Bangladesh: భారత్లో బంగ్లాదేశ్ జడ్జిలకు ట్రైనింగ్.. రద్దు చేసిన యూనస్ సర్కార్..
- భారత్లో బంగ్లాదేశ్ జడ్జిలకు ట్రైనింగ్ క్యాన్సల్..
- భారత వ్యతిరేక విధానాలను ప్రదర్శిస్తున్న యూనస్ సర్కార్..
- బంగ్లాదేశ్లో పెరుగుతున్న భారత వ్యతిరేకత..
- మతోన్మాదులకు అడ్డాగా మారిన పొరుగు దేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: భారతదేశంలో బంగ్లాదేశ్కి చెందిన దిగువ న్యాయవ్యవస్థ జడ్జిలకు ట్రైనింగ్ కార్యక్రమాన్ని అక్కడి యూనస్ సర్కార్ రద్దు చేసింది. ఒక రోజు శిక్షణా కార్యక్రమంలో పాల్గొంటారని ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన ఒక రోజు తర్వాత దానిని రద్దు చేసింది. ఈ శిక్షణా కార్యక్రమం ఫిబ్రవరి 10 నుంచి మధ్యప్రదేశ్లోని నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ అండ్ స్టేట్ జ్యుడీషియల్ అకాడమీలో జరగాల్సి ఉంది. శిక్షణకు సంబంధించిన అన్ని ఖర్చుల్ని భారత ప్రభుత్వమే భరించాల్సి ఉంది. అయితే, నోటిఫికేషన్ రద్దు చేశామని బంగ్లా న్యాయమంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు. రద్దుకు సంబంధించిన వివరణ మాత్రం ఇవ్వలేదు. బంగ్లాదేశ్లోని సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రద్దు చేసినట్లు ది డైలీ స్టార్ పత్రిక నివేదించింది.
Read Also: India weapon: ఈ భారత ఆయుధం అంటే చైనా, పాక్కి భయం.. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్..
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
బంగ్లాదేశ్లో విద్యార్థుల హింసాత్మక నిరసనల మధ్య షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి ఆగస్టు 05న భారత్ వచ్చేసింది. ఆ తర్వాత ఏర్పడిన మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం భారత వ్యతిరేఖ వైఖరిని అవలంభిస్తోంది. ముఖ్యంగా అక్కడి మైనారిటీలైన హిందువుల ఇళ్లు, వ్యాపారాలు, గుడులపై దాడులు చేస్తున్న పట్టించుకోవడం లేదు. ఈ దాడులకు పాల్పడుతున్న జమాతే ఇస్లామీ, అన్సరుల్ బంగ్లా వంటి మతోన్మాద శక్తులు ఇప్పుడు యూనస్ సర్కారులో కీలకంగా ఉన్నారు.
ఇదే కాకుండా, భారత్ వ్యతిరేకతతో పాటు పాకిస్తాన్ అనుకూల వైఖరిని ప్రదర్శిస్తోంది బంగ్లాదేశ్. 1970 కాలం నాటి పాకిస్తాన్ ఊచకోతను మరిచిపోయి బంగ్లాదేశ్ ఆ దేశానికి దగ్గర కావాలని చూస్తోంది. గత 5 దశాబ్ధాల కాలంలో ఎప్పుడూ జరగని విధంగా కరాచీ నుంచి ఢాకాకు పాకిస్తాన్ కార్గో నౌకలు వచ్చాయి. ఇదే కాకుండా పాకిస్తాన్ సైన్యం త్వరలో బంగ్లాదేశ్ సైన్యానికి శిక్షణ కూడా ఇవ్వబోతోంది. ఈ పరిణామాలు భారత్కి ఆందోళన కలిగించే విధంగా ఉంది.
తాజావార్తలు
-
God Of War : సోషల్ మీడియాని షేక్ చేస్తున్న Jr. NTR – త్రివిక్రమ్ ‘గాడ్ ఆఫ్ వార్’
-
Peddi OTT Release: రామ్ చరణ్ ‘పెద్ది’ ఇప్పుడు ఇంట్లోనే.. కానీ ఈ ఒక్క భాషకు వెయిటింగ్ తప్పదు!
-
Astrology: జూన్ 29 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
-
Vastu Tips: ఇంట్లో పాత క్యాలెండర్లు ఇంకా ఉంచుతున్నారా? వాస్తు ప్రకారం ఇది మంచిదేనా?
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!