Misa Bharti: అధికారంలోకి వస్తే ప్రధాని మోదీ జైలుకే.. “మిసా” పేరు ఎందుకు పెట్టారని బీజేపీ కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Misa Bharti: ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతీ ప్రధాని నరేంద్రమోడీపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని మోడీతో పాటు బీజేపీ నేతల్ని జైలులో వస్తామని చెప్పడం పెద్ద వివాదానికి కారణమైంది. ఈ వ్యాఖ్యలపై ఆర్జేడీ, బీజేపీ పార్టీల నేతలు పరస్పరం నిందించుకుంటున్నారు. మిసా భారతీ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇస్తోంది. అసలు మీకు ‘మిసా’ అనే పేరు ఎందుకు పెట్టారో ఆలోచించుకోవాలని బీజేపీ నాయకులు చెబుతున్నారు.
Read Also: Couple In Flight: పాపం.. వీళ్ళకి ఎక్కడ ప్లేస్ దొరకలేదేమో.. ఫ్లైట్ లో అందరిముందే ఏకంగా..?
Also Read
- TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
- Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
- Monsoon 2026: ఆ రాష్ట్రాలకు భారీ ముప్పు.. శని, ఆదివారాల్లో అత్యంత భారీ వర్షాలు.. ఐఎమ్డీ హై అలర్ట్!
- Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
లాలూ కుమార్తె మిసా భారతి మాట్లాడుతూ.. ఇండియా కూటమికి ఓటేసి గెలిపిస్తే నరేంద్రమోడీ, ఇతర బీజేపీ నేతల్ని జైలులో పెట్టడం ఖాయమని అన్నారు. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో బీజేపీ అవినీతికి పాల్పడిందని దుయ్యబట్టారు. ‘‘మిసా అని మీ నాన్న ఎందుకు పేరు పెట్టారో ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మిసా(అంతర్గత భద్రతా నిర్వహణ చట్టం) కింద లాలూ ప్రసాద్ యాదవ్ని జైలులో పెట్టింది. ఈ చట్టం ప్రకారం కోర్టును ఆశ్రయించకుండా, బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా ఎవరినైనా అరెస్ట్ చేయవచ్చు. లాలూ యాదవ్ని ఆ సమయంలో కాంగ్రెస్ని నాశనం చేస్తానని అన్నారు. అందుకే తమ కుమార్తెకు మిసా అనే పేరుపెట్టారు. మిసా భారతి తన తండ్రి ప్రమాణాన్ని ఎగతాళి చేస్తుందా..? ఆమె పేరు మార్చుకోవాలి’’ అని బీజేపీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది అన్నారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తవాడే మాట్లాడుతూ.. ప్రతిపక్షాల ప్రచారం ఏ స్థాయికి దిగజారిపోయాయనే దానికి మిసా భారతి వ్యాఖ్యలే నిదర్శనం అని అన్నారు. మోడీని చంపుతాం, జైలులో వేస్తామని మిసా చెబుతున్నారని, అయితే దేశం మాత్రం అవినీతిపరులు జైలులోకి వెళ్తారా..? లేదా.? అని మాట్లాడుకుంటున్నారని అన్నారు. మిసా భారతి ముందు తన కుటుంబం గురించి ఆలోచించాలని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ఆమె కుటుంబం చాలా రకాల అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిందని, కోర్టు వారిని శిక్షించిందని, ఇలాంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అవుతుందని ఫడ్నవీస్ అన్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో లాలూకు జైలు శిక్ష పడలేదని మిసా గుర్తుంచుకోవాలని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా అన్నారు.
తాజావార్తలు
-
Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
-
TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
-
Today Gold and Silver Prices: పసిడి ధరలో భారీ పతనం.. వెండి కూడా చౌకైంది.. 22, 24 క్యారెట్ ధరలు ఎంతంటే?
-
Peddi vs Drishyam : మోహన్ లాల్కు “పెద్ది” దెబ్బ…. విదేశాల్లోనూ షాకే!
-
Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!