Karnataka: బెలగావిలో ‘‘ఔరంగజేబు’’ పోస్టర్ కలకలం..
- కర్ణాటకలో ఔరంగజేబ్ బ్యానర్ల కలకలం..
- స్థానికంగా ఉద్రిక్తత పెంచిన ఘటన..
- బ్యానర్లు తొలగించి.. భద్రత పెంచిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటకలో మరోసారి ఔరంగజేబ్ పోస్టర్లు కలకలం రేపాయి. బెలగావిలో షాహు నగర్ ప్రాంతంలో ఔరంగజేబ్ పోస్టర్లను గుర్తుతెలియని వ్యక్తులు పెట్టడం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఔరంగజేబ్ని ‘‘సుల్తాన్-ఏ-హింద్’’, ‘‘అఖండ భారత్ నిజమైన స్థాపకుడు’’ అని అభివర్ణించే పోస్టర్లనున ఆయన జయంతి సందర్భంగా ఉంచారు.
Read Also: AUS vs IND: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్.. భారత్ మేనేజ్మెంట్ కీలక నిర్ణయం!
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
అయితే, ఈ పోస్టర్లు స్థానికంగా ఉద్రిక్తత కలిగించాయి. స్థానికుల నిరసన మధ్య బ్యానర్లను తీసివేసి, ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు భద్రత పెంచారు. స్థానికులు బ్యానర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు, మత ఘర్షణలను రెచ్చగొట్టే ప్రయత్నంగా భావించినందుకు బాధ్యులపై త్వరగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే, బ్యానర్లను తీసివేయడంపై మరో వర్గానికి చెందిన యువకులు సోషల్ మీడియా ద్వారా విమర్శలు చేశారు. పక్కనే ఉన్న హిందూ జాతీయవాద నేత వీర్ సావర్కర్ బ్యానర్ని తాకకుండా, ఔరంగజేబ్ బ్యానర్లను తీసేయడం ఏంటని ప్రశ్నించారు. తమ బ్యానర్లను తీసేస్తే సహించేది లేదని హెచ్చరించారు. బెలగావిలోని లా అండ్ ఆర్డర్ డిప్యూటీ కమీషనర్ రోహన్ జగదీష్ పెరుగుతున్న ఆందోళనలను పరిష్కరించడానికి ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘నవంబర్ 3 ఔరంగజేబ్ పుట్టిన రోజున కొందరు వ్యక్తులు అనుమతి లేకుండా పబ్లిక్ ఆస్తులపై పోస్టర్లు అంటించారు. కార్పొరేషన్ వీటిని తొలగించింది’’ అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?