Bihar: సీఎం నితీష్ కుమారుడి పోస్టర్లు కలకలం.. పొలిటికల్ ఎంట్రీపై నిశాంత్ ఏమన్నారంటే..!
- బీహార్లో సీఎం నితీష్ కుమారుడి పోస్టర్లు కలకలం
- నిశాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ పోస్టర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి అధికారాన్ని నిలుపుకునేందుకు జేడీయూ-బీజేపీ కూటమి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించేశారు. ఈసారి ఎక్కువ సీట్లు సాధించేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది.
ఇది కూడా చదవండి: AJTIH : అజిత్ కుమార్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ టీజర్ డేట్ ఫిక్స్
Also Read
- Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
- PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
- Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం
- Mamata Banerjee: "నేనూ న్యాయవాదినే.. ఎలా పోరాడాలో నాకు తెలుసు".. బీజేపీపై యుద్ధం ప్రకటించిన దీదీ
ఇదిలా ఉంటే బీహార్లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ రాజకీయ ప్రవేశంపై పోస్టర్లు వెలిశాయి. నిశాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ ప్రచారం జోరందుకుంది. ‘‘బీహార్ కరే పుకార్, ఆయే నిశాంత్ కుమార్’’ అనే నినాదంతో పాటు ఆయన చిత్రంతో కూడిన జేడీ(యూ) పోస్టర్లు రాష్ట్రంలో ప్రత్యక్షమయ్యాయి. దీంతో నిశాంత్ రాజకీయ అరంగేట్రంపై ఊహాగానాలు మొదలయ్యాయి.
47 ఏళ్ల నిశాంత్ .. జేడీయూలో ఇప్పటి వరకు ఎలాంటి పదవులు అనుభవించలేదు. ఎలాంటి హడావుడి రాజకీయాలు చేయలేదు. ఒంటరి జీవితాన్నే కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా తక్కువ స్థాయి ప్రొఫైల్ను కొనసాగించారు. అయితే తల్లి మంజు సిన్హా జయంతి సందర్భంగా నిశాంత్ నివాళులు అర్పించడానికి తన తండ్రితో కలిసి స్మారక చిహ్నం దగ్గరకు వచ్చారు. ఈ సందర్భంగా నిశాంత్ను మీడియా ప్రతినిధులు.. పొలిటికల్ ఎంట్రీపై ప్రశ్నించారు. దీనికి బదులు ఇస్తూ.. ‘‘ఇక వదిలేయండి ( అరేయ్ చోడియే )’’ అని నిశాంత్ ఘాటుగా స్పందించారు. తిరిగి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Maha Kumbh Mela: నేటితో ముగుస్తున్న కుంభమేళా.. పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు
బీహార్ మంత్రి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. నిశాంత్ రాజకీయాల్లోకి రావాలా వద్దా అనేది ఆయన తండ్రి నితీష్పైనే ఆధారపడి ఉంటుందని అన్నారు. ‘‘నిశాంత్ జీ రాజకీయాల్లోకి వస్తారా లేదా అనేది నితీష్ కుమార్పై ఆధారపడి ఉంటుంది. ఆయన ఆమోదం లేకుండా పొలిటికల్ నిర్ణయం సాధ్యం కాదు. అయితే నిశాంత్కు బీహార్ రాజకీయాలపై జ్ఞానం మరియు పట్టు ఉందనడంలో సందేహం లేదు” అని ఆయన అన్నారు.
ఇది కూడా చదవండి: Maha Shivaratri 2025: తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి వేడుకలు.. శివనామస్మరణలతో మార్మోగుతున్న శైవ క్షేత్రాలు!
తాజావార్తలు
-
GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్కు..!
-
Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
-
Suriya: సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
-
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
-
Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం