Balasaheb Thackeray: బాలా సాహెబ్ ఠాక్రేకి భారతరత్న ఇవ్వాలి.. శివసేన, ఎంఎన్ఎస్ డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balasaheb Thackeray: భారత ప్రభుత్వం ఈ రోజు మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్కి అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ను ప్రకటించింది. ఈ ఏడాది ఇప్పటి వరకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఐదుగురికి భారతరత్నలను ప్రకటించింది. ఇదిలా ఉంటే, పలు పార్టీలు తమ నేతలకు కూడా భారతరత్నలను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఇప్పటికే, యూపీ మాజీ సీఎం, బహుజన్ సమాజ్వాదీ పార్టీ అధినేత మాయావతి కాన్షిరామ్కి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేసింది. తాజాగా మహరాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే, బాలా సాహెబ్ ఠాక్రేకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ దేశంలో ప్రముఖ కార్టూనిస్ట్గా దేశవ్యాప్తంగా హిందువులందరికీ గర్వాన్ని తీసుకువచ్చిన నాయకకుడిగా బాల్ ఠాక్రే భారతరత్నకి అర్హుడని ఆయన ట్వీట్ చేశారు.
Also Read
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
- LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
- CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
Read Also: Bhatti Vikramarka: పీవీ నరసింహారావుకి భారత రత్న ప్రకటించడంపై మండలిలో తీర్మానం..
శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ కూడా బాలా సాహెబ్ ఠాక్రేకి భారతరత్నని డిమాండ్ చేశారు. హిందుత్వమని చెప్పుకుని మోడీ ప్రభుత్వం మరోసారి బాలాసాహెబ్ని మరిచిపోయిందని, ఐదుగురు నేతల్ని భారతరత్నతో సత్కరించిందని, వీరిలో వీర్ సావార్కర్, బాలా సాహెబ్ ఠాక్రేలు లేరని ఆయన విమర్శించారు. నిజానికి ఏడాదిలో గరిష్టంగా ముగ్గురికి మాత్రమే భారతరత్న ప్రదానం చేయవచ్చనేది ఒక రూల్ అని, కానీ నెలలోలనే ప్రధాని మోడీ 5 మందికి భారతరత్న ప్రకటించారని, ఇది ఎన్నికల ప్రచారం కాకుంటే మరేంటి..? అని ప్రశ్నించారు. కర్పూరి ఠాకూర్, ఎల్కే అద్వానీల తర్వాత చౌదరి చరణ్ సింగ్, పీవీ నరసింహారావు, ఎంఎస్ స్వామినాథన్లకు భారతరత్న పురస్కారం లభించింది, మరికొందరు నేతలు ఎదురుచూస్తున్నారు. బాల్ ఠాక్రేని ఎందుకు మరిచిపోతున్నారని సంజయ్ రౌత్ మండిపడ్డారు.
हिंदुत्ववादी म्हणवून घेणाऱ्या मोदी सरकारला पुन्हा एकदा हिंदूहृदयसम्राट बाळासाहेब ठाकरे यांचे विस्मरण झाले…आधी 2 आणि आता एकदम 3 असे एका महिन्यात 5 नेत्यांना भारतरत्न ने सन्मानित करण्यात आले…पण त्यात ना वीर सावरकर ना शिवसेनाप्रमुख बाळासाहेब ठाकरे!
खरं तर नियम असा आहे की एका… pic.twitter.com/3ZBq5uo115— Sanjay Raut (@rautsanjay61) February 9, 2024
Former Prime Minister P. V. Narasimha Rao, Chaudhary Charan Singh, and S. Swaminathan, father of the Indian Green Revolution, were posthumously awarded Bharat Ratna. S. Swaminathan passed away just a few months ago. A scientist who achieved so much should have received this… pic.twitter.com/5lTR5H69wR
— Raj Thackeray (@RajThackeray) February 9, 2024
తాజావార్తలు
-
Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
-
Hushar Pittalu : నిజమా కలా? అంటూ స్టేజ్ మీద లైవ్లో పొట్టు పొట్టు కొట్టుకున్న నటుడు!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ‘వాటర్ బాయ్’గానే.. మేనేజ్మెంట్ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం..
-
2027 World Cup: స్టార్ ప్లేయర్లకు నో ఛాన్స్.. వరల్డ్ కప్ జట్టులో ఊహించని ట్విస్ట్..
-
Minister BC Janardhan Reddy: రూ.8,530 కోట్లతో రహదారుల అభివృద్ధి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!