Bengaluru cafe blast: రామేశ్వరం కేఫ్ పేలుడు నిందితుడిని “విలువైన ఆస్తి”గా పరిగణిస్తున్న ఐఎస్ఐఎస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru cafe blast: బెంగళూర్ రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో కీలక సూత్రధారిని నిన్న పశ్చిమబెంగాల్ నుంచి అరెస్ట్ చేశారు. అరెస్టైన్ అబ్దుల్ మతీన్ తాహాని ‘‘ అత్యంత విలువైన ఆస్తి’’గా ఉగ్రసంస్థ ఐఎస్ఐఎస్ భావిస్తున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. మార్చి 1న కేఫ్లో బాంబు పెట్టిన తాహా మరియు ముస్సావిర్ హుస్సేన్ షాజిబ్లను కోల్కతా సమీపంలోని వారి రహస్య స్థావరం నుండి జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) శుక్రవారం అరెస్టు చేసింది. శనివారం వీరిద్దరిని కోర్టులో హాజరుపరచగా.. వీరికి 10 రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించింది. శుక్రవారం అర్థరాత్రి బెంగళూర్ తీసుకువచ్చి మడివాడాలోని డిటెన్షన్ సెల్కి తరలించారు.
READ ALSO: Bournvita: “బోర్న్విటా”ని హెల్త్ డ్రింక్స్ కేటగిరి నుంచి తీసేయాలి.. కేంద్రం కీలక ఆదేశాలు..
Also Read
- Gurugram Rain: గంట వర్షానికి గురుగ్రామ్ అతలాకుతలం.. జనజీవనం అస్తవ్యస్థం
- Sugar Prices: చక్కెర ధరలపై గుడ్న్యూస్.. దిగిరానున్న ధరలు
- Jaishankar-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్తో జైశంకర్ భేటీ.. రెండు దేశాల సంబంధాలపై చర్చ
- Tamil Nadu: చెన్నైలో పరందూర్ ఎయిర్పోర్టును రద్దు చేసిన ప్రభుత్వం.. మండిపడ్డ స్టాలిన్
ఇద్దరు నిందితులను విచారించడంతో పాటు నిందితులను పేలుడు జరిగిన ప్రదేశంతో పాటు బెంగళూర్, చెన్నైలోని వారు బస చేసిన ప్రదేశానికి తీసుకెళ్లి స్పాట్ ఇంక్వెస్ట్ నిర్వహించారు. గత 5 ఏల్లుగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) రాడార్లో అబ్దుల్ మతీన్ తాహా ఉన్నాడు. బెంగళూర్ పేలుడుకు ఇతనే ప్లాన్ చేశాడు. నవంబర్ 2022లో మంగళూరులో జరిగిన ఐఎస్ ప్రాయోజిత ప్రెషర్ కుక్కర్ బాంబు పేలుడు, 2022లో శివమొగ్గ ట్రయల్ పేలుళ్లు మరియు 2020లో అల్ హింద్ మాడ్యూల్ కేసుతో తాహాకు సంబంధం ఉంది. అతనికి ఒక ‘‘కల్నల్’’ అనే వ్యక్తితో సంబంధం ఉందని, ఇతని పేరు దక్షిణ, మధ్య భారతదేశంలో అంతటా అనేక సందర్భాల్లో వెలుగులోకి వచ్చింది.
వీరిద్దరికి కల్నల్తో సంబంధం, అతనితో ఎన్ని సమావేశాలు జరిగాయి, ఉగ్రవాద కార్యకలాపాలకు చెల్లింపు విధానం, భవిష్యత్ ప్రణాళికలపై ప్రశ్నించాలని ఎన్ఐఏ అధికారులు ప్లాన్ చేస్తున్నారు. తాహా, ముస్సావిర్ హుస్సేన్ తమిళనాడుకు ఎలా తప్పించుకున్నారనే విషయాలను కూడా ఎన్ఐఏ రాబడుతోంది. కేఫ్ వద్ద బ్లైండ్ స్పాట్స్లని అర్థం చేసుకునేందుకు తాహా ఒక వారం పాటు రెక్కీ నిర్వహించాడు. రెండు వారాల క్రితం అరెస్టైన మరో నిందితుడు ముజమ్మిల్ షరీఫ్ తాహా కోసం హోటల్, నగరం నుంచి ఎలా వెళ్లాలనే దానిపై ప్రత్యేక మార్గాలను రూపొందించాడు. అయితే, బెంగాల్లో పట్టుబడిన నిందితులు బంగ్లాదేశ్ పారిపోయేందుకు ప్లాన్ చేస్తున్నారా..? లేదా సరిహద్దు అవతలి వైపు నుంచి ఎవరైనా వీరికి సహాయం చేస్తున్నారా..? అనే విషయాలపై దర్యాప్తు జరుగుతోందని కర్ణాటక హోం మినిస్టర్ పరమేశ్వర అన్నారు.
తాజావార్తలు
-
Sai Kumar: రవి నువ్వొక దొంగవి.. సాయికుమార్ కామెంట్స్తో నవ్వులే నవ్వులు!
-
FEFSI : కోలీవుడ్లో సమ్మె సైరన్పై ఫెఫ్సీ ఆందోళన: బంద్ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి!
-
Rambha Urvashi Menaka Trailer: నవ్వులు పూయిస్తున్న అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ ట్రైలర్.. చూశారా!
-
Gurugram Rain: గంట వర్షానికి గురుగ్రామ్ అతలాకుతలం.. జనజీవనం అస్తవ్యస్థం
-
India vs Afghanistan: భారత్తో పోరుకు ఆఫ్ఘనిస్తాన్ సై.. జట్టులోకి ప్రమాదకర పేసర్ రీఎంట్రీ
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!