Delhi Mayor Elections: సుప్రీంకోర్టులో ఆప్కు భారీ విజయం.. మేయర్ ఎన్నికకు లైన్ క్లియర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Mayor Elections: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు మార్గం సుగమం అయినట్లే కనిపిస్తోంది. తాజాగా సుప్రీంకోర్టులో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కు భారీ విజయం దక్కింది. మేయర్ ఎన్నికపై సుప్రీం కీలక తీర్పు వెల్లడించింది. లెఫ్టినెంట్ గవర్నర్ నియమించిన సభ్యులు ఓటేయరాని సుప్రీంకోర్టు శుక్రవారం వెల్లడించింది. మేయర్ ఎన్నికపై బీజేపీ, ఆప్ మధ్య ఉద్రిక్తత ఏర్పడింది. ఇప్పటికే మూడు సార్లు మేయర్ ఎన్నిక వాయిదా పడింది.
Read Also: MLA Shankar Naik : వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే శంకర్ నాయక్
Also Read
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
లెఫ్టినెంట్ గవర్నర్ నియమించిన కౌన్సిలర్ల సహాయంతో మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకోవాలని చూస్తోందని ఆప్ ఆరోపిస్తోంది. అయితే సుప్రీంకోర్టు ఎల్జీ నియమించిన సభ్యులు ఎన్నికల్లో ఓటేయవద్దని స్పష్టం చేసింది. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నియమించిన సభ్యులు మేయర్ ఎన్నికల్లో ఓటేసేందుకు ప్రయత్నించడంతో బీజేపీ, ఆప్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గతేడాది డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ కన్నా ఆప్ ఎక్కువ వార్డులను కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 104 వార్డుల్లో విజయం సాధించగా.. ఆప్ 134 స్థానాల్లో విజయం సాధించింది. 15 ఏళ్ల తరువాత ఢిల్లీ నగర పీఠం నుంచి బీజేపీని గద్దె దించింది.
మేయర్ ఎన్నిక తర్వాతే డిప్యూటీ మేయర్ ఎంపికకు సంబంధించి ఎన్నికలు నిర్వహించవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. ముందుగా మేయర్ ఎన్నిక జరగాలని.. ఆ తరువాత జరిగే డిప్యూటీ మేయర్ ఎన్నికకు మేయర్ అధ్యక్షత వహిస్తారని సీజేఐ డీవై చంద్రచూడ్ అన్నారు. ‘‘సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్య విజయం అని.. ఢిల్లీకి రెండున్నర నెలల తర్వాత మేయర్ పదవి దక్కేనుంది. లెఫ్టినెంట్ గవర్నర్, బీజేపీ కలిసి చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఎలా ప్రవర్తిస్తున్నాయో ఇప్పుడు రుజువైంది’’ అని ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
తాజావార్తలు
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
-
PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్పే..
-
Kalabhairava : కావ్య కల్యాణ్రామ్తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!