Bengaluru: శివాజీనగర్ మెట్రోకు “సెయింట్ మేరీ” పేరు..? మరో వివాదంలో సీఎం సిద్ధరామయ్య..
- శివాజీ నగర్ మెట్రో స్టేషన్కు ‘‘సెయింట్ మేరీ’’ పేరు..?
- సీఎం సిద్ధరామయ్య ప్రతిపాదనపై బీజేపీ ఆగ్రహం..
- మరాఠా యోధుని అవమానించడమే అని మహారాష్ట్ర నేతల ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru: బెంగళూర్ నగరంలో శివాజీనగర్ మెట్రో స్టేషన్ త్వరలో ప్రారంభానికి సిద్ధమైంది. మెట్రో స్టేషన్కు ‘‘సెయింట్ మేరీ’’ పేరు పెట్టాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఒత్తిడి చేస్తుండటం తీవ్ర దుమారానికి కారణమైంది. శివాజీ నగర్ మెట్రో స్టేషన్కు సెయింట్ మేరీ పేరు పెట్టడం ఏంటని?? బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరాఠా ఐకాన్ను ఇది అవమానించడమే అని ఆరోపించింది. ఇది శివాజీ మహారాజ్ని అవమానించడమే అని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు.
శివాజీనగర్ లోని సెయింట్ మేరీస్ బసిలికాలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగించిన సీఎం సిద్ధరామయ్య.. రాబోయే స్టేషన్కు సెయింట్ మేరీ పేరు పెట్టాలని కేంద్రానికి సిఫార్సు చేసినట్లు చెప్పారు. ఈ ప్రకటన మహారాష్ట్ర నాయకులతో పాటు కర్ణాటక బీజేపీ నాయకుల నుంచి తీవ్ర విమర్శలకు కారణమైంది.
Also Read
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
- Mohan Bhagwat: న్యూయార్క్లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
- Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
Read Also: Insurance: షోరూంలో వాహనానికి యాక్సిడెంట్ అయితే, ఇన్సూరెన్స్ వస్తుందా..?
“బెంగళూరులోని శివాజీనగర్ మెట్రో స్టేషన్కు సెయింట్ మేరీ పేరు పెట్టాలని కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న చర్యను నేను ఖండిస్తున్నాను. ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్ను అవమానించడం. నెహ్రూ కాలం నుండి మరాఠా యోధుడిని అవమానించే సంప్రదాయాన్ని కాంగ్రెస్ కొనసాగిస్తోంది, ఆయన తన పుస్తకం ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’లో శివాజీ మహారాజ్పై నెహ్రూ వ్యాఖ్యలు చేశారు.” అని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ అన్నారు. దేవుడు సిద్ధరామయ్యకు అలాంటి నిర్ణయం తీసుకోకుండా బుద్ధి చెప్పాలని కోరారు.
బుజ్జగింపు రాజకీయాల కోసం కాంగ్రెస్ దిగజారి ప్రవర్తిస్తోందని బీజేపీ నేత చల్వాడి నారాయణ్ స్వామి అన్నారు. శివాజీ మహారాజ్ పట్ల కాంగ్రెస్ ద్వేషం బహిర్గతమైందని మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్సీ చిత్ర వాఘ్ అన్నారు. ‘‘ బెంగళూర్ శివాజీ నగర్ మెట్రో స్టేషన్కు సెయింట్ మేరీ స్టేషన్గా పేరు మార్చాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే రిజ్వాన్ డిమాండ్ చేశారు. సీఎం సిద్ధరామయ్య పేరు మార్పు కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. దీనిపై మహారాష్ట్ర కాంగ్రెస్ తన వైఖరిని స్పష్టం చేస్తుందా.. మౌనంగా ఉంటుందా..?’’ అని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
-
Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!