Kristalina Georgieva: ఏఐ ఎఫెక్ట్.. 40% ఉద్యోగాల హాంఫట్..? భారత్కు ఇది కీలక పరీక్ష!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kristalina Georgieva: ఏఐ అంటేనే ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఉద్యోగులకు భయంగా మారింది. తాజాగా మరో వార్త టెక్ రంగాన్ని కుదిపేస్తోంది. ప్రపంచ ఉద్యోగ రంగాన్ని కుదిపేసే భారీ మార్పులు కృత్రిమ మేధస్సు వల్ల రాబోతున్నాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి అధిపతి క్రిస్టలినా జార్జీవా హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 40 శాతం ఉద్యోగాలపై ఏఐ ప్రభావం పడే అవకాశం ఉందని అంచనా వేశారు. ముఖ్యంగా కెరీర్ ప్రారంభ దశలో ఉన్న యువతకు ఇది పెద్ద సవాల్గా మారబోతోందని ఆమె స్పష్టం చేశారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ ప్రభావం 60 శాతం వరకు ఉండొచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. భారత్లో ఈ ప్రభావం సుమారు 26 శాతం వరకు ఉంటుందని పేర్కొన్నారు. సంఖ్య తక్కువగా కనిపించినా ఏటా లక్షలాది మంది ఉద్యోగ రంగంలోకి వస్తున్న దేశంగా భారత్కు ఇది చిన్న విషయం కాదు. ప్రవేశ స్థాయి ఉద్యోగాల్లో ఎక్కువగా పునరావృత పనులు ఉండటంతో అవి ఆటోమేషన్కు త్వరగా గురయ్యే ప్రమాదం ఉంది. అందుకే కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం మాత్రమే కాదు.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వాటిని మార్చుకునే సామర్థ్యం కూడా అవసరమని ఆమె వివరించారు.
READ MORE: T20 World Cup: పాకిస్తాన్ ట్రాప్లో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్.. యూనస్ సంతోషం కోసమే డ్రామా..
Also Read
- Sony Xperia 1 VIII: త్వరలో వస్తోన్న Sony Xperia 1 VIII.. ధర, రిలీజ్ డేట్, ఫీచర్స్
- Samsung Mini LED TV: సామ్ సంగ్ మినీ LED టీవీ భారత్ లో విడుదల.. నెక్ట్స్ జెన్ AI ఫీచర్లతో ప్రీమియం ఎక్స్పీరియన్స్
- Google Fitbit Air: మీ మెడికల్ రిపోర్టులను విశ్లేషించే AI కోచ్.. గూగుల్ నుంచి స్క్రీన్ లేని వినూత్న ఫిట్నెస్ ట్రాకర్ ..
- LED Smart TV: స్మార్ట్ టీవీలపై బంపర్ డీల్స్.. ఎల్ఈడీ స్మార్ట్ టీవీ రూ. 5499కే..
పాలసీల విషయంలో ప్రపంచం ఇంకా వెనుకబడిపోయిందని క్రిస్టలినా జార్జీవా అభిప్రాయపడ్డారు. ఈ మార్పునకు ప్రజలను సిద్ధం చేసే విధానాలు వేగంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అయితే సరైన రీతిలో ఉపయోగించగలిగితే ఏఐ భారత్ ఆర్థిక వ్యవస్థకు అదనంగా 0.7 శాతం వృద్ధిని తీసుకురాగలదని వివరించారు. దీని ద్వారా దేశం దీర్ఘకాలిక వృద్ధి లక్ష్యాలకు దగ్గరవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో మాట్లాడిన ఆమె.. ప్రధాని నరేంద్ర మోడీ తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. పన్ను వ్యవస్థలో మార్పులు, కార్మిక రంగంలో సంస్కరణలు, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బలమైన డిజిటల్ ఐడెంటిటీ వ్యవస్థ దేశాన్ని మరింత పోటీ సామర్థ్యం కలిగినదిగా మార్చాయని అన్నారు. పదేళ్ల క్రితం చూసిన భారత్తో పోలిస్తే ఇప్పుడు అవకాశాలకు మరింత పెరిగాయని, సులభతరంగా మారయన్నారు. ఇక ముందు ప్రధానంగా చేయాల్సిన పని విద్యా వ్యవస్థను ఏఐ యుగానికి అనుగుణంగా మార్చడమేనని చెప్పారు.
తాజావార్తలు
-
Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్గా ఇలా ట్రై చేయండి!
-
Tamil Politics: విజయ్పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
-
RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!
-
PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
-
PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?