Balasaheb Thackeray: బాలా సాహెబ్ ఠాక్రేకి భారతరత్న ఇవ్వాలి.. శివసేన, ఎంఎన్ఎస్ డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balasaheb Thackeray: భారత ప్రభుత్వం ఈ రోజు మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్కి అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ను ప్రకటించింది. ఈ ఏడాది ఇప్పటి వరకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఐదుగురికి భారతరత్నలను ప్రకటించింది. ఇదిలా ఉంటే, పలు పార్టీలు తమ నేతలకు కూడా భారతరత్నలను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఇప్పటికే, యూపీ మాజీ సీఎం, బహుజన్ సమాజ్వాదీ పార్టీ అధినేత మాయావతి కాన్షిరామ్కి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేసింది. తాజాగా మహరాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే, బాలా సాహెబ్ ఠాక్రేకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ దేశంలో ప్రముఖ కార్టూనిస్ట్గా దేశవ్యాప్తంగా హిందువులందరికీ గర్వాన్ని తీసుకువచ్చిన నాయకకుడిగా బాల్ ఠాక్రే భారతరత్నకి అర్హుడని ఆయన ట్వీట్ చేశారు.
Also Read
- Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
- Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడి చేశాం: మాజీ సీడీఎస్ అనిల్ చౌహాన్..
- Operation Sindoor: పాక్ అణుకేంద్రం ‘‘కిరాణా హిల్స్’’పై దాడి.. సంచలన నిజం చెప్పిన మాజీ CDS..
- Rahul Gandhi: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్గాంధీ మద్దతు
Read Also: Bhatti Vikramarka: పీవీ నరసింహారావుకి భారత రత్న ప్రకటించడంపై మండలిలో తీర్మానం..
శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ కూడా బాలా సాహెబ్ ఠాక్రేకి భారతరత్నని డిమాండ్ చేశారు. హిందుత్వమని చెప్పుకుని మోడీ ప్రభుత్వం మరోసారి బాలాసాహెబ్ని మరిచిపోయిందని, ఐదుగురు నేతల్ని భారతరత్నతో సత్కరించిందని, వీరిలో వీర్ సావార్కర్, బాలా సాహెబ్ ఠాక్రేలు లేరని ఆయన విమర్శించారు. నిజానికి ఏడాదిలో గరిష్టంగా ముగ్గురికి మాత్రమే భారతరత్న ప్రదానం చేయవచ్చనేది ఒక రూల్ అని, కానీ నెలలోలనే ప్రధాని మోడీ 5 మందికి భారతరత్న ప్రకటించారని, ఇది ఎన్నికల ప్రచారం కాకుంటే మరేంటి..? అని ప్రశ్నించారు. కర్పూరి ఠాకూర్, ఎల్కే అద్వానీల తర్వాత చౌదరి చరణ్ సింగ్, పీవీ నరసింహారావు, ఎంఎస్ స్వామినాథన్లకు భారతరత్న పురస్కారం లభించింది, మరికొందరు నేతలు ఎదురుచూస్తున్నారు. బాల్ ఠాక్రేని ఎందుకు మరిచిపోతున్నారని సంజయ్ రౌత్ మండిపడ్డారు.
हिंदुत्ववादी म्हणवून घेणाऱ्या मोदी सरकारला पुन्हा एकदा हिंदूहृदयसम्राट बाळासाहेब ठाकरे यांचे विस्मरण झाले…आधी 2 आणि आता एकदम 3 असे एका महिन्यात 5 नेत्यांना भारतरत्न ने सन्मानित करण्यात आले…पण त्यात ना वीर सावरकर ना शिवसेनाप्रमुख बाळासाहेब ठाकरे!
खरं तर नियम असा आहे की एका… pic.twitter.com/3ZBq5uo115— Sanjay Raut (@rautsanjay61) February 9, 2024
Former Prime Minister P. V. Narasimha Rao, Chaudhary Charan Singh, and S. Swaminathan, father of the Indian Green Revolution, were posthumously awarded Bharat Ratna. S. Swaminathan passed away just a few months ago. A scientist who achieved so much should have received this… pic.twitter.com/5lTR5H69wR
— Raj Thackeray (@RajThackeray) February 9, 2024
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!