Amit Shah: బంగ్లాదేశ్ చొరబాట్లు ఆగినప్పుడే బెంగాల్లో శాంతి..
- బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు ఆగినప్పుడే బెంగాల్లో శాంతి..
- అమిత్ షా కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: బంగ్లాదేశ్ నుంచి భారత్కు అక్రమ వలసలు రెండు దేశాల మధ్య శాంతియుత సంబంధాలకు విఘాతం కలిగిస్తాయని, సరిహద్దు చొరబాట్లను ఆపినప్పుడే పశ్చిమ బెంగాల్లో శాశ్వత శాంతి నెలకొంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం అన్నారు. పశ్చిమ బెంగాల్లోని భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని పెట్రాపోల్ ల్యాండ్ పోర్ట్లో కొత్త ప్యాసింజర్ టెర్మినల్ భవనం, కార్గో గేట్ ప్రారంభించిన సందర్భంగా అమిత్ చేశారు. 2026లో పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారం చేపడితే బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసల్ని అరికట్టవచ్చని చెప్పారు.
Read Also: Hyderabad Metro: రాబోయే నాలుగేళ్లలో హైదరాబాద్ మెట్రో రైల్ రెండవ దశ ప్రాజెక్ట్ పూర్తి?
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
“సరిహద్దులు దాటడానికి చట్టబద్ధమైన మార్గం లేనప్పుడు, అక్రమ వలసలు జరుగుతాయి. అక్రమ వలసలు ఇండో-బంగ్లాదేశ్ శాంతికి హాని కలిగిస్తాయి. నేను బెంగాల్ ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను, 2026 లో బీజేపీని గెలిపించండి. చొరబాట్లను మేము ఆపేస్తాం. చొరబాట్లు ఆగితేనే బెంగాల్లో శాంతి నెలకొంటుంది’’ అని కేంద్ర హోం మంత్రి అన్నారు. ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు ల్యాండ్ పోర్ట్లు ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య కనెక్టివిటీ మరియు సంబంధాలను మెరుగుపరచడంలో ల్యాండ్ పోర్ట్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని, ఇవి రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను కూడా మెరుగుపరుస్తాయని చెప్పారు.
బెంగాల్ అభివృద్ధికి ప్రధాని మోడీ పంపిన నిధులను తృణమూల కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటుందని ఆరోపించారు. నరేంద్రమోడీ హయాంలో ఎన్డీయే ప్రభుత్వం గత పదేళ్లలో రూ. 56,000 కోట్లు ఇచ్చారని, ఈ నిధులు టీఎంసీ చేతుల్లో వెళ్లాయా..? దీనిపై విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. 2026లో రాజకీయ మార్పు తీసుకురావాలని అమిత్ షా బెంగాల్ ప్రజలకు పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!