Bharat Jodo Yatra: పిల్లలను వాడుతున్నారు.. రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోండి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న‘ భారత్ జోడో యాత్ర’ విమర్శలు, వివాదాలకు కేంద్రంగా నిలుస్తోంది. రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్రపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా రాహుల్ గాంధీ మరో వివాదంలో ఇరుక్కున్నారు. యాత్రలో పిల్లలను రాజకీయ సాధనాలుగా దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలపై రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీలపై చర్యలు తీసుకోవాలని.. విచారణ ప్రారంభించాలని అత్యున్నత బాలల హక్కుల సంఘం (ఎన్సీపీసీఆర్) ఎన్నికల సంఘాన్ని కోరింది. గాంధీ, జవహర్ బాల్ మంచ్లు రాజకీయ ఉద్దేశాలతోనే పిల్లలను వాడుకుంటున్నాయని.. పిల్లలను లక్ష్యంగా చేసుకుని రాజకీయ కార్యక్రమాల్లో వినియోగిస్తున్నారని.. దీనికి సంబంధించి ఫిర్యాదులు అందాయని.. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తెలిపింది.
బాలలకు సంబంధించి అనేక అవాంతర చిత్రాలు, వీడియో సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్నాయని.. ఇందులో పిల్లలను టార్గెట్ చేస్తున్నారని.. బాలల హక్కుల సంఘం వ్యాఖ్యానించింది. రాజకీయ అజెండాలో భాగంగానే భారత్ జోడో యాత్రను ‘బచ్చే జోడో’ యాత్రగా మారుస్తున్నారని ఎన్సీపీసీఆర్ విమర్శించింది. పెద్దలు మాత్రమే రాజకీయ కార్యక్రమాల్లో భాగం కావాలనే ఎన్నికల కమిషన్ నిబంధలను ఇది ఉల్లంఘించడమే అవుతుందని తెలిపింది.
Also Read
- Modi-Xi Jinping: ‘ఈజ్ ఇట్ ఓకే?’.. షీ జిన్పింగ్ను చూసి ప్రసంగం ఆపిన మోడీ.. అసలేం జరిగిందంటే?
- BRICS Currency: బ్రిక్స్ కరెన్సీపై భారత్ కీలక ప్రకటన.. కామన్ కరెన్సీపై ఫుల్ క్లారిటీ..!
- Osama Bin Laden: సీఐఏ సంచలన నివేదిక.. 9/11 కంటే ముందే భారత్లో దాడులకు ఒసామా బిన్ లాడెన్ ప్లాన్..
- Explainer: వి*షం తింటున్నాం...! ప్యాకేజ్డ్ ఫుడ్పై ప్రభుత్వం ఉక్కుపాదం?
Read Also: Errabelli Dayakar Rao: బీజేపీ వల్లే దేశం నాశనమవుతోంది
ప్రాథమికంగా బాలల హక్కుల ఉల్లంఘన జరిగినందున.. రాజకీయ ఎజెండాను నెరవేర్చడానికి పిల్లలను ఆసరాగా ఉపయోగించడం వారి మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని.. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21కి ఇది వ్యతిరేకం అని.. సంఘటనపై సమగ్ర విచారణ జరిగి.. కాంగ్రెస్, రాహుల్ గాంధీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి రాహుల్ గాంధీ సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టారు. 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల గుండా సాగే ఈ యాత్ర ఐదు నెలల తర్వాత కాశ్మీర్ లో ముగుస్తుంది. 3570 కిలోమీటర్ల పాటు యాత్ర కొనసాగనుంది.
తాజావార్తలు
-
Flight Turbulence: టర్కిష్ ఎయిర్లైన్స్ TK663 విమానంలో తీవ్ర కుదుపులు.. మూడు సార్లు ల్యాండింగ్ విఫలం, చివరికి డైవర్ట్
-
Asia Cup 2026 Final: భారత్ vs శ్రీలంక ఫైనల్.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, టీమ్ డీటెయిల్స్ ఇవే!
-
Modi-Xi Jinping: ‘ఈజ్ ఇట్ ఓకే?’.. షీ జిన్పింగ్ను చూసి ప్రసంగం ఆపిన మోడీ.. అసలేం జరిగిందంటే?
-
Glaciers: వేడెక్కుతున్న భూమితో ఏం జరగబోతోంది?
-
BRICS Currency: బ్రిక్స్ కరెన్సీపై భారత్ కీలక ప్రకటన.. కామన్ కరెన్సీపై ఫుల్ క్లారిటీ..!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!