Kristalina Georgieva: ఏఐ ఎఫెక్ట్.. 40% ఉద్యోగాల హాంఫట్..? భారత్కు ఇది కీలక పరీక్ష!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kristalina Georgieva: ఏఐ అంటేనే ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఉద్యోగులకు భయంగా మారింది. తాజాగా మరో వార్త టెక్ రంగాన్ని కుదిపేస్తోంది. ప్రపంచ ఉద్యోగ రంగాన్ని కుదిపేసే భారీ మార్పులు కృత్రిమ మేధస్సు వల్ల రాబోతున్నాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి అధిపతి క్రిస్టలినా జార్జీవా హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 40 శాతం ఉద్యోగాలపై ఏఐ ప్రభావం పడే అవకాశం ఉందని అంచనా వేశారు. ముఖ్యంగా కెరీర్ ప్రారంభ దశలో ఉన్న యువతకు ఇది పెద్ద సవాల్గా మారబోతోందని ఆమె స్పష్టం చేశారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ ప్రభావం 60 శాతం వరకు ఉండొచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. భారత్లో ఈ ప్రభావం సుమారు 26 శాతం వరకు ఉంటుందని పేర్కొన్నారు. సంఖ్య తక్కువగా కనిపించినా ఏటా లక్షలాది మంది ఉద్యోగ రంగంలోకి వస్తున్న దేశంగా భారత్కు ఇది చిన్న విషయం కాదు. ప్రవేశ స్థాయి ఉద్యోగాల్లో ఎక్కువగా పునరావృత పనులు ఉండటంతో అవి ఆటోమేషన్కు త్వరగా గురయ్యే ప్రమాదం ఉంది. అందుకే కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం మాత్రమే కాదు.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వాటిని మార్చుకునే సామర్థ్యం కూడా అవసరమని ఆమె వివరించారు.
READ MORE: T20 World Cup: పాకిస్తాన్ ట్రాప్లో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్.. యూనస్ సంతోషం కోసమే డ్రామా..
Also Read
- Motorola: మోటో నుంచి విడుదలకు అదిరిపోయే స్మార్ట్ ఫోన్స్.. కీలక సమాచారం లీక్.. 200MP కెమెరాతో..
- Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్... మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
- New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
- Top 5 Expensive Phones: భారత్లో అత్యంత ఖరీదైన 5 స్మార్ట్ఫోన్లు.. 2TB స్టోరేజ్, ధరలు తెలిస్తే షాక్!
పాలసీల విషయంలో ప్రపంచం ఇంకా వెనుకబడిపోయిందని క్రిస్టలినా జార్జీవా అభిప్రాయపడ్డారు. ఈ మార్పునకు ప్రజలను సిద్ధం చేసే విధానాలు వేగంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అయితే సరైన రీతిలో ఉపయోగించగలిగితే ఏఐ భారత్ ఆర్థిక వ్యవస్థకు అదనంగా 0.7 శాతం వృద్ధిని తీసుకురాగలదని వివరించారు. దీని ద్వారా దేశం దీర్ఘకాలిక వృద్ధి లక్ష్యాలకు దగ్గరవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో మాట్లాడిన ఆమె.. ప్రధాని నరేంద్ర మోడీ తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. పన్ను వ్యవస్థలో మార్పులు, కార్మిక రంగంలో సంస్కరణలు, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బలమైన డిజిటల్ ఐడెంటిటీ వ్యవస్థ దేశాన్ని మరింత పోటీ సామర్థ్యం కలిగినదిగా మార్చాయని అన్నారు. పదేళ్ల క్రితం చూసిన భారత్తో పోలిస్తే ఇప్పుడు అవకాశాలకు మరింత పెరిగాయని, సులభతరంగా మారయన్నారు. ఇక ముందు ప్రధానంగా చేయాల్సిన పని విద్యా వ్యవస్థను ఏఐ యుగానికి అనుగుణంగా మార్చడమేనని చెప్పారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: మీరే మాకు అతిపెద్ద బలం, మీ కోసం ఏదైనా చేస్తాం.. హర్మన్ప్రీత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Ramayana: గణేష్ చతుర్థి రోజున ‘రామాయణం’ నుంచి దివ్యమైన సర్ప్రైజ్!
-
Kollywood Sequel Flops : కోలీవుడ్ స్టార్స్కు కలిసిరాని సీక్వెల్స్.. జైలర్ 2 పరిస్థితి ఏంటో?
-
Toxic OTT: బాక్సాఫీస్లో షాక్.. ఇప్పుడు ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’, స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
-
Oman Coast Ship Attack: ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై దాడి.. ఒకరు గల్లంతు
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?