AAP: ఆప్కి మరో షాక్.. పరువునష్టం కేసులో మంత్రి అతిషీకి కోర్టు సమన్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AAP: ఢిల్లీ లిక్కర్ కేసు, స్వాతి మలివాల్పై దాడి కేసుల్లో సతమతమవుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి మరో షాక్ తగిలింది. ఆప్ మంత్రి అతిషీకి ఢిల్లీ కోర్టు పరువు నష్టం కేసులో సమన్లు జారీ చేసింది. లంచం ఇచ్చి ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందని ఆమె ఆరోపించింది. దీనిపై ఢిల్లీ బీజేపీ మీడియా హెచ్ ప్రవీణ్ శంకర్ కపూర్ పరువు నష్టం కేసు నమోదు చేశారు. జూన్ 29న కోర్టు ముందు హాజరుకావాలని అతిషీని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ని కూడా చేర్చిన ప్రవీణ్ శంకర్ కపూర్.. ఈ ఆరోపణలు తన పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయని పేర్కొన్నారు. ఈ ఆరోపణల్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు అతిషీని నిందితురాలిగా గుర్తించి, జూన్ 29న హాజరుకావాలని ఆదేశించింది.
Read Also: Smartphone Theft: మీ ఫోన్ ఎవరైనా కొట్టేశారా? ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే!
Also Read
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
- Monsoon 2026: మళ్లీ స్టార్ట్ అయిన రుతుపవన ఇంజన్.. ఈ వారం దేశవ్యాప్తంగా విస్తారంగా భారీ వర్షాలు!
- Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
- New Rules From July 1st: రేపటి నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన 10 కీలక మార్పులు ఇవే..!
బీజేపీ, ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించినట్టు తగిన ఆధారాలు చూపించ లేదని ఆరోపిస్తూ ఏప్రిల్ 30న బీజేపీ పరువునష్టం కేసును దాఖలు చేసింది. ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్ చేసిన ట్వీట్ని బీజేపీ కేసులో పేర్కొంది. బీజేపీ ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు, పార్టీ మారేందుకు రూ. 25 కోట్లు ఆఫర్ చేసిందన ఆయన ఆరోపించారు. ఆప్ మంత్రి అతిషీ మాట్లాడుతూ.. తనను పార్టీ మారడానికి బీజేపీ నుంచి ఆఫర్ వచ్చిందని, లేని పక్షంలో ఈడీ అరెస్ట్ చేస్తుందని ఆమె ఆరోపించారు. బీజేపీ సన్నిహితులు తనను సంప్రదించారని, వారు నన్ను బీజేపీలో చేరాలని కోరారని, ఇది తన రాజకీయ జీవితాన్ని కాపాడుతుందని చెప్పారని, మారకపోతే ఈడీ నెల రోజుల్లో తనను అరెస్ట్ చేస్తుందని బెదిరించారని ఆమె ఏప్రిల్లో మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఆప్ నేతలు సౌరభ్ భరద్వాజ్, రాఘవ్ చద్దా, దుర్గేష్ పాఠక్ కూడా త్వరలో అరెస్ట్ చేయబడుతారని ఆమె పేర్కొంది. అతిషి చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని, టీవీ, సోషల్ మీడియాలో క్షమాపణలు చెప్పాలని బీజేపీ నాయకుడు తన పిటిషన్లో కోరారు.
తాజావార్తలు
-
Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
-
SSY vs Fixed Deposit: పిల్లల భవిష్యత్తుకు ఏది బెస్ట్? ఈ తేడాలు తెలుసుకోండి
-
Ma Inti Bangaram: సమంత ఖాతాలో మరో ఘనత.. 100 కోట్ల దిశగా ‘మా ఇంటి బంగారం’
-
Monsoon 2026: మళ్లీ స్టార్ట్ అయిన రుతుపవన ఇంజన్.. ఈ వారం దేశవ్యాప్తంగా విస్తారంగా భారీ వర్షాలు!
-
Amazon Prime Day Sale 2026: అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026.. స్మార్ట్ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్లపై భారీ డిస్కౌంట్లు
ట్రెండింగ్
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?