Bihar: “రామచరితమానస్ సైనైడ్ వంటిది”.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar: రామచరిత్ మానస్ మరోసారి వివాదాల్లోకి వచ్చింది. తాజాగా బీహార్ మంత్రి కూడా హిందూ గ్రంథాలపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. పవిత్ర రామచరితమానస్ గ్రంథాన్ని విషపదార్థమైన ‘సైనైడ్’తో పోల్చాడు. ఆయన వ్యాఖ్యలపై ఇప్పుడు పొలిటికల్ దుమారం ప్రారంభమైంది. హిందీ దివాస్ సందర్భంగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ బీహార్ మంత్రి చంద్రశేఖర్ బుధవారం ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మీకు 50 రకాల వంటకాలను వడ్డించి అందులో పొటాషియ సైనైడ్ కలిపితే మీరు తింటారా..? హిందూ మత గ్రంథాలది కూడా ఇదే పరిస్థితి’’ అని ఆయన అన్నారు. రామచరితమానస్ పట్ల నా అభ్యంతరం కూడా ధృడమైందని, ఇది నా జీవితాంతం కొనసాగుందని, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా దీన్ని వ్యాఖ్యానించారని ఆయన అన్నారు.
Read Also: Pakistan: పీఓకేలో ఉగ్రవాదులకు పాక్ సాయం.. చైనా ఆయుధాలను అందిస్తున్న ఐఎస్ఐ
Also Read
- Tarun Tejpal: అత్యాచార కేసులో సంచలన తీర్పు.. తేజ్పాల్కు 10 ఏళ్లు జైలుశిక్ష
- Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
కులాల ప్రస్తావన ఉన్నంత కాలం దేశంలో రిజర్వేషన్లు, కుల గణన జరగాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రి వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ అవుతోంది. సీఎం నితీష్ కుమార్ ని టార్గెట్ చేస్తోంది. బీజేపీ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ మాట్లాడుతూ.. మంత్రి చంద్రశేఖర్ నిరంతరం రామచరితమానస్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని, నితీష్ కుమార్ కి వినబడటం లేదా..? అని ప్రశ్నించారు.నితీష్ కుమార్ సనానాన్ని నిరంతరం అవమానిస్తున్నారని విమర్శించారు. చంద్రశేఖర్ కి ఏమైనా ఇబ్బంది ఉంటే మతం మార్చుకోవాాలని సూచించారు.
రామచరితమానస్ పై మంత్రి చంద్రశేఖర్ వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. ఆర్జేడీ పార్టీ కీలక నేత, మంత్రిగా ఉన్న ఈయన రామచరితమానస్ సమాజంలో ద్వేషాన్ని వ్యాప్తి చేస్తోందని అన్నారు. ప్రేమ, ఆప్యాయతతో దేశం గొప్పది అవుతుంది కానీ రామచరితమానస్, మనుస్మృతి బంచ్ ఆఫ్ థాట్స్ వంటి పుస్తకాలతో కాదని, ఇవి ద్వేషం, సామాజిక విభజన బీజాలను నాటుతాయని అన్నారు. దళితులు, వెనకబడినవారు, మహిళల్ని విద్యకు దూరం చేస్తాయని అన్నారు.
తాజావార్తలు
-
Tarun Tejpal: అత్యాచార కేసులో సంచలన తీర్పు.. తేజ్పాల్కు 10 ఏళ్లు జైలుశిక్ష
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
-
Gautam Gambhir: మన హద్దులు దాటాలి.. శ్రీలంక టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియాకు గంభీర్ వార్నింగ్
-
Salman Khan: సల్మాన్ ఖాన్ ఖాతాలో మరో కొత్త కేసు… రూ.3 కోట్ల మోసం కేసులో కోర్టు సమన్లు!
ట్రెండింగ్
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!