Bengaluru Blast : కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రసిద్ధ రామేశ్వరం కేఫ్లో బాంబుతో భీభత్సం సృష్టించిన ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) శుక్రవారం (ఏప్రిల్ 12) పశ్చిమ బెంగాల్లో బాంబు పేలుడు సూత్రధారి సహా ఇద్దరు నిందితులను అరెస్టు చేసింది.
West Bengal: బెంగళూర్లో రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడుకు పాల్పడిన ఇద్దరు నిందితులను పశ్చిమ బెంగాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అరెస్ట్ చేసింది. అయితే ఈ పరిణామం బెంగాల్లో రాజకీయ రచ్చకు దారి తీసింది.
కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్లో పేలుడు ఘటన సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఎన్ఐఏ కీలక పురోగతి సాధించింది. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో కీలక నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది.
Karnataka: బెంగళూర్ రామేశ్వర్ కేఫ్ బాంబు పేలుడు ఘటన కర్ణాటకలో రాజకీయ అస్త్రంగా మారింది. ఇటీవల బీజేపీ కార్యకర్తకు నిందితులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో ఎన్ఐఏ ఓ వ్యక్తిని అరెస్ట్ చేసింది.
Bengaluru cafe blast: బెంగళూర్ రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో ఎన్ఐఏ విచారన వేగవంతం చేసింది. ఇప్పటికే ప్రధాన నిందితులకు సహకరించిన వ్యక్తిని ఎన్ఐఏ అరెస్ట్ చేయగా.. ఇద్దరు నిందితులు ముసావిర్ హుస్సేన్ షాజిబ్, అబ్దుల్ మతీన్ తాహాలపై ఎన్ఐఏ భారీ రివార్డు ప్రకటించింది.
Bengaluru cafe blast: మార్చి 1న బెంగళూర్లోని ప్రసిద్ధ రామేశ్వరం కేఫ్లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు. మాస్కు ధరించి వచ్చిన ఓ వ్యక్తి బాంబు ఉన్న బ్యాగును అక్కడే వదిలి వెళ్లిన వీడియోలు సీసీటీవీలో రికార్డయ్యాయి. పేలుడుతో తక్కువ తీవ్రత ఉన్న ఐఈడీ వాడటంతో ప్రాణనష్టం తప్పింది. అయితే, అప్పటి నుంచి నిందితుడిని పట్టుకునేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), బెంగళూర్ క్రైం ఇన్వెస్టిగేషన్ టీం ప్రయత్నిస్తున్నాయి. నిందితుడికి సంబంధించిన వీడియోలను విడుదల…
Bengaluru Cafe Blast Case : కర్ణాటక రాజధాని బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఘన విజయం సాధించింది. ప్రధాన నిందితుడిని ఏజెన్సీ అదుపులోకి తీసుకున్నట్లు వర్గాలు తెలిపాయి.
Bengaluru Cafe Blast: బెంగళూర్లో రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు నిందితుడి కొత్త ఫోటోలను కేంద్ర దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విడుదల చేసింది. మార్చి 3న కేసును స్వాధీనం చేసుకున్న ఎన్ఐఏ, నిందితుడిని గుర్తించేందు ప్రజల సాయాన్ని కోరింది. మార్చి 1న బెంగళూర్లోని ఐటీ కారిడార్లోని కేఫ్లో నిందితుడు బ్యాగుల్లో ఐఈడీ బాంబును ఉంచి, టైమర్ సాయంతో పేల్చాడు. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు. పేలుడు తర్వాత నిందితుడు బస్సు ఎక్కినట్లు సీసీటీవీ ఫుటేజ్లో కనిపించింది.
Bengaluru cafe blast: బెంగళూర్లో రామేశ్వరం కేఫ్ పేలుడు జరిగి వారం గడుస్తోంది. ఇప్పటికీ నిందితుడిని పట్టుకునేందుకు దర్యాప్తు సంస్థలు వేటను సాగిస్తూనే ఉన్నాయి. నిందితుడికి సంబంధించిన పలు వీడియోలు బయటకు వచ్చాయి. వీటి ఆధారంగా కర్ణాటక పోలీసులు, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దర్యాప్తు చేస్తోంది. ఇదిలా ఉంటే నిందితుడికి సంబంధించిన తాజా వీడియో ఒకటి బయటకు వచ్చింది. ముసుగు దరించి బూడిద రంగు చొక్క ధరించినట్లు ఈ వీడియోలో చూడవచ్చు.