Jammu Kashmir: “ఇద్దరు ఆర్మీ అధికారుల మృతి”.. ప్రతీకార దాడిగా పేర్కొన్న లష్కరేతోయిబా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని కోకెర్ నాగ్ ప్రాంతంలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్ లో ఇద్దరు ఆర్మీ అధికారుల, ఒక డీఎస్పీ మరణించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది. భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో కల్నల్ మన్ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధోనాక్, డీఎస్పీ హుమాయున్ భట్లు వీర మరణం పొందారు. 19 రాష్ట్రీయ రైఫిల్స్కు కమాండింగ్ ఆఫీసర్గా ఉన్న కల్నల్ సింగ్ అక్కడికక్కడే మరణించగా, మేజర్ ధోనాక్, డీఎస్పీ భట్ గాయపడి మరణించారు.
Read Also: Nagpur: రేప్ కేసు పెడతానని యువతి బెదిరింపు.. ఫేస్బుక్ లైవ్లో యువకుడి ఆత్మహత్య
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ, అనుబంధంగా పనిచేస్తున్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడికి కారణమని తెలుస్తోంది. ఇటీవల పాక్ ఆక్రమితక కాశ్మీర్(పీఓకే)లోని రావల్ కోట్ ప్రాంతంలో లష్కరేతోయిబా కమాండర్ రియాజ్ అహ్మద్ అలియాస్ ఖాసింను ఉదయం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తుల కాల్చి చంపారు. దీంతో లష్కరేతోయిబాకు ఎదురుదెబ్బ తగిలింది. రియాజ్ అహ్మద్ తండ్రి కూడా ఉగ్రవాదే. అతడిని భద్రతాబలగాలు 2005లో మట్టుపెట్టాయి. రియాజ్ అహ్మద్ మరణానికి ప్రతీకారంగానే తాజా దాడి జరిపినట్లు లష్కరోతోయిబా పేర్కొంది.
ఇదిలా ఉంటే నిన్నటి దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఏరిపారేసేందుకు అనంత్ నాగ్ లో గురువారం కౌంటర్ టెర్రర్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇద్దరు ఉగ్రవాదులను చుట్టుముట్టినట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు గురువారం తెలిపారు. ఉగ్రవాదుల్లో ఒకరిని ఉజైర్ ఖాన్ గా పోలీసులు గుర్తించారు. ఈ ఎన్కౌంటర్ లో వీరమరణం పొందిన కల్నల్ మన్ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధోనక్, DSP హుమాయున్ భట్ తిరుగులేని పరాక్రమానికి కాశ్మీర్ జోన్ పోలీసులు నివాళులు అర్పించారు.
తాజావార్తలు
-
IRCTC Beta Website 2026: ఐఆర్ సీటీసీ కొత్త వెబ్సైట్ వచ్చేసింది.. కొత్త బీటా వెబ్సైట్లో ఏమేం మారాయంటే?
-
Lionel Messi: 39 ఏళ్ల మెస్సీ.. మరో చరిత్రకు అడుగు దూరంలో.. గోల్డెన్ బూట్ గెలుస్తాడా?
-
Lionel Messi:19ఏళ్ల క్రితం మెస్సీ చేతుల్లో పెరిగిన బుడతడు.. ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో అతడికే సవాల్ విసురుతున్న చిచ్చరపిడుగు!
-
Vrushakarma OTT Deal: థియేటర్లకు ముందే ‘వృషకర్మ’ సంచలనం.. నాగ చైతన్య కెరీర్లోనే అతిపెద్ద డీల్ ఇదేనా?
-
Argentina vs England 2026: ఇంగ్లాండ్పై అర్జెంటీనా సంచలన విజయం.. వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!