వీరవనితః కరోనా రోగిని వీపుపై మోసి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా సమయంలో ఎవరికి వారే యమునాతీరే అన్న చందంగా మారిపోయాయి జీవితాలు. నేను, నా కుటుంబం బతికుంటే చాలు అనుకునే స్థాయికి చేరుకున్నాయి. అయితే, ఇలాంటి సమయంలో ఓ మహిళ తన వీపుపై కరోనా రోగిని ఎక్కంచుకొని నడుచుకుంటూ వెళ్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అస్సాం రాష్ట్రానికి చెందిన 24 ఏళ్ల మహిళ నిహారిక మామ కరోనా బారిన పడటంతో ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కోన్నది. నగోల్ నగరం సమీపంలోని భాటీగ్రావ్ గ్రామంలో నివశించే నిహారిక మామ కరోనా బారిన పడటంతో ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఆటోను పిలిపించింది. కానీ, రోడ్డు బాగాలేకపోవడంతో ఆటో రాలేదు. దీంతో తులేశ్వర్ దాస్ను వీపుపై ఎక్కించుకొని హెల్త్ కేర్ సెంటర్కు తీసుకెళ్లింది. కరోనా తీవ్రంగా ఉండటంతో నగోల్ కు తీసుకెళ్లింది. నగోల్ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ బెడ్ లేకపోవడంతో మరో ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడి నుంచి నిహారిక మామను వీపుపై ఎక్కించుకొని మరో ఆసుపత్రికి తీసుకెళ్లింది. కొంతమంది ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయింది. ఆమెను ఇంటర్యూ చేసేందుకు అనేక మీడియా సంస్థలు క్యూలు కట్టాయి. తనకు విధిలేని పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందని, ఇలాంటి సమయంలోనే ఒకరికొకరు తోడుగా ఉండాలని నిహారిక పేర్కొన్నది. రెండు గంటలపాటు కరోనా రోగిని వీపుపై మోయడంతో ఆమెకు కూడా కరోనా సోకింది. అయినప్పటికి భయపడకుండా ధైర్యంగా ఉండటం విశేషం.
Also Read
- Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
- Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
- Tags
- Assam
- Corona Patient
- viral
- Women
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!