాలో ఉంది. ఇది షిండే సొంత జిల్లా. అయితే గత కొన్నేళ్లుగా అంబర్నాథ్ మున్సిపల్ అవినీతి, దోపిడీకి గురైందని బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో శివసేనకు దక్కకూడదన్న ఆలోచనతో బీజేపీ కాంగ్రెస్తో చేతులు కలిపింది. అయితే ఈ పొత్తుపై శివసేన వర్గం నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇది అసభ్యకరమైన కూటమిగా అభివర్ణించారు. శివసేన ఎమ్మెల్యే బాలాజీ కినికర్ మాట్లాడుతూ.. బీజేపీ-కాంగ్రెస్ ద్రోహం చేశాయని మండిపడ్డారు. కాంగ్రెస్ రహిత దేశం కావాలని వాదించే బీజేపీ… ఇప్పుడు అంబర్నాథ్లో అధికారం కోసం కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం షిండేను కత్తితో పొడిచినట్లేనని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్
-
Himalayan Glacier: కెమెరాలో చిక్కిన గ్లేసియర్ కూలిన భయానక దృశ్యాలు.. నేపాల్లో భారీ వరదకు ఇదే కారణమా? (వీడియో)
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వైభవ్ బౌలింగ్కు అంతా ఫిదా.. ఇషాన్ కిషన్కు తెలియని సీక్రెట్ ఇదే..!
-
Billa Ranga Baasha: సుదీప్ మూవీకి భారీ ప్లాన్.. ‘బిల్లా రంగ బాషా’ ప్రమోషనల్ క్యాలెండర్ అవుట్
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!