Jammu Kashmir: “ఇద్దరు ఆర్మీ అధికారుల మృతి”.. ప్రతీకార దాడిగా పేర్కొన్న లష్కరేతోయిబా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని కోకెర్ నాగ్ ప్రాంతంలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్ లో ఇద్దరు ఆర్మీ అధికారుల, ఒక డీఎస్పీ మరణించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది. భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో కల్నల్ మన్ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధోనాక్, డీఎస్పీ హుమాయున్ భట్లు వీర మరణం పొందారు. 19 రాష్ట్రీయ రైఫిల్స్కు కమాండింగ్ ఆఫీసర్గా ఉన్న కల్నల్ సింగ్ అక్కడికక్కడే మరణించగా, మేజర్ ధోనాక్, డీఎస్పీ భట్ గాయపడి మరణించారు.
Read Also: Nagpur: రేప్ కేసు పెడతానని యువతి బెదిరింపు.. ఫేస్బుక్ లైవ్లో యువకుడి ఆత్మహత్య
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్పింగ్కు తేల్చి చెప్పిన మోడీ..
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్పింగ్..
లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ, అనుబంధంగా పనిచేస్తున్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడికి కారణమని తెలుస్తోంది. ఇటీవల పాక్ ఆక్రమితక కాశ్మీర్(పీఓకే)లోని రావల్ కోట్ ప్రాంతంలో లష్కరేతోయిబా కమాండర్ రియాజ్ అహ్మద్ అలియాస్ ఖాసింను ఉదయం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తుల కాల్చి చంపారు. దీంతో లష్కరేతోయిబాకు ఎదురుదెబ్బ తగిలింది. రియాజ్ అహ్మద్ తండ్రి కూడా ఉగ్రవాదే. అతడిని భద్రతాబలగాలు 2005లో మట్టుపెట్టాయి. రియాజ్ అహ్మద్ మరణానికి ప్రతీకారంగానే తాజా దాడి జరిపినట్లు లష్కరోతోయిబా పేర్కొంది.
ఇదిలా ఉంటే నిన్నటి దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఏరిపారేసేందుకు అనంత్ నాగ్ లో గురువారం కౌంటర్ టెర్రర్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇద్దరు ఉగ్రవాదులను చుట్టుముట్టినట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు గురువారం తెలిపారు. ఉగ్రవాదుల్లో ఒకరిని ఉజైర్ ఖాన్ గా పోలీసులు గుర్తించారు. ఈ ఎన్కౌంటర్ లో వీరమరణం పొందిన కల్నల్ మన్ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధోనక్, DSP హుమాయున్ భట్ తిరుగులేని పరాక్రమానికి కాశ్మీర్ జోన్ పోలీసులు నివాళులు అర్పించారు.
తాజావార్తలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
-
Secret Soldiers: ‘చైనా’ పేరుతో సెన్సార్ బోర్డ్లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
-
OTR: సిగ్గా.. భయమా.. మొహమాటమా? అంజిరెడ్డి తీరుపై బీజేపీలో హాట్ టాపిక్
-
OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
-
OTR: తెలంగాణ కేబినెట్లో విజయశాంతికి ఛాన్స్? ఢిల్లీలో గట్టిగా లాబీయింగ్!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!