Bihar: సీఎం నితీష్ కుమారుడి పోస్టర్లు కలకలం.. పొలిటికల్ ఎంట్రీపై నిశాంత్ ఏమన్నారంటే..!
- బీహార్లో సీఎం నితీష్ కుమారుడి పోస్టర్లు కలకలం
- నిశాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ పోస్టర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి అధికారాన్ని నిలుపుకునేందుకు జేడీయూ-బీజేపీ కూటమి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించేశారు. ఈసారి ఎక్కువ సీట్లు సాధించేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది.
ఇది కూడా చదవండి: AJTIH : అజిత్ కుమార్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ టీజర్ డేట్ ఫిక్స్
Also Read
- Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
- Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
ఇదిలా ఉంటే బీహార్లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ రాజకీయ ప్రవేశంపై పోస్టర్లు వెలిశాయి. నిశాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ ప్రచారం జోరందుకుంది. ‘‘బీహార్ కరే పుకార్, ఆయే నిశాంత్ కుమార్’’ అనే నినాదంతో పాటు ఆయన చిత్రంతో కూడిన జేడీ(యూ) పోస్టర్లు రాష్ట్రంలో ప్రత్యక్షమయ్యాయి. దీంతో నిశాంత్ రాజకీయ అరంగేట్రంపై ఊహాగానాలు మొదలయ్యాయి.
47 ఏళ్ల నిశాంత్ .. జేడీయూలో ఇప్పటి వరకు ఎలాంటి పదవులు అనుభవించలేదు. ఎలాంటి హడావుడి రాజకీయాలు చేయలేదు. ఒంటరి జీవితాన్నే కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా తక్కువ స్థాయి ప్రొఫైల్ను కొనసాగించారు. అయితే తల్లి మంజు సిన్హా జయంతి సందర్భంగా నిశాంత్ నివాళులు అర్పించడానికి తన తండ్రితో కలిసి స్మారక చిహ్నం దగ్గరకు వచ్చారు. ఈ సందర్భంగా నిశాంత్ను మీడియా ప్రతినిధులు.. పొలిటికల్ ఎంట్రీపై ప్రశ్నించారు. దీనికి బదులు ఇస్తూ.. ‘‘ఇక వదిలేయండి ( అరేయ్ చోడియే )’’ అని నిశాంత్ ఘాటుగా స్పందించారు. తిరిగి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Maha Kumbh Mela: నేటితో ముగుస్తున్న కుంభమేళా.. పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు
బీహార్ మంత్రి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. నిశాంత్ రాజకీయాల్లోకి రావాలా వద్దా అనేది ఆయన తండ్రి నితీష్పైనే ఆధారపడి ఉంటుందని అన్నారు. ‘‘నిశాంత్ జీ రాజకీయాల్లోకి వస్తారా లేదా అనేది నితీష్ కుమార్పై ఆధారపడి ఉంటుంది. ఆయన ఆమోదం లేకుండా పొలిటికల్ నిర్ణయం సాధ్యం కాదు. అయితే నిశాంత్కు బీహార్ రాజకీయాలపై జ్ఞానం మరియు పట్టు ఉందనడంలో సందేహం లేదు” అని ఆయన అన్నారు.
ఇది కూడా చదవండి: Maha Shivaratri 2025: తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి వేడుకలు.. శివనామస్మరణలతో మార్మోగుతున్న శైవ క్షేత్రాలు!
తాజావార్తలు
-
Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
-
Virat Kohli: అందరి చూపు కోహ్లీ వైపే.. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో బద్దలు కొట్టగల రికార్డులు లిస్ట్ ఇదిగో.!
-
IND vs ENG 1st ODI: నేడు భారత్, ఇంగ్లండ్ మొదటి వన్డే.. మ్యాచ్ టైమింగ్స్లో మార్పు, లైవ్ స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!
-
Kiran Abbavaram : కిరణ్ అబ్బవరంపై తమిళ హీరోలు పగపట్టారా..?
-
Bollywood : భారీ ధరకు 25 ఎకరాల భూమి కొనుగోలు చేసిన స్టార్ హీరో
ట్రెండింగ్
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!