PM Modi: “AIతో జాగ్రత్తగా ఉండాలి”.. పారిస్ సదస్సులో ప్రధాని మోడీ..
- ఏఐ పక్షపాతం, ప్రమాదాల గురించి జాగ్రత్తగా ఉండాలి..
- ఏఐ యాక్షన్ సమ్మిట్లో ప్రధాని మోడీ కీలక ప్రసంగం..
- వివిధ రంగాల్లో ఏఐ పురోగతిపై చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: పారిస్లో జరుగుతున్న AI యాక్షన్ సమ్మిట్లో ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ప్రమాదాలు, పక్షపాతం గురించి ఆందోళన లేవనెత్తారు. అభివృద్ధి చెందుతున్న ఏఐ రంగంలో జాగ్రత్తగా, సహకారంతో కూడిన ప్రపంచ పాలన అవసరాన్ని ప్రధాని నొక్కి చెప్పారు. ప్రధాని తన ప్రసంగంలో ఆర్థిక వ్యవస్థ, భద్రత, సమాజం వంటి కీలక రంగాలను ఏఐ ఎలా పునర్నర్మిస్తుందనే విషయాన్ని హైలెట్ చేశారు.
Also Read
- JP Nadda - CJP Leaders: నడ్డాతో సీజేపీ నాయకుల భేటీ.. సీజేపీ డిమాండ్స్ ఇవే!
- West Bengal: సెప్టెంబర్ 1 నుంచి బెంగాల్లో కొత్త రూల్.. మాతృ భాషకు పట్టం కట్టిన సీఎం సువేందు అధికారి!
- Abhijeet Dipke: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే అరెస్ట్..
- India First Dengue Vaccine: శుభవార్త.. భారత్లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్కు ఆమోదం.. ఎవరికి? ఎన్ని డోసులు? పూర్తి వివరాలు
మానవ జీవితాల్లో ఏఐ ఏ విధంగా కీలక పాత్ర పోషిస్తుందనే దాని గురించి ప్రధాని మోడీ మాట్లాడారు. ఏఐ ప్రయోజనాలు అందరితో, ముఖ్యంగా గ్లోబల్ సౌత్తో పంచుకోవాలని కోరారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పక్షపాతాల గురించి కూడా హెచ్చరించారు. “మనం మన వనరులను మరియు ప్రతిభను సమీకరించి, విశ్వాసం, పారదర్శకతను పెంపొందించే ఓపెన్ సోర్స్ వ్యవస్థలను అభివృద్ధి చేయాలి. ప్రపంచానికి ప్రయోజనం చేకూర్చడానికి పక్షపాతం లేని నాణ్యమైన డేటాసెట్లను అభివృద్ధి చేయాలి. AI అనేది ప్రజల-కేంద్రీకృత అప్లికేషన్ల గురించి ఉండాలి. సైబర్ భద్రత, తప్పుడు సమాచారం , డీప్ ఫేక్ కి సంబంధించిన ఆందోళనల్ని పరిష్కరించాలి” అని మోడీ చెప్పారు.
ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, ఇతర అనే క రంగాల్లో ఏఐ ఉపయోగాల గురించి మాట్లాడారు. సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాలకు సాధన సులభతరం అయ్యే ప్రపంచాన్ని సృష్టించడంలో ఏఐ సహాయపడుతుందని అన్నారు. ఏఐ ద్వారా అత్యంత భయపడే అంశం ఉద్యోగాల పోవడం అని చెప్పారు. కాలానుగుణంగా ఉద్యోగాల స్వభావం మారుతుందని, కొత్త రకాల ఉద్యోగాలు సృష్టించబడుతాయని చెప్పారు. ఏఐ ఆధారిత భవిష్యత్తు కోసం మన ప్రజలు స్కీల్స్, రీ స్కిల్స్ కోసం కల్పించాల్సిన అవసరాన్ని ప్రధాని మోడీ చెప్పారు.
తాజావార్తలు
-
Akhil Akkineni : మూడో రోజుకి బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా చాలా రోజుల తర్వాత జరిగింది
-
Oppo New Mobile: 10,000mAh బ్యాటరీ, 50MP సెల్ఫీ కెమెరా.. లాంచ్కు ముందే లీకైన ఒప్పో A7 ప్రో మాక్స్ ఫీచర్స్ ఇవే..
-
Hamas: హమాస్కు కొత్త బాస్.. ఖలీల్ అల్-హయ్యా చేతుల్లోకి పగ్గాలు!
-
Ruturaj Gaikwad: ఎట్టకేలకు బంపర్ ఆఫర్ కొట్టేసిన రుతురాజ్ గైక్వాడ్.. కెప్టెన్గా నియామకం..
-
Telangana Health: జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ.. రూ.200 కోట్లు అదనపు నిధులు ప్రకటన..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!