Errabelli Dayakar Rao: బీజేపీ వల్లే దేశం నాశనమవుతోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీజేపీ నేతలు, కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. కరీంనగర్ లో హాట్ కామెంట్స్ చేశారు ఎర్రబెల్లి. నాకు ఇద్దరే ఇద్దరు ఇష్టం. పేదల గురించి ఆలోచించింది ఎన్టీఆర్ కేసీఆర్ లే. కర్ణాటకలో ఓ వృద్ధురాలిని అడిగాను.. బీజేపీ ప్రభుత్వం 500 ఇస్తుందని చెప్పారు.. రెండు వేల మంది ఉంటే 20 మందికి వస్తున్నాయి.. తెలంగాణలో ఒక్క వెలిచాల గ్రామంలోనే 780 మందికి పింఛన్లు వస్తున్నాయిజ బండి సంజయ్ దుమ్ము లేపుతా అంటాడు.. ప్రధాని మోడీ స్వంత రాష్ట్రం గుజరాత్ లో పెన్షన్ ఎంత వస్తుంది? చెప్పాలన్నారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ కంటే తక్కువ పెన్షన్ లున్నాయి.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆరు గంటల కరెంట్ మాత్రమే వస్తుంది. పైగా మోటార్లకు మీటర్లు పెడుతున్నారు. ఒక్కొక్క మోటార్ కు లక్ష రూపాయలు బిల్లు వస్తుంది పెడదామా? నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకూ మోటార్ లకు మీటర్లు పెట్ట నివ్వం అని కేసీఆర్ మోడీకి చెప్పారు. మేము కూడా ఇస్తాం అని బండి సంజయ్ అంటున్నారు.. వాళ్లు ఇచ్చేది రెండు వేలే.. కేసీఆర్ 10 వేలు ఇస్తున్నారు. బీజేపీ నాయకులు దొంగలు దుర్మార్గులు.
Also Read
Read Also: Tammareddy Bharadwaja: కృష్ణంరాజు గురించి మాట్లాడాలంటే నాకు సిగ్గుగా ఉంది
ఇదే పాదయాత్ర దమ్ముంటే కర్ణాటక లో ఉత్తర ప్రదేశ్ లో చేద్దాం రండి అని సవాల్ విసిరారు మంత్రి ఎర్రబెల్లి. తెలంగాణలోని పథకాలు అక్కడి పథకాలు సమానంగా ఉంటే ఎక్కువ లబ్ది ఉంటే నేను గులాం గిరీ చేస్తా. బండి సంజయ్ తుపాకీ రామునిలా మాట్లాడుతున్నారు. మెడికల్ కాలేజీ తెచ్చుకోలేని దద్దమ్మ బండి సంజయ్ అని ఎద్దేవా చేశారు. బీజేపీ మతతత్వ పార్టీ . బీజేపీ వల్ల దేశం నాశనం అవుతుందని ఆరోపించారు ఎర్రబెల్లి. రాష్ట్రానికి రావలసిన నిధులు ఇవ్వడం లేదని కేంద్రంపై మండిపడ్డారు మంత్రి ఎర్రబెల్లి.
తాజావార్తలు
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Telangana Jobs : మెడికల్ జాబ్స్ అలర్ట్.. 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ లిస్ట్ విడుదల.!
-
PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
-
Virat Kohli: SRH మ్యాచ్కు ముందు కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఈ స్థితికి కారణం వారే అంటూ..
-
Peddi: ‘పెద్ది’కి లైన్ క్లియర్.. పర్సంటేజ్ విధానంపై గుడ్ న్యూస్
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!