Pune: 16 మందిని బలిగొన్న ముంబై ఘటన తర్వాత పూణేలో కుప్పకూలిన భారీ హోర్డింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pune: ఇటీవల ముంబైలో బిల్బోర్డు కుప్పకూలిన ఘటనలో 16 మంది మరణించారు. ఈ ఘటన మరవకముందే పూణేలో ఇలాంటి ప్రమాదమే జరిగింది. బలమైన గాలుల కారణంగా పూణే సమీపంలోని పింప్రి-చించ్వాడ్లో హోర్డింగ్ కూలిపోయింది. హోర్డింగ్ కింద ఆగి ఉన్న టెంపో, కారు, కొన్ని ద్విచక్ర వాహనాలపై విరిగి పడింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.
ఈ సంఘటన గురువారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో నగరంలోని మోషి ప్రాంతంలో చోటు చేసుకుంది. ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక శాఖ, పోలీసులు, ఇతర అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ అగ్నిమాపక అధికారి మనోజ్ లోంకర్ మాట్లాడుతూ, ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగలేని చెప్పారు.
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
Read Also: Slovakia PM: స్లోవేకియా ప్రధానిపై కాల్పుల ఘటన.. వీడియో చూశారా..?
గతేడాది ఏప్రిల్లో పింప్రి చించ్వాడ్లోని సర్వీస్ రోడ్డుపై హోర్డింగ్ కూలి ఐదుగురు మృతి చెందారు. బలమైన ఈదురుగాలులు, వర్షం వస్తుండటంతో తలదాచుకుందామని వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం ముంబైలో భారీ హోర్డింగ్ కూలి 16 మంది మరణించారు. 75 మంది తీవ్రంగా గాయపడ్డారు. దుమ్ము తుఫాను కారణంగా సోమవారం 250 టన్నుల హోర్డింగ్ కూలిపోయింది. ఈ ఘటనలో నాలుగు రోజుల నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ దుర్ఘటనలో మరణించిన వారికి ఏక్నాథ్ షిండే ప్రభుత్వం రూ. 5 లక్షల పరిహారం ప్రకటించింది. గాయపడిన వారికి చికిత్స ఖర్చుల్ని ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!