Haryana: మగ బిడ్డ కోసం ఆరాటం.. 10 మంది కుమార్తెల తర్వాత…!
- హర్యానాలో వింతైన సంఘటన
- మగ బిడ్డ కోసం దంపతుల ఆరాటం
- 10 కుమార్తెల తర్వాత ఫలించిన కోరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వంశ వృక్షం కొనసాగాలంటే పుత్రుడితోనే సాధ్యమవుతుంది. లేదంటే వారసత్వం ఆగిపోతుంది. అందుకోసమే ప్రతి తల్లిదండ్రులు మగ బిడ్డ కోసం ఎదురుచూస్తుంటారు. అలానే ఓ జంట చాలా ఏళ్లు నిరీక్షించింది. అప్పటికే 10 మంది కుమార్తెలు ఉన్నా కూడా వారసుడి కోసమే ఎదురుచూశారు. మొత్తానికి 19 ఏళ్ల తర్వాత కల సాకారం అయింది. ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది.

Also Read
- Mamata Banerjee: పార్టీ వీడేవారు జూలై 21లోగా వెళ్లిపోండి.. మమతా అల్టిమేటం..
- Rajasthan: అమానుషం.. రూ.500 నోటు పోయిందని బాలికల బట్టలు విప్పి తనిఖీ చేసిన టీచర్
- EV Market: ఎలక్ట్రిక్ వాహనాల జోరు..12 రెట్లు పెరిగిన EV మార్కెట్..
- Karnataka: కర్ణాటకలో దారుణం.. డాక్టర్ భర్తను చంపిన భార్య.. కుమారుడిపై కూడా కత్తితో దాడి
సంజయ్ కుమార్ (38), భార్య (37) దినసరి కూలీలు. హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లాలోని ఒక గ్రామంలో నివాసం ఉంటున్నారు. 19 ఏళ్ల క్రితం 2007లో వీరిద్దరికీ వివాహం అయింది. అయితే దంపతులిద్దరూ మగ బిడ్డ కోసం కలలు కన్నారు. కానీ వరుసగా కుమార్తెలకే జన్మనిచ్చింది. ఇలా ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 10 మంది కుమార్తెలు పుట్టారు. అయినా కూడా కుమారుడిపై ఆశ చావలేదు. మరోసారి గర్భం దాల్చింది. ఈసారైనా మగ బిడ్డ పుట్టాలని ప్రార్థించింది. మొత్తానికి ఆమె ఆశ ఫలించింది. జనవరి 3న జిందా జిల్లాలోని ఉచానా పట్టణంలో ఓజాస్ ఆస్పత్రిలో మగ శిశువుకు జన్మనిచ్చింది. దీంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. సహజ ప్రసవం ద్వారా మగ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, బిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారు.
ఇది కూడా చదవండి: Russia: వెనిజులాలో ఉద్రిక్తతలు.. యూఎస్ నుంచి చమురు నౌకలను రక్షించడానికి రష్యా జలాంతర్గామి ఎంట్రీ!
కుమారుడు కావాలని కోరిక ఉందని.. కుమార్తెలు కూడా తమ్ముడు కావాలని కోరుకున్నారని అందుకే మగ బిడ్డ కోసం ఎదురు చూసినట్లుగా తండ్రి సంజయ్ కుమార్ తెలిపారు. ఇంత మందిని పెంచడం కష్టం కదా? అని అడిగితే.. తనకు ఉన్న ఆదాయంతోనే బిడ్డలకు మంచి వసతులు అందిస్తానని.. తన పెద్ద కుమార్తె 12వ తరగతి చదువుతోందని చెప్పుకొచ్చాడు. అంతా దేవుని దయ అని.. ప్రస్తుతం ఉన్నదాంట్లో సంతోషంగా ఉన్నట్లు తెలిపాడు. ఇక 19 ఏళ్ల నిరీక్షణ తర్వాత జన్మించిన కుమారుడికి దిల్ఖుష్ (సంతోష హృదయం) అని పేరు పెట్టారు.
పెద్ద కుమార్తె సరీనా 18 సంవత్సరాల వయస్సులో ప్రభుత్వ పాఠశాలలో 12వ తరగతి చదువుతోంది. అమృత 11వ తరగతి. సుశీల 7వ తరగతి. కిరణ్ 6వ తరగతి. దివ్య 5వ తరగతి. మన్నత్ 3వ తరగతి. కృతిక 2వ తరగతి. అమ్నిష్ 1వ తరగతి చదువుతున్నారు. తొమ్మిదవ, పదవ కుమార్తెలు లక్ష్మి, వైశాలి చిన్న పిల్లలు. వైశాలి తర్వాత చివరిలో వారసుడు వచ్చాడు.
ఇది కూడా చదవండి: Trump-Venezuela: వెనిజులా చమురుపై ట్రంప్ కీలక ప్రకటన
తాజావార్తలు
-
Kiran Abbavaram: ‘మా తమిళోల్లు మీ సినిమాలు చూడరు..’ ఉన్న విషయం చెప్పిన హీరో కిరణ్ అబ్బవరం
-
Rohit Sharma: చేసిన పరుగులు 26.. అయినా అరుదైన రికార్డ్ సాధించిన రోహిత్ శర్మ..
-
Virat Kohli-Rohit: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. చరిత్రలో నిలిచిపోయేలా..
-
Vallabhaneni Anil: జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్ వివాదం కాదు.. తప్పు చేస్తే ఫెడరేషన్ శిక్షిస్తుంది!
-
Tollywood: నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర సహా టాలీవుడ్ ఏరియాస్ లెక్కలివే
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!