Bihar: సీఎం నితీష్ కుమారుడి పోస్టర్లు కలకలం.. పొలిటికల్ ఎంట్రీపై నిశాంత్ ఏమన్నారంటే..!
- బీహార్లో సీఎం నితీష్ కుమారుడి పోస్టర్లు కలకలం
- నిశాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ పోస్టర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి అధికారాన్ని నిలుపుకునేందుకు జేడీయూ-బీజేపీ కూటమి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించేశారు. ఈసారి ఎక్కువ సీట్లు సాధించేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది.
ఇది కూడా చదవండి: AJTIH : అజిత్ కుమార్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ టీజర్ డేట్ ఫిక్స్
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- Siddaramaiah: డీకేకు చెక్ పెట్టాలని సిద్ధరామయ్య ప్లాన్.. హైకమాండ్ షాక్
- Congress: భారత్పై నెతన్యాహూ ప్రశంసలు.. మోడీపై కాంగ్రెస్ విమర్శలు..
- Trinamool Congress: ‘‘ముస్లింల కోసమే పనిచేసింది’’.. టీఎంసీ పార్టీ చీఫ్ రాజీనామా..
ఇదిలా ఉంటే బీహార్లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ రాజకీయ ప్రవేశంపై పోస్టర్లు వెలిశాయి. నిశాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ ప్రచారం జోరందుకుంది. ‘‘బీహార్ కరే పుకార్, ఆయే నిశాంత్ కుమార్’’ అనే నినాదంతో పాటు ఆయన చిత్రంతో కూడిన జేడీ(యూ) పోస్టర్లు రాష్ట్రంలో ప్రత్యక్షమయ్యాయి. దీంతో నిశాంత్ రాజకీయ అరంగేట్రంపై ఊహాగానాలు మొదలయ్యాయి.
47 ఏళ్ల నిశాంత్ .. జేడీయూలో ఇప్పటి వరకు ఎలాంటి పదవులు అనుభవించలేదు. ఎలాంటి హడావుడి రాజకీయాలు చేయలేదు. ఒంటరి జీవితాన్నే కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా తక్కువ స్థాయి ప్రొఫైల్ను కొనసాగించారు. అయితే తల్లి మంజు సిన్హా జయంతి సందర్భంగా నిశాంత్ నివాళులు అర్పించడానికి తన తండ్రితో కలిసి స్మారక చిహ్నం దగ్గరకు వచ్చారు. ఈ సందర్భంగా నిశాంత్ను మీడియా ప్రతినిధులు.. పొలిటికల్ ఎంట్రీపై ప్రశ్నించారు. దీనికి బదులు ఇస్తూ.. ‘‘ఇక వదిలేయండి ( అరేయ్ చోడియే )’’ అని నిశాంత్ ఘాటుగా స్పందించారు. తిరిగి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Maha Kumbh Mela: నేటితో ముగుస్తున్న కుంభమేళా.. పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు
బీహార్ మంత్రి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. నిశాంత్ రాజకీయాల్లోకి రావాలా వద్దా అనేది ఆయన తండ్రి నితీష్పైనే ఆధారపడి ఉంటుందని అన్నారు. ‘‘నిశాంత్ జీ రాజకీయాల్లోకి వస్తారా లేదా అనేది నితీష్ కుమార్పై ఆధారపడి ఉంటుంది. ఆయన ఆమోదం లేకుండా పొలిటికల్ నిర్ణయం సాధ్యం కాదు. అయితే నిశాంత్కు బీహార్ రాజకీయాలపై జ్ఞానం మరియు పట్టు ఉందనడంలో సందేహం లేదు” అని ఆయన అన్నారు.
ఇది కూడా చదవండి: Maha Shivaratri 2025: తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి వేడుకలు.. శివనామస్మరణలతో మార్మోగుతున్న శైవ క్షేత్రాలు!
తాజావార్తలు
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
-
CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..