Ayodhya Mosque: అయోధ్య మసీదుకి అడ్డంకి క్లియర్.. ఆసుపత్రి కూడా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya Mosque:2019లో అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో (బాబ్రీ మసీదును కూల్చివేసిన) రామాలయం నిర్మాణానికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు.. అదే సమయంలో అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి వీలుగా ఐదు ఎకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డుకి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు వెలువడిన తర్వాత రామాలయం నిర్మాణం ప్రారంభం అవ్వగా.. ఇప్పుడు మసీదు పనులు కూడా మొదలు కాబోతున్నాయి. ఇన్నాళ్లూ స్థలం అనుమతి విషయాన్ని పెండింగ్లో ఉన్న వ్యవహారంపై అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ తాజాగా క్లియరెన్స్ ఇచ్చింది. అయోధ్య సమీపంలోని లక్నో-ఫైజాబాద్ హైవే పక్కనున్న దన్నిపూర్ గ్రామంలో మసీదుని నిర్మించబోతున్నారు.
Minister KTR: అంతర్జాతీయ సంస్థలకు హైదరాబాద్ గమ్యస్థానం
Also Read
- Rajasthan: పదవీ విరమణకు ఒకరోజు ముందు షాక్.. ఉద్యోగాన్ని కోల్పోయిన టీచర్.. కారణం తెలిస్తే..!
- Trump-Modi: మోడీకి ఫోన్ చేయాలి.. ‘‘ఆయన లేస్తారు.. ఆయన కూడా నాలాగే’’.. వెలుగులోకి ట్రంప్ సంభాషణ
- PM Modi: సా.4గంటలకు అన్ని శాఖలతో మోడీ కీలక సమావేశం.. దేనికోసమంటే..!
- Supreme Court: E20 పెట్రోల్పై సుప్రీంకోర్టులో కీలక విచారణ.. సంచలన విషయాన్ని బయటపెట్టిన కేంద్రం!
మసీదు నిర్మాణం కోసం స్థలం అనుమతి కోసం ఎంతోకాలంగా వెయిట్ చేయగా.. ఎట్టకేలకు ఇన్నాళ్లకు అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ నుంచి అనుమతి లభించిందని ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ సెక్రటరీ ఆథర్ హుస్సేన్ తెలిపారు. ఇంకా అగ్ని ప్రమాదం అనుమతి ఒక్కటే మిగిలుందని అన్నారు. తాము కేవలం మసీదుని మాత్రమే నిర్మించడం లేదని, 200 పడకల ఆసుపత్రిని కూడా తమకు మసీదు నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలో కట్టబోతున్నట్టు ఆయన వెల్లడించారు. తొలి దశలో రూ. 100 కోట్లు, రెండో దశలో రూ.100 కోట్లు వెచ్చించనున్నామని పేర్కొన్నారు. ఈ టైంలోనే మసీదుకి సంబంధించి ఒక డిజైన్ని విడుదల చేశారు. అది ఎంతో అధునాతనంగా, ఆకర్షణీయంగా ఉండటంతో.. దాని గురించి నెట్టింట్లో చర్చలు కొనసాగుతున్నాయి.
Parliament Winter Session: చైనా-భారత్ ఘర్షణ.. లోక్సభలో చర్చకు కాంగ్రెస్ డిమాండ్
కాగా.. 1992 డిసంబర్ 6వ తేదీన ఒక కరసేవకుల గుంపు అయోధ్యలో ఉన్న 16వ శతాబ్దపు కట్టడం బాబ్రీ మసీదును కూల్చివేసింది. ఆరోజుల్లో దేశంలో నెలకొన్న మతపరమైన ఉద్రిక్తతలే ఈ సంఘటనకు దారి తీసింది. ఈ ఘటనలో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. అప్పట్నుంచి ఈ వివాదాస్పద విషయం 2019లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేదాకా కొలిక్కి రాలేదు. అంతకుముందు 2010 సెప్టెంబర్ 30వ తేదీన ఈ వివాదాస్పద స్థలాన్ని రామజన్మభూమిగా ప్రకటిస్తూ.. అలహాబాద్ హైకోర్ట్ చారిత్రక తీర్పు ఇచ్చింది. అయితే.. ఈ తీర్పుపై సుప్రీంకోర్టు 2011లో స్టే విధించింది. 2017లో అలహాబాద్ హైకోర్టు తీర్పును రద్దు చేస్తూ.. విచారణకు ఆదేశాలిచ్చింది. 2019లో ఇరు వర్గాలకు న్యాయం చేస్తూ.. రామాలయం, మసీదుకి నిర్మాణాలకి స్థలాల్ని కేటాయించింది.
తాజావార్తలు
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Ketan Agarwal Case: తొలిసారి మీడియా ముందు నోరు విప్పిన సియా సోదరుడు.. ఏం చెప్పాడంటే..!
-
Pakistan: పాకిస్థాన్లో హై అలర్ట్.. ఇమ్రాన్ ఖాన్ ఉన్న జైలు నుంచి 14 మంది ఖైదీలు పరార్! అసలేం జరిగిందంటే?
-
TG Bharath: రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 10 లక్షల ఉద్యోగాలే లక్ష్యం.!
-
Rajasthan: పదవీ విరమణకు ఒకరోజు ముందు షాక్.. ఉద్యోగాన్ని కోల్పోయిన టీచర్.. కారణం తెలిస్తే..!
ట్రెండింగ్
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!