West Bengal: బెంగళూర్ కేఫ్ పేలుడు కేసు.. బెంగాల్లో టీఎంసీ వర్సెస్ బీజేపీ..
West Bengal: బెంగళూర్లో రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడుకు పాల్పడిన ఇద్దరు నిందితులను పశ్చిమ బెంగాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అరెస్ట్ చేసింది. అయితే ఈ పరిణామం బెంగాల్లో రాజకీయ రచ్చకు దారి తీసింది. అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), ప్రతిపక్ష బీజేపీకి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ రోజు రాష్ట్రంలోని తూర్పు మిడ్నాపూర్ జిల్లాలో ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు. రాష్ట్రం ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని బీజేపీ విమర్శలు గుప్పించింది. అయితే, ఈ ఆరోపణలపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టైన ఇద్దరు వ్యక్తులు ఈ రాష్ట్రానికి చెందిన వారు కాదని, వారు ఇక్కడ దాక్కున్నారని, రెండు గంటల్లో వారిని అరెస్ట్ చేశామని ఆమె అన్నారు. బెంగాల్లో శాంతి నెలకొంటే బీజేపీ సహించదని ఆరోపించారు. ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, బీహార్ రాష్ట్రాలు సూర్తిగా సురక్షితంగా ఉన్నాయా..? అని ప్రశ్నించారు.
Read Also: PM Modi: జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..
Also Read
- Grok's Reply: రాహుల్ గాంధీ పరువు తీసిన గ్రోక్.. ప్రధానిగా మోడీకి మద్దతు..
- Delhi: టేకాఫ్ సమయంలో ఇంజిన్లో మంటలు.. విమానంలోని ఆరుగురికి గాయాలు.!
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Mamata Banerjee: తలకిందులుగా వేలాడదీయడం ఏంటి.? అమిత్ షాపై దీదీ ఆగ్రహం..
సీనియర్ టీఎంసీ లీడర్ కునాల్ ఘోష్ కూడా బీజేపీ ఆరోపణల్ని తిప్పికొట్టారు. ఎన్ఐఏకి రాష్ట్ర పోలీసులు సహకారాన్ని అంగీకరించాలని అన్నారు. బెంగళూర్ బ్లాస్ట్ కేసులో ఈ రోజు ముస్సావిర్ హుస్సేన్ షాజేబ్, అబ్దుల్ మతీన్ తాహా అరెస్టయ్యారు. వీరిద్దరు కీలకమైన కుట్రదారులుగా ఉన్నారు. షాజెబ్ బాంబును అమర్చగా.. తాహా లాజిస్టిక్ సపోర్ట్ ఇచ్చినట్లు భావిస్తున్నారు. వీరిద్దరిని పూర్బా మేదినిపూర్ జిల్లాలో కంఠి లేదా కోటాయ్ అనే చిన్న పట్టణంలో ట్రేస్ చేశారు.
కంఠి ప్రాంతం బీజేపీ ప్రతిపక్ష నేత సువేందు అధికారికి చెందిన కంచుకోటగా ఉంది. దీంతో కునాల్ ఘోష్ మాట్లాడుతూ.. రామేశ్వరం కేఫ్ బాంబర్లకు సువేందు అధికారికి మధ్య ఉన్న సంబంధాలను పరిశోధించాలని రాష్ట్ర అధికారులను కోరారు. బెంగాల్ పోలీసులు దేశవ్యతిరేక శక్తుల్ని అణిచివేయడంలో దృఢంగా ఉన్నారని, ఇతర ఏజెన్సీలకు సహకరించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. బెంగళూర్ కేఫ్ బ్లాస్ట్ కేసులో ఒక బీజేపీ కార్యకర్తను కూడా ఎన్ఐఏ అధికారులు ప్రశ్నించడాన్ని కునాల్ ఘోష్ ఎత్తి చూపారు.
తాజావార్తలు
-
Oasis Janani Yatra: సంతానోత్పత్తి అవగాహనే లక్ష్యంగా.. తిరుపతి చేరుకున్న ‘ఓయాసిస్ జనని’ యాత్ర.!
-
JD Chakravarthy: అదే మలయాళ సినిమాలు మనవాళ్లు తీస్తే చూడరు.. జేడీ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు!
-
Improve Sperm Quality: వీర్యకణాల సమస్యకు నేచురల్ సొల్యూషన్.. వీర్య నాణ్యత పెంచే ఆహారపదార్థాలు ఇవే.!
-
Grok’s Reply: రాహుల్ గాంధీ పరువు తీసిన గ్రోక్.. ప్రధానిగా మోడీకి మద్దతు..
-
Orange Cap Holders: ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘట్టం.. ఒక రోజులో పూటకో ఆరెంజ్ క్యాప్ హోల్డర్!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!