Sanatana Remarks: “సనాతన ధర్మం”పై ఎన్సీపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు.. బీజేపీ ఫైర్..
- శరద్ పవార్ పార్టీ ఎమ్మెల్యే ‘‘సనాతన ’’ వ్యతిరేఖ వ్యాఖ్యలు..
- తీవ్ర స్థాయిలో మండిపడుతున్న బీజేపీ..
Sanatana Remarks: శరద్ పవార్ ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అవాద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ‘‘సనాతన ధర్మాన్ని’’ గురించి ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ మండిపడుతోంది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సంబిత్ పాత్ర ఆదివారం ‘‘కాంగ్రెస్ ఎకో సిస్టమ్’’ పై విమర్శలు గుప్పించారు. సనాతన ధర్మాన్ని కించపరచాలని, హిందూ ఉగ్రవాదం వంటి పదాలను ఉపయోగించాలని జితేంద్ర అవద్ నిర్ణయించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: China: చైనాను భయపెడుతున్న జనాభా సంక్షోభం.. పిల్లల తల్లిదండ్రులకు సబ్సిడీలు..
Also Read
- Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
- Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
- PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
- Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!
‘‘ శరద్ పవార్ పార్టీకి చెందిన మహారాష్ట్ర నేత జితేంద్ర అవాద్ మరోసారి సనాతన ధర్మాన్ని అవమానించే భాష ఉపయోగించారు. సనాతన ధర్మం భారతదేశాన్ని నాశనం చేసిందని, భారతదేశంలో సనాతన ధర్మం అనే మతం ఎప్పుడూ లేదని అవద్ అన్నారు. మీరు సత్యాన్ని అవమానించారు, శివుడికి వ్యతిరేకంగా మాట్లాడారు.’’ అని సంబిత్ పాత్ర అన్నారు. ఇది మీ పార్టీ అధికార పంథానా..? అని శరద్ పవార్, సుప్రియా సూలేని ప్రశ్నించారు. సనాతన ధర్మానికి అగౌరవం కలిగించడానికి కాంగ్రెస్ ఎకో సిస్టమ్ కారణమని దుయ్యబట్టారు.
గతంలో హిందూ ఉగ్రవాది, సనాతన ఉగ్రవాది అనే పదాలను ఉపయోగించిన కాంగ్రెస్ నాయకుడు పృథ్వీరాజ్ చవాన్పై కూడా బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రపంచంలో మరెక్కడా కూడా మెజారిటీ సమాజంపై దాడి చేసి, అసహనంగా తిట్టలేదని సంబిత్ పాత్ర అన్నారు. 2008 మాలేగావ్ పేలుళ్లలో ఏడుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించిన తర్వాత, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ – శరద్చంద్ర పవార్ (ఎన్సిపి-ఎస్పి) శాసనసభ్యుడు అవ్హాద్ “సనాతన ధర్మం యొక్క భావజాలం వక్రీకరించబడింది మరియు అది దేశాన్ని నాశనం చేసింది” అని పేర్కొనడం వివాదంగా మారింది.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?