Delhi: మరోసారి ఆప్ వర్సెస్ కేంద్రం.. సీఎం అతిషి ఇంట్లో వస్తువుల తొలగింపుపై వాగ్యుద్ధం
- మరోసారి ఆప్ వర్సెస్ కేంద్రం
- సీఎం అతిషి ఇంట్లో వస్తువుల తొలగింపుపై వాగ్యుద్ధం
ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్- ఆప్ ప్రభుత్వం మధ్య మరోసారి మాటల యుద్ధం నడుస్తోంది. రెండ్రోజుల క్రితమే ముఖ్యమంత్రి అతిషి.. మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఖాళీ చేసిన అధికారిక బంగ్లాలోకి షిప్ట్ అయ్యారు. అయితే తాజాగా బంగ్లా నుంచి అతిషికి సంబంధించిన వస్తువులను బలవంతంగా తొలగించి సీలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్ష మయ్యాయి. బీజేపీ ఆదేశాల మేరకు ఎల్జీ వీకే. సక్సేనా అతిషి వస్తువులను తొలగించారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది.
గత నెలలో అతిషి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక కేజ్రీవాల్ అక్టోబర్ 4న అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన పార్టీ నేతకు సంబంధించిన ఇంట్లో ఉంటున్నారు. అక్టోబర్ 7న అతిషి.. కేజ్రీవాల్ ఖాళీ చేసిన బంగ్లాలోకి షిప్ట్ అయ్యారు. రెండ్రోజులైనా గడవక ముందే.. ఇంట్లో వస్తువులను తొలగించి.. సీలు చేశారు. ఈ తీరును ఢిల్లీ సీఎంవో తీవ్రంగా ఖండించింది. బలవంతంగా తొలగించారంటూ ఆప్ ప్రభుత్వం ఆరోపించింది. అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయం ఆరోపణలపై లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ఇంకా స్పందించలేదు.
Also Read
‘‘దేశ చరిత్రలో తొలిసారిగా ముఖ్యమంత్రి నివాసాన్ని ఖాళీ చేయించారు. బీజేపీ ఆదేశాల మేరకు లెఫ్టినెంట్ గవర్నర్.. ముఖ్యమంత్రి నివాసం నుంచి ముఖ్యమంత్రి అతిషి వస్తువులను బలవంతంగా తొలగించారు’’ అని ముఖ్యమంత్రి కార్యాలయం ఆరోపించింది. అధికారిక నివాసం నుంచి అనేక డబ్బాలు, సామాను బయటకు తీసుకెళ్తున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి. అంతేకాకుండా ఇంటికి తాళం కూడా వేసేశారు. సరైన పత్రాలను చూపించలేదని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ వర్గాలు పేర్కొన్నాయి.
నార్త్ ఢిల్లీలోని సివిల్ లైన్స్లోని ఫ్లాగ్స్టాఫ్ రోడ్లోని 6వ నంబర్ బంగ్లాకు అతిషి సోమవారం మారారు. అరవింద్ కేజ్రీవాల్ ఈ నివాసంలో తొమ్మిదేళ్ల పాటు ఉన్నారు. అయితే అతిషికి కేటాయింపునకు సంబంధించిన పత్రాలు విషయంలో తర్జనభర్జన జరుగుతున్నట్లు తెలుస్తోంది. కేటాయింపునకు సంబంధించిన పత్రాలు పీడబ్ల్యూడీకి అప్పగించాల్సి ఉంటుందని బీజేపీ తెలిపింది. ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు విజేందర్ గుప్తా మాట్లాడుతూ.. కేజ్రీవాల్ బంగ్లాను ఇంకా ఖాళీ చేయలేదని, అతని వస్తువులు చాలా ఇప్పటికీ బంగ్లాలో ఉన్నాయని ఆరోపించారు.
మరోవైపు బంగ్లాను ఆక్రమించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ ఆరోపించింది. కేజ్రీవాల్ బంగ్లాను ఖాళీ చేసినట్లు డాక్యుమెంటరీ రుజువు ఉన్నప్పటికీ.. బీజేపీ మాత్రం ఈ అంశంపై అబద్ధాలు ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తింది.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!