Misa Bharti: అధికారంలోకి వస్తే ప్రధాని మోదీ జైలుకే.. “మిసా” పేరు ఎందుకు పెట్టారని బీజేపీ కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Misa Bharti: ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతీ ప్రధాని నరేంద్రమోడీపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని మోడీతో పాటు బీజేపీ నేతల్ని జైలులో వస్తామని చెప్పడం పెద్ద వివాదానికి కారణమైంది. ఈ వ్యాఖ్యలపై ఆర్జేడీ, బీజేపీ పార్టీల నేతలు పరస్పరం నిందించుకుంటున్నారు. మిసా భారతీ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇస్తోంది. అసలు మీకు ‘మిసా’ అనే పేరు ఎందుకు పెట్టారో ఆలోచించుకోవాలని బీజేపీ నాయకులు చెబుతున్నారు.
Read Also: Couple In Flight: పాపం.. వీళ్ళకి ఎక్కడ ప్లేస్ దొరకలేదేమో.. ఫ్లైట్ లో అందరిముందే ఏకంగా..?
Also Read
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
లాలూ కుమార్తె మిసా భారతి మాట్లాడుతూ.. ఇండియా కూటమికి ఓటేసి గెలిపిస్తే నరేంద్రమోడీ, ఇతర బీజేపీ నేతల్ని జైలులో పెట్టడం ఖాయమని అన్నారు. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో బీజేపీ అవినీతికి పాల్పడిందని దుయ్యబట్టారు. ‘‘మిసా అని మీ నాన్న ఎందుకు పేరు పెట్టారో ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మిసా(అంతర్గత భద్రతా నిర్వహణ చట్టం) కింద లాలూ ప్రసాద్ యాదవ్ని జైలులో పెట్టింది. ఈ చట్టం ప్రకారం కోర్టును ఆశ్రయించకుండా, బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా ఎవరినైనా అరెస్ట్ చేయవచ్చు. లాలూ యాదవ్ని ఆ సమయంలో కాంగ్రెస్ని నాశనం చేస్తానని అన్నారు. అందుకే తమ కుమార్తెకు మిసా అనే పేరుపెట్టారు. మిసా భారతి తన తండ్రి ప్రమాణాన్ని ఎగతాళి చేస్తుందా..? ఆమె పేరు మార్చుకోవాలి’’ అని బీజేపీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది అన్నారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తవాడే మాట్లాడుతూ.. ప్రతిపక్షాల ప్రచారం ఏ స్థాయికి దిగజారిపోయాయనే దానికి మిసా భారతి వ్యాఖ్యలే నిదర్శనం అని అన్నారు. మోడీని చంపుతాం, జైలులో వేస్తామని మిసా చెబుతున్నారని, అయితే దేశం మాత్రం అవినీతిపరులు జైలులోకి వెళ్తారా..? లేదా.? అని మాట్లాడుకుంటున్నారని అన్నారు. మిసా భారతి ముందు తన కుటుంబం గురించి ఆలోచించాలని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ఆమె కుటుంబం చాలా రకాల అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిందని, కోర్టు వారిని శిక్షించిందని, ఇలాంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అవుతుందని ఫడ్నవీస్ అన్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో లాలూకు జైలు శిక్ష పడలేదని మిసా గుర్తుంచుకోవాలని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా అన్నారు.
తాజావార్తలు
-
Ponnam Prabhakar : బీఆర్ఎస్ నిరసనలపై పొన్నం ఫైర్.. ‘లెక్కలు చెప్పండి’ అంటూ వార్నింగ్..
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!