Kuwait Fire Accident: వచ్చే నెలలో వివాహం.. కొడుకు మిస్సింగ్.. ఓ తల్లి ఆవేదన..
- వచ్చే నెలలో పెళ్లి
- అంతలోనే విషాదం..
- కువైట్ అగ్నిప్రమాదంలో బీహార్ వ్యక్తి మిస్సింగ్..
- తన కొడుకుకి ఏమైందో అని తల్లి ఆవేదన..
- వచ్చే నెల ఇంటికి వస్తానని చెప్పాడంటూ కన్నీరుమున్నీరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kuwait Fire Accident: బతువుదెరువు కోపం పరాయి దేశం వెళ్లి, శవాలుగా తిరిగి వస్తున్న తమ వారిని చూస్తున్న కుటుంబాల కన్నీరును ఆపడం ఎవరి వల్ల కావడం లేదు. తమవారిని కాలిన మృతదేహాలుగా చూస్తామనుకోలేదని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గల్ఫ్ దేశం కువైట్లో జరిగిన అగ్నిప్రమాదంలో 45 మంది భారతీయులు మరణించడం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ముఖ్యంగా మృతుల్లో సగానికి కన్నా ఎక్కువ మంది కేరళకి చెందిన వారే ఉన్నారు. ఐఏఎఫ్ విమానంలో మరణించిన వారి మృతదేహాలను కొచ్చిన్ తీసుకువచ్చారు. శుక్రవారం తెల్లవారుజామున బయలుదేరిని విమానం ఉదయం 10.30 గంటలకు కొచ్చిన్ చేరుకుంది.
Read Also: T20 World Cup 2024: ఉన్నపళంగా స్వదేశానికి ఇద్దరు భారత ఆటగాళ్లు.. కారణం ఏంటంటే?
Also Read
- Gujarat Well Mystery: వింత ఘటన.. బావిలో నీరు అలల్లా కదలికలు, రంగంలోకి అధికారులు (వీడియో)
- Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే ఈ అగ్నిప్రమాదం జరిగినప్పటి నుంచి తన కొడుకు అదృశ్యమయ్యాడని ఓ తల్లి ఆందోళన చెందుతోంది. వచ్చే నెలలో వివాహం కావాల్సిన తన కొడుకు సమాచారం కోసం ఎదురుచూస్తోంది. బీహార్ కి చెందిన మదీనా ఖాతూన్ అనే మహిళ, తన పెద్ద కుమారుడు కాలూ ఖాన్ అగ్నిప్రమాదం జరిగిన భవనంలోనే నివసిస్తున్నాడని చెప్పారు. ‘‘మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో నేను అతనితో ఫోన్లో మాట్లాడాను. వచ్చే నెలలో తన వివాహం జరగాల్సి ఉన్నందున జూలై 5న దర్భంగా వస్తానని చెప్పాడు’’ అని విలపించింది. బీహార్లోని దర్భంగా జిల్లాలోని నైనా ఘాట్ ప్రాంతానికి చెందిన ఖాతూన్, తన కుమారుడు కొన్నేళ్లుగా కువైట్లో నివసిస్తున్నాడని చెప్పారు.
కాలూ ఖాన్ స్కిల్ లేబర్గా గత కొన్ని ఏళ్లుగా కువైట్లో నివసిస్తున్నాడు. తన కుమారుడు ఉన్న భవనంలోనే అగ్నిప్రమాదం జరిగిందని అతని తల్లి పేర్కొంది. తాను కాల్ చేసినప్పటికీ స్పందన లేదని, కొడుకు గురించి ఎలాంటి సమాచారం అందలేదని, తన కుమారుడికి ఏం జరిగిందో తెలియడం లేదని చెప్పింది. ఈ విషయంలో అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నించాం, కానీ మా ప్రయత్నం ఫలించలేదని చెప్పింది. నా కొడుకు క్షేమం కోసం దేవుడిని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
-
Gujarat Well Mystery: వింత ఘటన.. బావిలో నీరు అలల్లా కదలికలు, రంగంలోకి అధికారులు (వీడియో)
-
Varanasi Update: ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్.. ఈసారి పకడ్బందీగా ప్లాన్ చేసిన రాజమౌళి!
-
KL Rahul: టీమిండియాకు భారీ షాక్.. శుభ్మన్ గిల్ అవుట్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్.!
-
Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
ట్రెండింగ్
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!