Haryana: మగ బిడ్డ కోసం ఆరాటం.. 10 మంది కుమార్తెల తర్వాత…!
- హర్యానాలో వింతైన సంఘటన
- మగ బిడ్డ కోసం దంపతుల ఆరాటం
- 10 కుమార్తెల తర్వాత ఫలించిన కోరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వంశ వృక్షం కొనసాగాలంటే పుత్రుడితోనే సాధ్యమవుతుంది. లేదంటే వారసత్వం ఆగిపోతుంది. అందుకోసమే ప్రతి తల్లిదండ్రులు మగ బిడ్డ కోసం ఎదురుచూస్తుంటారు. అలానే ఓ జంట చాలా ఏళ్లు నిరీక్షించింది. అప్పటికే 10 మంది కుమార్తెలు ఉన్నా కూడా వారసుడి కోసమే ఎదురుచూశారు. మొత్తానికి 19 ఏళ్ల తర్వాత కల సాకారం అయింది. ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది.

Also Read
- PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
- BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
సంజయ్ కుమార్ (38), భార్య (37) దినసరి కూలీలు. హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లాలోని ఒక గ్రామంలో నివాసం ఉంటున్నారు. 19 ఏళ్ల క్రితం 2007లో వీరిద్దరికీ వివాహం అయింది. అయితే దంపతులిద్దరూ మగ బిడ్డ కోసం కలలు కన్నారు. కానీ వరుసగా కుమార్తెలకే జన్మనిచ్చింది. ఇలా ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 10 మంది కుమార్తెలు పుట్టారు. అయినా కూడా కుమారుడిపై ఆశ చావలేదు. మరోసారి గర్భం దాల్చింది. ఈసారైనా మగ బిడ్డ పుట్టాలని ప్రార్థించింది. మొత్తానికి ఆమె ఆశ ఫలించింది. జనవరి 3న జిందా జిల్లాలోని ఉచానా పట్టణంలో ఓజాస్ ఆస్పత్రిలో మగ శిశువుకు జన్మనిచ్చింది. దీంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. సహజ ప్రసవం ద్వారా మగ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, బిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారు.
ఇది కూడా చదవండి: Russia: వెనిజులాలో ఉద్రిక్తతలు.. యూఎస్ నుంచి చమురు నౌకలను రక్షించడానికి రష్యా జలాంతర్గామి ఎంట్రీ!
కుమారుడు కావాలని కోరిక ఉందని.. కుమార్తెలు కూడా తమ్ముడు కావాలని కోరుకున్నారని అందుకే మగ బిడ్డ కోసం ఎదురు చూసినట్లుగా తండ్రి సంజయ్ కుమార్ తెలిపారు. ఇంత మందిని పెంచడం కష్టం కదా? అని అడిగితే.. తనకు ఉన్న ఆదాయంతోనే బిడ్డలకు మంచి వసతులు అందిస్తానని.. తన పెద్ద కుమార్తె 12వ తరగతి చదువుతోందని చెప్పుకొచ్చాడు. అంతా దేవుని దయ అని.. ప్రస్తుతం ఉన్నదాంట్లో సంతోషంగా ఉన్నట్లు తెలిపాడు. ఇక 19 ఏళ్ల నిరీక్షణ తర్వాత జన్మించిన కుమారుడికి దిల్ఖుష్ (సంతోష హృదయం) అని పేరు పెట్టారు.
పెద్ద కుమార్తె సరీనా 18 సంవత్సరాల వయస్సులో ప్రభుత్వ పాఠశాలలో 12వ తరగతి చదువుతోంది. అమృత 11వ తరగతి. సుశీల 7వ తరగతి. కిరణ్ 6వ తరగతి. దివ్య 5వ తరగతి. మన్నత్ 3వ తరగతి. కృతిక 2వ తరగతి. అమ్నిష్ 1వ తరగతి చదువుతున్నారు. తొమ్మిదవ, పదవ కుమార్తెలు లక్ష్మి, వైశాలి చిన్న పిల్లలు. వైశాలి తర్వాత చివరిలో వారసుడు వచ్చాడు.
ఇది కూడా చదవండి: Trump-Venezuela: వెనిజులా చమురుపై ట్రంప్ కీలక ప్రకటన
తాజావార్తలు
-
PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
-
Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్కు కీలక అలర్ట్
-
US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
-
Udaya Bhanu: ‘పీఆర్’ పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
-
Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!