Delhi Mayor Elections: సుప్రీంకోర్టులో ఆప్కు భారీ విజయం.. మేయర్ ఎన్నికకు లైన్ క్లియర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Mayor Elections: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు మార్గం సుగమం అయినట్లే కనిపిస్తోంది. తాజాగా సుప్రీంకోర్టులో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కు భారీ విజయం దక్కింది. మేయర్ ఎన్నికపై సుప్రీం కీలక తీర్పు వెల్లడించింది. లెఫ్టినెంట్ గవర్నర్ నియమించిన సభ్యులు ఓటేయరాని సుప్రీంకోర్టు శుక్రవారం వెల్లడించింది. మేయర్ ఎన్నికపై బీజేపీ, ఆప్ మధ్య ఉద్రిక్తత ఏర్పడింది. ఇప్పటికే మూడు సార్లు మేయర్ ఎన్నిక వాయిదా పడింది.
Read Also: MLA Shankar Naik : వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే శంకర్ నాయక్
Also Read
- West Bengal: సెప్టెంబర్ 1 నుంచి బెంగాల్లో కొత్త రూల్.. మాతృ భాషకు పట్టం కట్టిన సీఎం సువేందు అధికారి!
- Abhijeet Dipke: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే అరెస్ట్..
- India First Dengue Vaccine: శుభవార్త.. భారత్లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్కు ఆమోదం.. ఎవరికి? ఎన్ని డోసులు? పూర్తి వివరాలు
- SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
లెఫ్టినెంట్ గవర్నర్ నియమించిన కౌన్సిలర్ల సహాయంతో మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకోవాలని చూస్తోందని ఆప్ ఆరోపిస్తోంది. అయితే సుప్రీంకోర్టు ఎల్జీ నియమించిన సభ్యులు ఎన్నికల్లో ఓటేయవద్దని స్పష్టం చేసింది. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నియమించిన సభ్యులు మేయర్ ఎన్నికల్లో ఓటేసేందుకు ప్రయత్నించడంతో బీజేపీ, ఆప్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గతేడాది డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ కన్నా ఆప్ ఎక్కువ వార్డులను కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 104 వార్డుల్లో విజయం సాధించగా.. ఆప్ 134 స్థానాల్లో విజయం సాధించింది. 15 ఏళ్ల తరువాత ఢిల్లీ నగర పీఠం నుంచి బీజేపీని గద్దె దించింది.
మేయర్ ఎన్నిక తర్వాతే డిప్యూటీ మేయర్ ఎంపికకు సంబంధించి ఎన్నికలు నిర్వహించవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. ముందుగా మేయర్ ఎన్నిక జరగాలని.. ఆ తరువాత జరిగే డిప్యూటీ మేయర్ ఎన్నికకు మేయర్ అధ్యక్షత వహిస్తారని సీజేఐ డీవై చంద్రచూడ్ అన్నారు. ‘‘సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్య విజయం అని.. ఢిల్లీకి రెండున్నర నెలల తర్వాత మేయర్ పదవి దక్కేనుంది. లెఫ్టినెంట్ గవర్నర్, బీజేపీ కలిసి చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఎలా ప్రవర్తిస్తున్నాయో ఇప్పుడు రుజువైంది’’ అని ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
తాజావార్తలు
-
Covid Cases In AP: ఏపీలో ఆగని కరోనా కేసులు.. బాపట్లలో ఒకరికి కరోనా పాజిటివ్..
-
NBK సినిమాలో ఐశ్వర్య రాజేశ్? ఇప్పటి వరకు చేయని పాత్రలో క్రేజీ బ్యూటీ!
-
Tollywood : ఏం నమ్మి బడ్జెట్ పెడుతున్నారు ?
-
Rag Mayur : తెలుగు నటుడి సంచలనం.. బెస్ట్ యాక్టర్ అవార్డు గెలిచిన రాగ్ మయూర్!
-
CM Chandrababu: ఆర్టీజీఎస్ కేంద్రంలో సీఎం చంద్రబాబు సమీక్ష.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ప్రైవేటీకరణపై కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!