Bengaluru Water Crisis: నీటిని దుర్వినియోగం చేసినందుకు 22 కుటుంబాలకు జరిమానా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru Water Crisis: బెంగళూర్ నగరం తీవ్ర నీటి సంక్షోభంలో చిక్కుకుంది. ఎన్నడూ లేని విధంగా నగర ప్రజలు నీటికి అల్లాడుతున్నారు. దశాబ్ధ కాలంలో ఇలాంటి నీటి ఎద్దడిని నగరం ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఇదిలా ఉంటే నీటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అధికారులు ప్రజలకు జరిమానాలు విధిస్తున్నారు. నీటి సంక్షోభం ఉన్న సమయంలో కార్లను కడిగేందుకు నీటిని వృథా చేశారని చెబుతూ.. నగర అధికారులు 22 కుటుంబాలకు జరిమానా విధించారు. 22 కుటుంబాలకు 3 రోజుల్లో రూ. 1.10 లక్షల జరిమానా వసూలు చేశారు.
Read Also: Arvind Kejriwal Arrest: జర్మనీ దారిలోనే అమెరికా.. కేజ్రీవాల్ అరెస్ట్పై కీలక వ్యాఖ్యలు..
Also Read
బెంగళూర్ వాసులు నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఆగ్నేయ నగరంలో అత్యధిక ఫిర్యాదులు నమోదవుతున్నాయని, ప్రజలు నీటి దుర్వినియోగాన్ని తగ్గించాలని బీడబ్ల్యూఎస్ఎస్బీ చైర్పర్సన్ రామ్ ప్రశాంత్ మనోహర్ తెలిపారు. ఇప్పటి వరకు విధించిన జరిమానా మొత్తం రూ. 1.10 లక్షల్లో, నైరుతి ప్రాంతం నుంచే రూ. 65,000 వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ నెల ప్రారంభం నుంచి బెంగళూర్ అధికారులు వాహనాలను శుభ్రపరచడం, తోటపని, భవనాల నిర్మానం, రన్నింగ్ ఫౌంటైన్లు మొదలైన వాటికి నీటిని ఉపయోగించడాన్ని నిషేధించారు. నగరంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, కొద్ధి రోజుల్లో భూగర్భ జలాలు అడగంటుకు పోతాయనే వార్తల నేపథ్యంలో నీటి వృథాను తగ్గించాలని అధికారులు భావిస్తున్నారు. మార్చి నెలలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ.. నగరానికి రోజుకు 500 మిలియన్ లీటర్ల నీరు(ఎంఎల్డీ) కొరత ఉందని, వాస్తవానికి రోజుకు 2600 మిలియన్ లీటర్లు అవసముందని ఆయన చెప్పారు. బెంగళూర్ నగరంలో 14,000 బోర్ వెల్స్లో 6900 ఎండిపోయాయని చెప్పారు.
తాజావార్తలు
-
Canada vs Bosnia: సూపర్ సబ్ ‘లారిన్’ మ్యాజిక్.. బోస్నియా, కెనడా 1-1తో డ్రా.!
-
Jaishankar: యూఎస్ విదేశాంగ కార్యదర్శి రూబియోకి జైశంకర్ ఫోన్.. అమెరికాకు భారత్ బిగ్ వార్నింగ్..
-
Homemade Collagen Drink: యవ్వనమైన చర్మానికి సహజ రహస్యం.. ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ నేచురల్ డ్రింక్!
-
ENG W vs SL W: శతకంతో ‘డ్యానీ వ్యాట్’ వీరవిహారం.. మహిళల టీ20 ప్రపంచకప్లో ఇంగ్లండ్ బోణి.!
-
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్లో కలకలం.. 22 మంది అధికారుల సస్పెన్షన్
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!