Sanatana Remarks: శరద్ పవార్ ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అవాద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ‘‘సనాతన ధర్మాన్ని’’ గురించి ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ మండిపడుతోంది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సంబిత్ పాత్ర ఆదివారం ‘‘కాంగ్రెస్ ఎకో సిస్టమ్’’ పై విమర్శలు గుప్పించారు. సనాతన ధర్మాన్ని కించపరచాలని, హిందూ ఉగ్రవాదం వంటి పదాలను ఉపయోగించాలని జితేంద్ర అవద్ నిర్ణయించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
NCP: శ్రీ రాముడిని ఉద్దేశించి ఎన్సీపీ(శరద్ పవార్) నేత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. నాసిక్లోని షిర్డీలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన జితేంద్ర అవద్ చేసిన కామెంట్స్పై బీజేపీ ఫైర్ అవుతోంది. జనవరి 22న అయోధ్య రామ మందిరి ప్రతిష్టాపన కార్యక్రమానికి కొన్ని రోజుల ముందు అవద్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని ప్రేరేపించాయి.