Bengaluru: శివాజీనగర్ మెట్రోకు “సెయింట్ మేరీ” పేరు..? మరో వివాదంలో సీఎం సిద్ధరామయ్య..
- శివాజీ నగర్ మెట్రో స్టేషన్కు ‘‘సెయింట్ మేరీ’’ పేరు..?
- సీఎం సిద్ధరామయ్య ప్రతిపాదనపై బీజేపీ ఆగ్రహం..
- మరాఠా యోధుని అవమానించడమే అని మహారాష్ట్ర నేతల ఆగ్రహం..
Bengaluru: బెంగళూర్ నగరంలో శివాజీనగర్ మెట్రో స్టేషన్ త్వరలో ప్రారంభానికి సిద్ధమైంది. మెట్రో స్టేషన్కు ‘‘సెయింట్ మేరీ’’ పేరు పెట్టాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఒత్తిడి చేస్తుండటం తీవ్ర దుమారానికి కారణమైంది. శివాజీ నగర్ మెట్రో స్టేషన్కు సెయింట్ మేరీ పేరు పెట్టడం ఏంటని?? బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరాఠా ఐకాన్ను ఇది అవమానించడమే అని ఆరోపించింది. ఇది శివాజీ మహారాజ్ని అవమానించడమే అని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు.
శివాజీనగర్ లోని సెయింట్ మేరీస్ బసిలికాలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగించిన సీఎం సిద్ధరామయ్య.. రాబోయే స్టేషన్కు సెయింట్ మేరీ పేరు పెట్టాలని కేంద్రానికి సిఫార్సు చేసినట్లు చెప్పారు. ఈ ప్రకటన మహారాష్ట్ర నాయకులతో పాటు కర్ణాటక బీజేపీ నాయకుల నుంచి తీవ్ర విమర్శలకు కారణమైంది.
Also Read
- Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
- Bengal exit polls: బీజేపీ వైపు నాలుగు, టీఎంసీ వైపు రెండు.. ఎగ్జిట్ పోల్స్తో ఉత్కంఠ..
- TM Exit Poll: తమిళనాడు సీఎంగా విజయ్.. సంచలనం స్పష్టిస్తున్న సర్వే..
- Measles Outbreak : బంగ్లాదేశ్ లో విజృంభిస్తున్న మీజిల్స్ మహమ్మారి..భారత్ కి ముప్పు తప్పదా ?
Read Also: Insurance: షోరూంలో వాహనానికి యాక్సిడెంట్ అయితే, ఇన్సూరెన్స్ వస్తుందా..?
“బెంగళూరులోని శివాజీనగర్ మెట్రో స్టేషన్కు సెయింట్ మేరీ పేరు పెట్టాలని కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న చర్యను నేను ఖండిస్తున్నాను. ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్ను అవమానించడం. నెహ్రూ కాలం నుండి మరాఠా యోధుడిని అవమానించే సంప్రదాయాన్ని కాంగ్రెస్ కొనసాగిస్తోంది, ఆయన తన పుస్తకం ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’లో శివాజీ మహారాజ్పై నెహ్రూ వ్యాఖ్యలు చేశారు.” అని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ అన్నారు. దేవుడు సిద్ధరామయ్యకు అలాంటి నిర్ణయం తీసుకోకుండా బుద్ధి చెప్పాలని కోరారు.
బుజ్జగింపు రాజకీయాల కోసం కాంగ్రెస్ దిగజారి ప్రవర్తిస్తోందని బీజేపీ నేత చల్వాడి నారాయణ్ స్వామి అన్నారు. శివాజీ మహారాజ్ పట్ల కాంగ్రెస్ ద్వేషం బహిర్గతమైందని మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్సీ చిత్ర వాఘ్ అన్నారు. ‘‘ బెంగళూర్ శివాజీ నగర్ మెట్రో స్టేషన్కు సెయింట్ మేరీ స్టేషన్గా పేరు మార్చాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే రిజ్వాన్ డిమాండ్ చేశారు. సీఎం సిద్ధరామయ్య పేరు మార్పు కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. దీనిపై మహారాష్ట్ర కాంగ్రెస్ తన వైఖరిని స్పష్టం చేస్తుందా.. మౌనంగా ఉంటుందా..?’’ అని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
-
TRS: టీఆర్ఎస్ పార్టీలోకి 50 మంది చేరిక.. ఎక్కడంటే..
-
Hyderabad Metro : తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోకి హైదరాబాద్ మెట్రో
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?