Ayodhya Mosque: అయోధ్య మసీదుకి అడ్డంకి క్లియర్.. ఆసుపత్రి కూడా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya Mosque:2019లో అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో (బాబ్రీ మసీదును కూల్చివేసిన) రామాలయం నిర్మాణానికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు.. అదే సమయంలో అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి వీలుగా ఐదు ఎకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డుకి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు వెలువడిన తర్వాత రామాలయం నిర్మాణం ప్రారంభం అవ్వగా.. ఇప్పుడు మసీదు పనులు కూడా మొదలు కాబోతున్నాయి. ఇన్నాళ్లూ స్థలం అనుమతి విషయాన్ని పెండింగ్లో ఉన్న వ్యవహారంపై అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ తాజాగా క్లియరెన్స్ ఇచ్చింది. అయోధ్య సమీపంలోని లక్నో-ఫైజాబాద్ హైవే పక్కనున్న దన్నిపూర్ గ్రామంలో మసీదుని నిర్మించబోతున్నారు.
Minister KTR: అంతర్జాతీయ సంస్థలకు హైదరాబాద్ గమ్యస్థానం
Also Read
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
- Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
మసీదు నిర్మాణం కోసం స్థలం అనుమతి కోసం ఎంతోకాలంగా వెయిట్ చేయగా.. ఎట్టకేలకు ఇన్నాళ్లకు అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ నుంచి అనుమతి లభించిందని ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ సెక్రటరీ ఆథర్ హుస్సేన్ తెలిపారు. ఇంకా అగ్ని ప్రమాదం అనుమతి ఒక్కటే మిగిలుందని అన్నారు. తాము కేవలం మసీదుని మాత్రమే నిర్మించడం లేదని, 200 పడకల ఆసుపత్రిని కూడా తమకు మసీదు నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలో కట్టబోతున్నట్టు ఆయన వెల్లడించారు. తొలి దశలో రూ. 100 కోట్లు, రెండో దశలో రూ.100 కోట్లు వెచ్చించనున్నామని పేర్కొన్నారు. ఈ టైంలోనే మసీదుకి సంబంధించి ఒక డిజైన్ని విడుదల చేశారు. అది ఎంతో అధునాతనంగా, ఆకర్షణీయంగా ఉండటంతో.. దాని గురించి నెట్టింట్లో చర్చలు కొనసాగుతున్నాయి.
Parliament Winter Session: చైనా-భారత్ ఘర్షణ.. లోక్సభలో చర్చకు కాంగ్రెస్ డిమాండ్
కాగా.. 1992 డిసంబర్ 6వ తేదీన ఒక కరసేవకుల గుంపు అయోధ్యలో ఉన్న 16వ శతాబ్దపు కట్టడం బాబ్రీ మసీదును కూల్చివేసింది. ఆరోజుల్లో దేశంలో నెలకొన్న మతపరమైన ఉద్రిక్తతలే ఈ సంఘటనకు దారి తీసింది. ఈ ఘటనలో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. అప్పట్నుంచి ఈ వివాదాస్పద విషయం 2019లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేదాకా కొలిక్కి రాలేదు. అంతకుముందు 2010 సెప్టెంబర్ 30వ తేదీన ఈ వివాదాస్పద స్థలాన్ని రామజన్మభూమిగా ప్రకటిస్తూ.. అలహాబాద్ హైకోర్ట్ చారిత్రక తీర్పు ఇచ్చింది. అయితే.. ఈ తీర్పుపై సుప్రీంకోర్టు 2011లో స్టే విధించింది. 2017లో అలహాబాద్ హైకోర్టు తీర్పును రద్దు చేస్తూ.. విచారణకు ఆదేశాలిచ్చింది. 2019లో ఇరు వర్గాలకు న్యాయం చేస్తూ.. రామాలయం, మసీదుకి నిర్మాణాలకి స్థలాల్ని కేటాయించింది.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!