Kristalina Georgieva: ఏఐ ఎఫెక్ట్.. 40% ఉద్యోగాల హాంఫట్..? భారత్కు ఇది కీలక పరీక్ష!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kristalina Georgieva: ఏఐ అంటేనే ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఉద్యోగులకు భయంగా మారింది. తాజాగా మరో వార్త టెక్ రంగాన్ని కుదిపేస్తోంది. ప్రపంచ ఉద్యోగ రంగాన్ని కుదిపేసే భారీ మార్పులు కృత్రిమ మేధస్సు వల్ల రాబోతున్నాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి అధిపతి క్రిస్టలినా జార్జీవా హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 40 శాతం ఉద్యోగాలపై ఏఐ ప్రభావం పడే అవకాశం ఉందని అంచనా వేశారు. ముఖ్యంగా కెరీర్ ప్రారంభ దశలో ఉన్న యువతకు ఇది పెద్ద సవాల్గా మారబోతోందని ఆమె స్పష్టం చేశారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ ప్రభావం 60 శాతం వరకు ఉండొచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. భారత్లో ఈ ప్రభావం సుమారు 26 శాతం వరకు ఉంటుందని పేర్కొన్నారు. సంఖ్య తక్కువగా కనిపించినా ఏటా లక్షలాది మంది ఉద్యోగ రంగంలోకి వస్తున్న దేశంగా భారత్కు ఇది చిన్న విషయం కాదు. ప్రవేశ స్థాయి ఉద్యోగాల్లో ఎక్కువగా పునరావృత పనులు ఉండటంతో అవి ఆటోమేషన్కు త్వరగా గురయ్యే ప్రమాదం ఉంది. అందుకే కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం మాత్రమే కాదు.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వాటిని మార్చుకునే సామర్థ్యం కూడా అవసరమని ఆమె వివరించారు.
READ MORE: T20 World Cup: పాకిస్తాన్ ట్రాప్లో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్.. యూనస్ సంతోషం కోసమే డ్రామా..
Also Read
- OnePlus: ఇండియాను వదిలి వెళ్లి పోతున్న వన్ ప్లస్..? క్లారిటీ..
- Airtel Perplexity Pro: ఎయిర్టెల్ యూజర్లకు అలర్ట్.. రేపటిలోగా ఈ పని చేయకపోతే ఖాతా నుంచి డబ్బు కట్!
- Vivo T5 Lite: వివో T5 లైట్ 44W 5G ఫోన్ రిలీజ్.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, MediaTek Dimensity 6300 ప్రాసెసర్
- 50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
పాలసీల విషయంలో ప్రపంచం ఇంకా వెనుకబడిపోయిందని క్రిస్టలినా జార్జీవా అభిప్రాయపడ్డారు. ఈ మార్పునకు ప్రజలను సిద్ధం చేసే విధానాలు వేగంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అయితే సరైన రీతిలో ఉపయోగించగలిగితే ఏఐ భారత్ ఆర్థిక వ్యవస్థకు అదనంగా 0.7 శాతం వృద్ధిని తీసుకురాగలదని వివరించారు. దీని ద్వారా దేశం దీర్ఘకాలిక వృద్ధి లక్ష్యాలకు దగ్గరవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో మాట్లాడిన ఆమె.. ప్రధాని నరేంద్ర మోడీ తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. పన్ను వ్యవస్థలో మార్పులు, కార్మిక రంగంలో సంస్కరణలు, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బలమైన డిజిటల్ ఐడెంటిటీ వ్యవస్థ దేశాన్ని మరింత పోటీ సామర్థ్యం కలిగినదిగా మార్చాయని అన్నారు. పదేళ్ల క్రితం చూసిన భారత్తో పోలిస్తే ఇప్పుడు అవకాశాలకు మరింత పెరిగాయని, సులభతరంగా మారయన్నారు. ఇక ముందు ప్రధానంగా చేయాల్సిన పని విద్యా వ్యవస్థను ఏఐ యుగానికి అనుగుణంగా మార్చడమేనని చెప్పారు.
తాజావార్తలు
-
AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం..
-
US-Iran War: ‘ట్రంప్ను చంపేస్తాం’.. శవపేటికలో అమెరికా అధ్యక్షుడు..ఇరాన్ ప్రచారం..
-
ICC Fined: బిగ్షాక్.. టీమిండియా యువ పేసర్కు భారీ జరిమానా విధించిన ఐసీసీ..
-
Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్కు సెన్సార్ క్లియర్.. ఆ 34 నిమిషాల ఫుటేజ్కూ గ్రీన్ సిగ్నల్!
-
Earthquake: న్యూజిలాండ్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!