Kuwait Fire Accident: వచ్చే నెలలో వివాహం.. కొడుకు మిస్సింగ్.. ఓ తల్లి ఆవేదన..
- వచ్చే నెలలో పెళ్లి
- అంతలోనే విషాదం..
- కువైట్ అగ్నిప్రమాదంలో బీహార్ వ్యక్తి మిస్సింగ్..
- తన కొడుకుకి ఏమైందో అని తల్లి ఆవేదన..
- వచ్చే నెల ఇంటికి వస్తానని చెప్పాడంటూ కన్నీరుమున్నీరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kuwait Fire Accident: బతువుదెరువు కోపం పరాయి దేశం వెళ్లి, శవాలుగా తిరిగి వస్తున్న తమ వారిని చూస్తున్న కుటుంబాల కన్నీరును ఆపడం ఎవరి వల్ల కావడం లేదు. తమవారిని కాలిన మృతదేహాలుగా చూస్తామనుకోలేదని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గల్ఫ్ దేశం కువైట్లో జరిగిన అగ్నిప్రమాదంలో 45 మంది భారతీయులు మరణించడం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ముఖ్యంగా మృతుల్లో సగానికి కన్నా ఎక్కువ మంది కేరళకి చెందిన వారే ఉన్నారు. ఐఏఎఫ్ విమానంలో మరణించిన వారి మృతదేహాలను కొచ్చిన్ తీసుకువచ్చారు. శుక్రవారం తెల్లవారుజామున బయలుదేరిని విమానం ఉదయం 10.30 గంటలకు కొచ్చిన్ చేరుకుంది.
Read Also: T20 World Cup 2024: ఉన్నపళంగా స్వదేశానికి ఇద్దరు భారత ఆటగాళ్లు.. కారణం ఏంటంటే?
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ఇదిలా ఉంటే ఈ అగ్నిప్రమాదం జరిగినప్పటి నుంచి తన కొడుకు అదృశ్యమయ్యాడని ఓ తల్లి ఆందోళన చెందుతోంది. వచ్చే నెలలో వివాహం కావాల్సిన తన కొడుకు సమాచారం కోసం ఎదురుచూస్తోంది. బీహార్ కి చెందిన మదీనా ఖాతూన్ అనే మహిళ, తన పెద్ద కుమారుడు కాలూ ఖాన్ అగ్నిప్రమాదం జరిగిన భవనంలోనే నివసిస్తున్నాడని చెప్పారు. ‘‘మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో నేను అతనితో ఫోన్లో మాట్లాడాను. వచ్చే నెలలో తన వివాహం జరగాల్సి ఉన్నందున జూలై 5న దర్భంగా వస్తానని చెప్పాడు’’ అని విలపించింది. బీహార్లోని దర్భంగా జిల్లాలోని నైనా ఘాట్ ప్రాంతానికి చెందిన ఖాతూన్, తన కుమారుడు కొన్నేళ్లుగా కువైట్లో నివసిస్తున్నాడని చెప్పారు.
కాలూ ఖాన్ స్కిల్ లేబర్గా గత కొన్ని ఏళ్లుగా కువైట్లో నివసిస్తున్నాడు. తన కుమారుడు ఉన్న భవనంలోనే అగ్నిప్రమాదం జరిగిందని అతని తల్లి పేర్కొంది. తాను కాల్ చేసినప్పటికీ స్పందన లేదని, కొడుకు గురించి ఎలాంటి సమాచారం అందలేదని, తన కుమారుడికి ఏం జరిగిందో తెలియడం లేదని చెప్పింది. ఈ విషయంలో అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నించాం, కానీ మా ప్రయత్నం ఫలించలేదని చెప్పింది. నా కొడుకు క్షేమం కోసం దేవుడిని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!