Bengaluru Water Crisis: నీటిని దుర్వినియోగం చేసినందుకు 22 కుటుంబాలకు జరిమానా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru Water Crisis: బెంగళూర్ నగరం తీవ్ర నీటి సంక్షోభంలో చిక్కుకుంది. ఎన్నడూ లేని విధంగా నగర ప్రజలు నీటికి అల్లాడుతున్నారు. దశాబ్ధ కాలంలో ఇలాంటి నీటి ఎద్దడిని నగరం ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఇదిలా ఉంటే నీటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అధికారులు ప్రజలకు జరిమానాలు విధిస్తున్నారు. నీటి సంక్షోభం ఉన్న సమయంలో కార్లను కడిగేందుకు నీటిని వృథా చేశారని చెబుతూ.. నగర అధికారులు 22 కుటుంబాలకు జరిమానా విధించారు. 22 కుటుంబాలకు 3 రోజుల్లో రూ. 1.10 లక్షల జరిమానా వసూలు చేశారు.
Read Also: Arvind Kejriwal Arrest: జర్మనీ దారిలోనే అమెరికా.. కేజ్రీవాల్ అరెస్ట్పై కీలక వ్యాఖ్యలు..
Also Read
- Sugar Shortage: దేశంలో చక్కెర కొరతా..? ధరలు పెరుగుతాయా..? క్లారిటీ ఇచ్చిన AISTA
- Yuvraj Singh: "శాంతియుత పరిష్కారమే మార్గం".. సీజేపీ ఆందోళనలపై స్పందించిన సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్!
- Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
- Sonam Raghuvanshi: సోనమ్ రఘువంశీకి షాక్.. బెయిల్ను రద్దు చేసిన సుప్రీంకోర్టు.. మూడు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశం
బెంగళూర్ వాసులు నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఆగ్నేయ నగరంలో అత్యధిక ఫిర్యాదులు నమోదవుతున్నాయని, ప్రజలు నీటి దుర్వినియోగాన్ని తగ్గించాలని బీడబ్ల్యూఎస్ఎస్బీ చైర్పర్సన్ రామ్ ప్రశాంత్ మనోహర్ తెలిపారు. ఇప్పటి వరకు విధించిన జరిమానా మొత్తం రూ. 1.10 లక్షల్లో, నైరుతి ప్రాంతం నుంచే రూ. 65,000 వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ నెల ప్రారంభం నుంచి బెంగళూర్ అధికారులు వాహనాలను శుభ్రపరచడం, తోటపని, భవనాల నిర్మానం, రన్నింగ్ ఫౌంటైన్లు మొదలైన వాటికి నీటిని ఉపయోగించడాన్ని నిషేధించారు. నగరంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, కొద్ధి రోజుల్లో భూగర్భ జలాలు అడగంటుకు పోతాయనే వార్తల నేపథ్యంలో నీటి వృథాను తగ్గించాలని అధికారులు భావిస్తున్నారు. మార్చి నెలలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ.. నగరానికి రోజుకు 500 మిలియన్ లీటర్ల నీరు(ఎంఎల్డీ) కొరత ఉందని, వాస్తవానికి రోజుకు 2600 మిలియన్ లీటర్లు అవసముందని ఆయన చెప్పారు. బెంగళూర్ నగరంలో 14,000 బోర్ వెల్స్లో 6900 ఎండిపోయాయని చెప్పారు.
తాజావార్తలు
-
WTC Final 2027: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 ఫైనల్ వేదిక, తేదీలు ఖరారు.!
-
Vijayashanti: నటించాలని లేదు కానీ.. విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, నేతన్నలకు భరోసా..
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
ట్రెండింగ్
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!