CM Revanth Reddy : కేటీఆర్ అరెస్టుకు గవర్నర్ అనుమతి ఇవ్వడం లేదు..!
- కేటీఆర్ అరెస్టుకు గవర్నర్ అనుమతి అవసరం
- విచారణకు ఓకే.. కానీ చార్జిషీట్కు ఆమోదం రాలే
- గవర్నర్ ఆమోదం లేకుండా అరెస్ట్ చేస్తే 10 నిమిషాల్లో బెయిల్ దొరుకుతుంది : సీఎం రేవంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో అత్యంత సంచలనం సృష్టిస్తున్న ఈ ఫార్మాలా కేసు అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ను అరెస్టు చేయాలన్నా, ఆయనపై చార్జిషీట్ దాఖలు చేయాలన్నా.. గవర్నర్ అనుమతి తప్పనిసరి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేటీఆర్ విచారణకు ఇప్పటికే గవర్నర్ అనుమతి ఇచ్చినా.. చార్జిషీట్కు మాత్రం ఇంకా ఆమోదం లభించలేదన్నారు.
2018లో ‘ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్’ కు చేసిన సవరణల గురించి ప్రస్తావించిన ముఖ్యమంత్రి.. ఏ మంత్రి మీద విచారణ చేయాలన్నా, ఆ తర్వాత చార్జిషీట్ వేయాలన్నా.. గవర్నర్ అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఈ నిబంధనల ప్రకారమే, రాష్ట్ర ప్రభుత్వం కేటీఆర్ పట్ల విచారణ చేయడానికి గవర్నర్ ఆమోదం కోరగా… గవర్నర్ అనుమతి ఇచ్చారన్నారు. విచారణలో నిర్దిష్టమైన ఆధారాలు లభించాయని, దాని ఆధారంగా చార్జిషీట్ ఫైల్ చేయడానికి గవర్నర్ ఆమోదం కోసం పంపించామని రేవంత్ రెడ్డి తెలిపారు.
Also Read
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
- Job Scam: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
- Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
కానీ, ఇక్కడే అసలు సమస్య మొదలైంది..! దాదాపుగా మూడు నెలలు కావస్తున్నా, గవర్నర్ నుంచి ఈ చార్జిషీట్కు సంబంధించిన ఆమోదం లభించలేదు. ఒకవేళ గవర్నర్ అనుమతి లేకుండా కేటీఆర్ను అరెస్ట్ చేసినా, కేసు కట్టినా… కేవలం 10 నిమిషాల్లోనే ఆయనకు బెయిల్ దొరకడానికీ, కేసు నుంచి తప్పించుకోవడానికి దారి దొరుకుతుందనీ ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. అంటే, చట్టపరమైన ప్రక్రియ సక్రమంగా జరగాలంటే, గవర్నర్ అనుమతి కీలకం అని ఆయన చెప్పారు.
ఇదే సందర్భంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రంలోని బీజేపీపై సూటిగా సవాల్ విసిరారు. అవినీతి విషయంలో ఏ మాత్రం రాజీ పడని బీజేపీ… కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ‘నేషనల్ హెరాల్డ్’ పత్రిక విషయంలో సోనియా గాంధీని, రాహుల్ గాంధీని రోజుల కొద్దీ ఈడీ ఆఫీస్కు పిలిపించి విచారించింది. మరి… కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావులను మాత్రం బీజేపీ ఎందుకు వదులుతోందని ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా సైతం కాళేశ్వరం ఒక ‘ఏటీఎం’ గా మారిందని, వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని బహిరంగంగా ప్రకటించారన్నారు.
అలాంటప్పుడు, తాము విచారణ చేయించి, దోషులను శిక్షించమని సీబీఐకి రాసినా… ఆ పని చేయకుండా నెలల కొద్దీ తాత్సారం చేయడం ఎందుకు అని ముఖ్యమంత్రి సూటిగా ప్రశ్నించారు. ఈ వ్యవహారం ముందుకు కదలకపోవడానికి కారణం… ‘ఫెవికాల్ బంధం’ ఎవరిద్దరి మధ్య ఉందో చెప్పాలని రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో బీజేపీని నిలదీశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, హోం శాఖ మంత్రి కింద సీబీఐ వస్తుంది కాబట్టి, కేంద్ర నాయకత్వం దీనికి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Peddi: పెద్ది సినిమాకి కూడా పర్సంటేజ్ కావాల్సిందే.. పట్టు పడుతున్న ఎగ్జిబిటర్లు!
-
Pakistan-Saudi Arabia: సౌదీ అరేబియా రక్షణకు పాకిస్తాన్ కిరాయి సైన్యం..
-
PM Modi: నార్వే ప్రధానితో మోడీ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Viral Video: మూగజీవాల చెంతన మిగిలిన గుండెకోత.. ఏనుగుల కొట్లాటలో ప్రాణాలు కోల్పోయిన మహిళ..
-
Ram Charan: బుచ్చిబాబు వల్లే నా చేతికి గాయమైంది
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!