Bhagavad Gita Controversy: పోలీస్ ట్రైనింగ్లో భగవద్గీత పఠనం.. మధ్యప్రదేశ్లో వివాదం..
- మధ్యప్రదేశ్ లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్లలో భగవద్గీత పఠనం..
- రాత్రి మెడిటేషన్ సెషన్ కు ముందు భగవద్గీత చదవాలని ఆదేశాలు..
- పోలీస్ శాఖ ఆదేశాలను తీవ్రంగా తప్పుబట్టిన కాంగ్రెస్ పార్టీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhagavad Gita Controversy: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ ట్రైనింగ్ అకాడమీల్లో భగవద్గీత అధ్యాయాల పఠనం తప్పనిసరి చేయాలని జారీ చేసిన ఆదేశాలు ఇప్పుడు రాజకీయ వివాదానికి దారి తీసింది. రాష్ట్ర పోలీస్ ట్రైనింగ్ విభాగం తాజాగా జారీ చేసిన సర్క్యులర్లో, ప్రతి రోజు రాత్రి ధ్యానానికి ముందు శిక్షణార్థులు భగవద్గీతలోని ఒక అధ్యాయం చదవాలని సూచించింది. ఈ ఆదేశాలని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ADGP) రాజా బాబు సింగ్ జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భగవద్గీత చదవడం వల్ల పోలీస్ ట్రైనింగ్ తీసుకునే వారు నీతి, ధర్మబద్ధతతో జీవించడం నేర్చుకుంటారని పేర్కొన్నారు.
Read Also: CM Revanth Reddy : కేటీఆర్ అరెస్టుకు గవర్నర్ అనుమతి ఇవ్వడం లేదు..!
Also Read
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
అయితే, కాంగ్రెస్ పార్టీ ఈ సర్క్యులర్లని తీవ్రంగా తప్పబట్టింది. ఇది మతపరమైన ప్రేరేపణగా ఆరోపించింది. కాషాయీకరణగా ప్రయత్నమని, రాజ్యాంగానికి విరుద్ధమని తెలిపింది. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది కాంగ్రెస్. మరోవైపు, అధికార పార్టీ అయిన బీజేపీ మాత్రం ఈ నిర్ణయాన్ని సమర్థించుకుంది. భగవద్గీతలోని విలువలను పోలీస్ ట్రైనింగ్ లో పాటించడం వల్ల పోలీసుల్లో నైతికత పెరుగుతుందని వ్యాఖ్యానించారు.
Read Also: MS Dhoni: ధోని ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. ఐపీఎల్లో ఆడటంపై క్లారిటీ
కాగా, గతంలో కూడా ఏడీజీపీ రాజా బాబు సింగ్ పోలీస్ శిక్షణ సంస్థల్లో తులసీదాస్ రామచరితమానస్ శ్లోకాలను పఠించమని ప్రోత్సహించారు. ఆయన గ్వాలియర్ రేంజ్ ఏడీజీపీగా ఉన్న సమయంలో జైళ్లలోని ఖైదీలకు భగవద్గీత గీతా పుస్తకాలను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా, రాజా బాబు ఇచ్చిన ఆదేశాలతో మతం, ప్రభుత్వ వ్యవస్థ, నైతికతల మధ్య సమతుల్యంపై మరోసారి చర్చ కొనసాగుతుంది.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!