Arvind Kejriwal: ‘‘ఆదివారం 3 గంటలకు నేను రెడీ’’.. కేజ్రీవాల్ సంచలన ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ జూన్ 2న లొంగిపోయేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు కేజ్రీవాల్కి జూన్ 1 వరకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత లొంగిపోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘‘ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నా ఇంటి నుంచి బయలుదేరుతాను. మేము నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాము, మరియు నేను దేశం కోసం నా జీవితాన్ని త్యాగం చేయాల్సి వస్తే, చింతించొద్దు’’ అని కేజ్రీవాల్ ఈ రోజు విలేకరులు సమావేశంలో అన్నారు.
Read Also: CWC: 150 ప్రధాన రిజర్వాయర్లలో 23 శాతానికి పడిపోయిన నీటి మట్టం..
Also Read
- Mamata Banerjee: ‘‘నన్ను ఆపాలంటే చంపాలి’’.. మమతా దీదీ సంచలన వ్యాఖ్యలు..
- Mumbai: భారీ వర్షాలతో ఆర్థిక రాజధాని అతలాకుతలం.. 12 గంటల్లో 200 మి.మీ రికార్డ్ వర్షం
- PoK: పీఓకేలో పాక్ అణచివేత.. భారత్ జోక్యం కోరిన JAAC
- Stocks Double: రూ. లక్షకు రూ.2 లక్షలు.. రూ.3 లక్షలకు రూ.6 లక్షలు.. ఇలాంటి స్టాక్స్ మనం ఎలా మిస్సయామబ్బా..
50 రోజుల జైలు శిక్షలో తన ఆరోగ్యం గణనీయంగా క్షీణించిందని, ఫలితంగా బరువు తగ్గడంతో పాటు మరికొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, డయాబెటిస్కి మందులు ఇవ్వకుండా తిరస్కరించారని ఆయన అన్నారు. తన ఆరోగ్యంపై వైద్యులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా ఢిల్లీ ప్రజల సంక్షేమమే తన ధ్యేయమని చెప్పారు. ఉచిత విద్యుత్, మొహల్లా క్లినిక్లు, ఆస్పత్రులు, ఉచిత మందులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సేవలు, కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని ఆయన హామీ ఇచ్చారు. ‘‘నేను మీ మధ్య ఉండనప్పటికీ, చింతించొద్దని, అన్ని పనులు జరుగాయి’’ అని కేజ్రీవాల్ అన్నారు. తాను భౌతికంగా మీ మధ్య లేకున్నప్పటికీ, ఏ సంక్షేమ కార్యక్రమం కూడా ఆగదని చెప్పారు. వృద్ధులైన తన తల్లిదండ్రుల శ్రేయస్సు కోసం ప్రార్థించాలని ప్రజలను కోరారు.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మార్చిలో ఈడీ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసింది. అయితే, ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో కేజ్రీవాల్ ప్రధాన సూత్రధారి అని ఈడీ ఆరోపిస్తోంది. ఆప్ రూ. 100 కోట్లను ఈ స్కామ్లో పొందినట్లు ఆరోపిస్తోంది. మరోవైపు ఆప్తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఇదంతా బీజేపీ కుట్రగా అభివర్ణిస్తున్నాయి. ప్రతిపక్ష నాయకులను ఉద్దేశపూర్వకంగా మోడీ సర్కార్ వేధిస్తోందని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
-
Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
-
IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
-
OTR: ప్రతిపక్షం ట్రాప్లో పడుతున్నామని కాంగ్రెస్ పార్టీలో చర్చ
-
OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!