Yakub Memon: ముంబై పేలుళ్ల దోషి యాకుబ్ మెమన్ సమాధి సుందరీకరణ.. విచారణకు ఆదేశించిన సీఎం ఏక్నాథ్ షిండే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Beautification of Yakub Memon’s grave.. CM Eknath Shinde ordered the investigation: 1993 ముంబై పేలుళ్ల దోషి యాకుబ్ మెమన్ సమాధిని సుందరీకరించడంపై మహారాష్ట్రలో రాజకీయ దుమారం రేగుతోంది. దీనిపై సీఎం ఏక్ నాథ్ షిండే విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఈ విషయంపై విచారాణ చేసి నివేదిక సమర్పించాలని ముంబై పోలీసులను సీఎం ఆదేశించారు. గత ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే హయాంలో యాకుబ్ మెమన్ సమాధిని సుందరీకరించడంపై బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ విమర్శలు గుప్పించారు. ఒక ఉగ్రవాది సమాధిని మజార్ గా మార్చడం ఉద్దవ్ ఠాక్రే దేశభక్తికి నిదర్శనం అని విమర్శలు గుప్పించారు. పాక్ ఆదేశాల ప్రకారం ముంబైలో మారణహోమానికి పాల్పడిన ఉగ్రవాది యాకుబ్ మెమన్ సమాధిని సీఎం ఉద్ధవ్ ఠాక్రే హయాంలో సుందరీకరించారని..దీనిపై శరద్ పవార్, రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్యే రామ్ కదమ్ డిమాండ్ చేశారు.
Read Also: Brahmastra Movie Review: బ్రహ్మాస్త్ర పార్ట్ 1 – శివ రివ్యూ (హిందీ డబ్బింగ్)
Also Read
- Saayoni Ghosh: పార్లమెంట్ను అడ్డుకోవడం భావ్యం కాదు.. టీఎంసీ రెబల్ సాయోని ఘోష్ ఆగ్రహం
- El Nino Alert: ఐఎండీ అలర్ట్.. ఆగస్టులో తక్కువ వర్షాలుంటాయని హెచ్చరిక
- Delhi: ఐబీ ఉద్యోగి అంకిత్ శర్మ హత్య కేసులో సంచలన తీర్పు.. మాజీ ఆప్ నేత తాహిర్ హుస్సేన్కు జీవిత ఖైదు
- PM-KISAN Scheme: రైతులకు కేంద్రం గుడ్న్యూస్.. మరో ఐదేళ్లు పీఎం-కిసాన్
దక్షిణ ముంబైలోని బడా కబ్రస్తాన్లో మెమన్ సమాధి సుందరీకరణపై మహారాష్ట్రలో రాజకీయా వివాదం చెలరేగింది. బీజేపీ, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. గతంలో యాకుబ్ మెమన్ సమాధి మట్టితో ఉండేది.. ప్రస్తుతం అక్కడ పాలరాతితో సమాధిని తీర్చిదిద్దారు. అక్కడ లైటింగ్ ఏర్పాట్లను సీఎం ఆదేశాల తర్వాత పోలీసులు నిలిపివేశారు. అయితే ఏ ఉగ్రవాదిని కీర్తించరాదని.. మెమన్ సమాధిని తీర్చిదిద్దడాన్ని అనుమతించబోమని ఎన్సీపీ ప్రతిపక్ష నేత అజిత్ పవార్ అన్నారు. కాాగా.. బీజేపీ విమర్శలను ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గం తిప్పికొట్టింది. మెమన్ ను ఉరి తీసిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అంత్యక్రియల కోసం ఇవ్వడాన్ని ఎందుకు అనుమతించారని ప్రశ్నించారు. యూపీఏ హాయాంలో అఫ్జల్ గురు, పాక్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ ను ఉరితీసినప్పుడు వారి మృతదేహాలను రహస్యంగా ఖననం చేశామని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అతుల్ లోండే అన్నారు.
1993 ముంబై వరస పేలుళ్ల కేసులో ఇప్పటి వరకు కేవలం యాకుబ్ మెమన్ కు మాత్రమే ఉరిశిక్ష విధించబడింది. మార్చి 12, 1993న ముంబైలో వరస పేలుళ్లు జరిగాయి. 257 మంది మరణించగా.. 700 మంది గాయపడ్డారు. సుమారు రూ.27 కోట్ల విలువైన ఆస్తి నష్టం ఏర్పడింది. ఈ కేసును సీబీఐ విచారించింది. జూన్ 16, 2017న ముస్తఫా దోస్సా, అబూ సలెేంతో పాటు మరికొంత మంది ఈ కేసులో దోషులుగా నిర్థారించబడ్డారు. అయితే ఈ పేలుళ్లకు ప్రధాన సూత్రధారి అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం మాత్రం ప్రస్తుతం పాకిస్తాన్ లోని కరాచీలో ఉంటున్నట్లు భారత నిఘా వర్గాలు చెబుతున్నాయి.
తాజావార్తలు
-
Andhra Pradesh: ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల.. 44.89 లక్షల మంది ఆచూకీ లేని ఓటర్లు
-
Telangana SIR : తెలంగాణ ఓటర్లకు గుడ్న్యూస్.. SIR గడువు మరోసారి పొడిగింపు.!
-
Chanakya Niti: ఎంత కోపం వచ్చినా ఇలా కంట్రోల్ చేసుకోండి.. చాణక్యుడి 5 విజయ మంత్రాలు ఇవే!
-
Saayoni Ghosh: పార్లమెంట్ను అడ్డుకోవడం భావ్యం కాదు.. టీఎంసీ రెబల్ సాయోని ఘోష్ ఆగ్రహం
-
Gold Loan Demand: గోల్డ్ లోన్ల జోరు.. మేలో కొత్త రికార్డు.. ఆర్బీఐ వార్నింగ్..
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!